U 19 World Cup: యువరాణులకు పట్టం
మూడు సార్లు అందినట్లే అంది చేజారిపోయిన కప్.. వన్డేల్లో రెండు సార్లు, టీ20లో ఓ సారి రన్నరప్. అమ్మాయిల క్రికెట్లో భారత్ విశ్వవిజేతగా నిలవాలన్న నిరీక్షణకు ముగింపు ఎప్పుడనే ప్రశ్న.
భారత అమ్మాయిలదే అండర్-19 ప్రపంచకప్
ఫైనల్లో ఇంగ్లాండ్పై గెలుపు
రాణించిన తితాస్, పర్శవి, అర్చన, త్రిష
పొచెఫ్స్ట్రూమ్
మూడు సార్లు అందినట్లే అంది చేజారిపోయిన కప్.. వన్డేల్లో రెండు సార్లు, టీ20లో ఓ సారి రన్నరప్. అమ్మాయిల క్రికెట్లో భారత్ విశ్వవిజేతగా నిలవాలన్న నిరీక్షణకు ముగింపు ఎప్పుడనే ప్రశ్న. ఇప్పుడా జవాబు దొరికింది. సీనియర్ అమ్మాయిలు సాధించలేనిది.. జూనియర్ క్రికెటర్లు అందుకున్నారు. మొట్టమొదటి అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించారు. మహిళల క్రికెట్లో దేశానికి తొలి ప్రపంచకప్ అందించారు. బంతితో చెలరేగిన యువ భారత్.. ఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తుచేసింది.
భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆదివారం అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మొదట బౌలింగ్లో విజృంభించి ఇంగ్లాండ్ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూల్చారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తితాస్ సాధు (2/6)తో పాటు పర్శవి చోప్రా (2/13), అర్చన దేవి (2/17) రాణించారు. ఆ జట్టులో 19 పరుగులు చేసిన రియానా టాప్స్కోరర్ అంటే టీమ్ఇండియా బౌలర్ల దూకుడు అర్థం చేసుకోవచ్చు. స్వల్ప ఛేదనలో 3 వికెట్లు కోల్పోయిన భారత్ 14 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తెలంగాణ బ్యాటర్ గొంగడి త్రిష (24; 29 బంతుల్లో 3×4), సౌమ్య తివారి (24 నాటౌట్; 37 బంతుల్లో 3×4) మెరిశారు.
అలవోకగా..: ఛేదనలో మూడో వికెట్కు త్రిష, సౌమ్య 46 పరుగులు జతచేసి భారత్ను గెలిపించారు. అంతకుముందు ఓపెనర్లు షెఫాలి (15), శ్వేత (5) త్వరగా నిష్క్రమించారు. ఓ ఫోర్, సిక్సర్ బాదిన తర్వాత మిడాన్లో అలెక్సా పట్టిన సూపర్ క్యాచ్కు కెప్టెన్ షెఫాలి ఔటైంది. ఆ తర్వాతి ఓవర్లోనే ఫామ్లో ఉన్న శ్వేత కూడా పెవిలియన్ చేరింది. దీంతో జట్టు 20/2తో తడబడింది. కానీ పట్టు బిగించాలని చూసిన ఇంగ్లాండ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా త్రిష, సౌమ్య జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించారు. సీవెన్స్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సౌమ్యతో పాటు త్రిష కూడా క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకుంది. లక్ష్యం ఎక్కువగా లేకపోవడంతో తొందరపడలేదు. 11 ఓవర్లకు స్కోరు 50/2. ఆ వెంటనే వరుసగా రెండు ఫోర్లతో త్రిష విజయాన్ని వేగవంతం చేసింది. తర్వాతి ఓవర్లో మరో ఫోర్ బాది ఆమె ఔటైనా.. సౌమ్య పని పూర్తిచేసింది. అంతకుముందు పేస్ సంచలనం తితాస్, స్పిన్నర్లు పర్శవి, అర్చన కలిసి ఇంగ్లాండ్ బ్యాటర్లను హడలెత్తించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్ జట్టులో నలుగురే రెండంకెల స్కోరు చేశారంటే.. మన బౌలర్ల అద్భుత ప్రదర్శనే కారణం. నాలుగు ఓవర్లలో తితాస్ ఏకంగా 20 డాట్బాల్స్ వేయడం విశేషం. ఇన్నింగ్స్ నాలుగో బంతికే రిటర్న్ క్యాచ్తో హీప్ (0)ను ఆమె ఔట్ చేసి వికెట్ల పతనాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత పర్శవి, అర్చన రాణించడంతో ఇంగ్లాండ్ పతనం వేగంగా సాగింది.
రూ.5 కోట్ల నజరానా
దిల్లీ: అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. ‘‘భారత్లో మహిళల క్రికెట్ ఊపుమీదుంది. ఈ ప్రపంచకప్ విజయం అమ్మాయిల క్రికెట్ స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది. విజేతగా నిలిచిన జట్టుకు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్లు నగదు బహుమతిగా ప్రకటించడం ఆనందంగా ఉంది. బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీమ్ఇండియా, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్కు ఈ అమ్మాయిల జట్టును ఆహ్వానిస్తున్నా. ఈ ఘనతకు తగిన సంబరాలు చేసుకోవాల్సిందే’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: సీవెన్స్ (సి) త్రిష (బి) దేవి 4; హీప్ (సి) అండ్ (బి) తితాస్ 0; హోలాండ్ (బి) దేవి 10; సెరెన్ (బి) తితాస్ 3; రియానా (సి) దేవి (బి) పర్శవి 19; పావ్లీ ఎల్బీ (బి) పర్శవి 2; అలెక్సా (సి) సోనమ్ (బి) మన్నత్ 11; జోసీ రనౌట్ 4; హన్నా బేకర్ (స్టంప్డ్) (బి) షెఫాలి 0; సోఫియా (సి) అండ్ (బి) సోనమ్ 11; ఎల్లీ అండర్సన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం: (17.1 ఓవర్లలో ఆలౌట్) 68; వికెట్ల పతనం: 1-1, 2-15, 3-16, 4-22, 5-39, 6-43, 7-53, 8-53, 9-68; బౌలింగ్: తితాస్ 4-0-6-2; అర్చన దేవి 3-0-17-2; పర్శవి చోప్రా 4-0-13-2; మన్నత్ కశ్యప్ 3-0-13-1; షెఫాలి 2-0-16-1; సోనమ్ యాదవ్ 1.1-0-3-1
భారత్ ఇన్నింగ్స్: షెఫాలి (సి) అలెక్సా (బి) బేకర్ 15; శ్వేత (సి) బేకర్ (బి) సీవెన్స్ 5; సౌమ్య నాటౌట్ 24; త్రిష (బి) అలెక్సా 24; హృషిత నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం: (14 ఓవర్లలో 3 వికెట్లకు) 69; వికెట్ల పతనం: 1-16, 2-20, 3-66; బౌలింగ్: హన్నా బేకర్ 4-1-13-1; సోఫియా 2-0-16-0; సీవెన్స్ 3-0-13-1; జోసీ 2-0-9-0; అలెక్సా స్టోన్హాస్ 2-0-8-1; ఎల్లీ అండర్సన్ 1-0-10-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..