IND vs NZ: వందే అనుకుంటే.. స్వల్ప ఛేదనలో కష్టపడ్డ భారత్
లఖ్నవూలో స్పిన్ హవా. బంతి గిర్రున తిరుగుతున్న పిచ్పై బ్యాటర్లకు పరుగులు రాబట్టడం గగనమే అయింది. వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్ఇండియా ఆపసోపాలు పడాల్సి వచ్చింది.
రెండో టీ20లో కివీస్పై విజయం
లఖ్నవూ
లఖ్నవూలో స్పిన్ హవా. బంతి గిర్రున తిరుగుతున్న పిచ్పై బ్యాటర్లకు పరుగులు రాబట్టడం గగనమే అయింది. వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్ఇండియా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అత్యంత కఠినమైన పిచ్పై చివరికి భారత్దే పైచేయి అయినా.. కివీస్ పోరాటమూ ఆకట్టుకుంది. ఈ విజయంతో టీమ్ఇండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
బ్యాటింగ్ చాలా కష్టమైన పిచ్పై రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను 1-1తో సమం చేసింది. భారత బౌలర్ల ధాటికి మొదట న్యూజిలాండ్ 8 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. శాంట్నర్ (19 నాటౌట్; 23 బంతుల్లో 1×4) టాప్ స్కోరర్. లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్) పోరాడాడు. మ్యాచ్లో ఒక్క సిక్స్ కూడా రాలేదంటే పిచ్ బ్యాటింగ్కు ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విధ్వంసక వీరుడు సూర్య కూడా 31 బంతుల్లో ఒకే ఒక్క ఫోరే కొట్టగలిగాడు.
చెమటోడ్చిన బ్యాటర్లు: బంతి గిర్రున తిరుగుతున్న పిచ్పై స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా కష్టమైపోయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ను సరిగా అర్థం చేసుకున్న భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. పైగా దీపక్ హుడా కూడా ఉన్నాడు. సుందర్ బౌలింగ్ దాడిని ఆరంభించాడు. చాహల్ (1/4; 2 ఓవర్లలో) నాలుగో ఓవర్లోనే అలెన్ను ఔట్ చేయడం ద్వారా కివీస్ పతనాన్ని ఆరంభించాడు. అక్కడి నుంచి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హుడా (1/17), కుల్దీప్ (1/17), సుందర్ (1/17, 3 ఓవర్లలో) బ్యాటర్లకు ఏమాత్రం బ్యాట్ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. శాంట్నర్ కాస్త నిలబడడంతో కివీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో అర్ష్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత బ్యాటర్లు కూడా పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమైపోయింది. గిల్ (11) నాలుగో ఓవర్లోనే ఔట్ కాగా.. 9వ ఓవర్లో ఇషాన్ కిషన్ (19; 32 బంతుల్లో 2×4) ఔటయ్యేప్పటికి స్కోరు 46 పరుగులే.త్రిపాఠి (13), సుందర్ (10) తక్కువ స్కోరుకే వెనుదిరగగా.. క్రీజులో నిలిచిన సూర్య చెమటోడ్చాడు. ఒత్తిడిలో హార్దిక్ (15 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. సింగిల్స్తోనే స్కోరు బోర్డు ముందుకు సాగింది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరమవగా టిక్నర్ తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ తీవ్రమైంది. కానీ అయిదో బంతిని సూర్య బౌండరీకి తరలించడంతో భారత్ విజయాన్నందుకుంది. బ్రాస్వెల్ (1/13), ఇష్ సోధి (1/24), శాంట్నర్ (0/20), ఫిలిప్స్ (0/17) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) చాహల్ 11; కాన్వే (సి) ఇషాన్ (బి) సుందర్ 11; చాప్మన్ రనౌట్ 14; ఫిలిప్స్ (బి) హుడా 5; మిచెల్ (బి) కుల్దీప్ 8; బ్రాస్వెల్ (సి) అర్ష్దీప్ (బి) హార్దిక్ 14; శాంట్నర్ నాటౌట్ 19; ఇష్ సోధి (సి) హార్దిక్ (బి) అర్ష్దీప్ 1; ఫెర్గూసన్ (సి) సుందర్ (బి) అర్ష్దీప్ 0; డఫి నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99; వికెట్ల పతనం: 1-21, 2-28, 3-35, 4-48, 5-60, 6-80, 7-83, 8-83; బౌలింగ్: హార్దిక్ 4-0-25-1; సుందర్ 3-0-17-1; చాహల్ 2-1-4-1; హుడా 4-0-17-1; కుల్దీప్ 4-0-17-1; అర్ష్దీప్ 2-0-7-2; మావి 1-0-11-0
భారత్ ఇన్నింగ్స్: గిల్ (సి) అలెన్ (బి) బ్రాస్వెల్ 11; ఇషాన్ రనౌట్ 19; త్రిపాఠి (సి) ఫిలిప్స్ (బి) సోధి 13; సూర్యకుమార్ నాటౌట్ 26; సుందర్ రనౌట్ 10; హార్దిక్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 7 మొత్తం: (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 101; వికెట్ల పతనం: 1-17, 2-46, 3-50, 4-70; బౌలింగ్: డఫి 1-0-8-0; బ్రాస్వెల్ 4-0-13-1; శాంట్నర్ 4-0-20-0; ఫిలిప్స్ 4-0-17-0; ఇష్ సోధి 4-0-24-1; చాప్మన్ 1-0-4-0; ఫెర్గూసన్ 1-0-7-0; టిక్నర్ 0.5-0-7-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు