IND vs NZ: వందే అనుకుంటే.. స్వల్ప ఛేదనలో కష్టపడ్డ భారత్
లఖ్నవూలో స్పిన్ హవా. బంతి గిర్రున తిరుగుతున్న పిచ్పై బ్యాటర్లకు పరుగులు రాబట్టడం గగనమే అయింది. వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్ఇండియా ఆపసోపాలు పడాల్సి వచ్చింది.
రెండో టీ20లో కివీస్పై విజయం
లఖ్నవూ
లఖ్నవూలో స్పిన్ హవా. బంతి గిర్రున తిరుగుతున్న పిచ్పై బ్యాటర్లకు పరుగులు రాబట్టడం గగనమే అయింది. వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్ఇండియా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అత్యంత కఠినమైన పిచ్పై చివరికి భారత్దే పైచేయి అయినా.. కివీస్ పోరాటమూ ఆకట్టుకుంది. ఈ విజయంతో టీమ్ఇండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
బ్యాటింగ్ చాలా కష్టమైన పిచ్పై రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను 1-1తో సమం చేసింది. భారత బౌలర్ల ధాటికి మొదట న్యూజిలాండ్ 8 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. శాంట్నర్ (19 నాటౌట్; 23 బంతుల్లో 1×4) టాప్ స్కోరర్. లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్) పోరాడాడు. మ్యాచ్లో ఒక్క సిక్స్ కూడా రాలేదంటే పిచ్ బ్యాటింగ్కు ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విధ్వంసక వీరుడు సూర్య కూడా 31 బంతుల్లో ఒకే ఒక్క ఫోరే కొట్టగలిగాడు.
చెమటోడ్చిన బ్యాటర్లు: బంతి గిర్రున తిరుగుతున్న పిచ్పై స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా కష్టమైపోయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ను సరిగా అర్థం చేసుకున్న భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. పైగా దీపక్ హుడా కూడా ఉన్నాడు. సుందర్ బౌలింగ్ దాడిని ఆరంభించాడు. చాహల్ (1/4; 2 ఓవర్లలో) నాలుగో ఓవర్లోనే అలెన్ను ఔట్ చేయడం ద్వారా కివీస్ పతనాన్ని ఆరంభించాడు. అక్కడి నుంచి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హుడా (1/17), కుల్దీప్ (1/17), సుందర్ (1/17, 3 ఓవర్లలో) బ్యాటర్లకు ఏమాత్రం బ్యాట్ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. శాంట్నర్ కాస్త నిలబడడంతో కివీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో అర్ష్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత బ్యాటర్లు కూడా పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమైపోయింది. గిల్ (11) నాలుగో ఓవర్లోనే ఔట్ కాగా.. 9వ ఓవర్లో ఇషాన్ కిషన్ (19; 32 బంతుల్లో 2×4) ఔటయ్యేప్పటికి స్కోరు 46 పరుగులే.త్రిపాఠి (13), సుందర్ (10) తక్కువ స్కోరుకే వెనుదిరగగా.. క్రీజులో నిలిచిన సూర్య చెమటోడ్చాడు. ఒత్తిడిలో హార్దిక్ (15 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. సింగిల్స్తోనే స్కోరు బోర్డు ముందుకు సాగింది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరమవగా టిక్నర్ తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ తీవ్రమైంది. కానీ అయిదో బంతిని సూర్య బౌండరీకి తరలించడంతో భారత్ విజయాన్నందుకుంది. బ్రాస్వెల్ (1/13), ఇష్ సోధి (1/24), శాంట్నర్ (0/20), ఫిలిప్స్ (0/17) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) చాహల్ 11; కాన్వే (సి) ఇషాన్ (బి) సుందర్ 11; చాప్మన్ రనౌట్ 14; ఫిలిప్స్ (బి) హుడా 5; మిచెల్ (బి) కుల్దీప్ 8; బ్రాస్వెల్ (సి) అర్ష్దీప్ (బి) హార్దిక్ 14; శాంట్నర్ నాటౌట్ 19; ఇష్ సోధి (సి) హార్దిక్ (బి) అర్ష్దీప్ 1; ఫెర్గూసన్ (సి) సుందర్ (బి) అర్ష్దీప్ 0; డఫి నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99; వికెట్ల పతనం: 1-21, 2-28, 3-35, 4-48, 5-60, 6-80, 7-83, 8-83; బౌలింగ్: హార్దిక్ 4-0-25-1; సుందర్ 3-0-17-1; చాహల్ 2-1-4-1; హుడా 4-0-17-1; కుల్దీప్ 4-0-17-1; అర్ష్దీప్ 2-0-7-2; మావి 1-0-11-0
భారత్ ఇన్నింగ్స్: గిల్ (సి) అలెన్ (బి) బ్రాస్వెల్ 11; ఇషాన్ రనౌట్ 19; త్రిపాఠి (సి) ఫిలిప్స్ (బి) సోధి 13; సూర్యకుమార్ నాటౌట్ 26; సుందర్ రనౌట్ 10; హార్దిక్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 7 మొత్తం: (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 101; వికెట్ల పతనం: 1-17, 2-46, 3-50, 4-70; బౌలింగ్: డఫి 1-0-8-0; బ్రాస్వెల్ 4-0-13-1; శాంట్నర్ 4-0-20-0; ఫిలిప్స్ 4-0-17-0; ఇష్ సోధి 4-0-24-1; చాప్మన్ 1-0-4-0; ఫెర్గూసన్ 1-0-7-0; టిక్నర్ 0.5-0-7-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ