హెచ్సీఏ రికార్డులు సమర్పించండి
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది
హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ అధ్యక్షులు అర్షద్ అయ్యూబ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2021 జులై నుంచి అధ్యక్షుడు అజహరుద్దీన్ మినహా ఎలాంటి పాలకవర్గం లేదని తెలిపారు. సర్వసభ్య సమావేశాలు కూడా నిర్వహించడం లేదన్నారు. గత ఏడాది డిసెంబరు 11న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యుడు వంకా ప్రతాప్, అధ్యక్షుడు అజహరుద్దీన్ కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీ ఛైర్మన్ జస్టిస్ కక్రూ హెచ్సీఏను ప్రక్షాళనకు చేసే ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారన్నారు. హెచ్సీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం వివాదం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉందన్నారు. సంఘం వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. దీనికి సంబంధించిన సమాచారం సమర్పించడానికి వారం గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు.
మరో 16 వారాలు సమయం ఇవ్వండి: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సభ్యత్వాల విషయంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు నియమించిన హెచ్సీఏ పర్యవేక్షక కమిటీ అభిప్రాయపడింది. హెచ్సీఏ క్లబ్లకు సంబంధించిన రికార్డుల్ని సరిగ్గా నిర్వహించట్లేదని కమిటీ ఆరోపించింది. హెచ్సీఏ వ్యవహారాలపై మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పర్యవేక్షక కమిటీ సమర్పించింది. కమిటీ ఛైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నివేదికపై సంతకం చేయలేదు. కమిటీ వైస్ ఛైర్మన్ అంజని కుమార్.. సభ్యులు వెంకటపతి రాజు, వంకా ప్రతాప్ సంతకాలతో నివేదికను సమర్పించారు. 7-8 క్లబ్లు కలిగిన కొందరు సభ్యులు హెచ్సీఏ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని కమిటీ ఆరోపించింది. అర్షద్ అయూబ్, సురేందర్ అగర్వాల్, మొయిజుద్దీన్, విజయానంద్, యాదగిరి, మాన్సింగ్, పురుషోత్తం అగర్వాల్, శివలాల్ యాదవ్లకు ఎక్కువ సంఖ్యలో క్లబ్లు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, 14 మున్సిపల్ కార్పొరేషన్లలో క్రికెట్ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా క్రీడల కార్యదర్శికి కమిటీ వైస్ ఛైర్మన్ నిరుడు అక్టోబరులో లేఖ రాసినట్లు తెలిపింది. అన్ని విషయాలపై సమగ్ర దర్యాప్తు కోసం కమిటీకి మరో 16 వారాలు సమయం ఇవ్వాలని కోరింది. నిరుడు ఆగస్టులో పర్యవేక్షక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం