ధోని పోషించిన పాత్ర నా బాధ్యత
ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాల్ని సంపాదించినట్లు టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని జట్టు కోసం పోషించిన పాత్రను స్వీకరించడం తన బాధ్యత అని తెలిపాడు.
అహ్మదాబాద్: ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాల్ని సంపాదించినట్లు టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని జట్టు కోసం పోషించిన పాత్రను స్వీకరించడం తన బాధ్యత అని తెలిపాడు. ‘‘నిజాయతీగా చెప్పాలంటే సిక్సర్లు కొట్టడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. కాని పరిణతి సాధించాలి. అదే జీవితం. భాగస్వామ్యాలను నిర్మించడం ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముంది. క్రీజులో ఉన్నంతసేపు జట్టుకు, అవతలి వైపు ఉన్న వ్యక్తికి నేనున్నాను అనే భరోసా, ప్రశాంతత ఇవ్వాలని అనుకుంటున్నా. జట్టులో ఉన్నవాళ్లందరి కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం నాకే ఉంది. అనుభవం కంటే కూడా ఒత్తిడిని ఎలా స్వీకరించాలో.. ఏ విధంగా అధిగమించాలో నేర్చుకున్నా. కాబట్టి జట్టు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. జట్టు కోసం ధోని పోషించిన పాత్రను స్వీకరించడం నా బాధ్యత. అందుకోసం నా స్ట్రైక్రేటు తగ్గించుకోడానికి సిద్ధం. కొత్త అవకాశాల్ని అందుకోవడం.. నూతన బాధ్యతల్ని తీసుకోవడం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. ధోని మాదిరి బ్యాటింగ్ ఆర్డర్లో కింద వచ్చి అతని పాత్ర పోషించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ధోని సారథిగా ఉన్నప్పుడు నేను చిన్నవాడిని. మైదానం నలుమూలలా సిక్సర్లు బాదేవాడిని. ధోని వీడ్కోలు పలకడంతో సహజంగానే ఆ బాధ్యత నాపై పడింది. అందుకు నేను వెనుకాడను. ప్రస్తుతం మేం కోరుకున్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. అర్ష్దీప్సింగ్పై ఒత్తిడి రాకుండా ఉండేందుకే టీ20ల్లో కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్నా’’ అని హార్దిక్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?