కంగారూల స్పిన్ మంత్ర!
స్పిన్.. భారత్లో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చే ఏ ఉపఖండేతర జట్టుకైనా ఈ మాట వింటే కంగారు పుడుతుంది. ప్రపంచ క్రికెట్ను శాసించిన ఎన్నో జట్లు భారత గడ్డపై గింగిరాలు తిరిగే పిచ్లకు తలవంచి సిరీస్లు సమర్పించుకున్నవే.
స్పిన్.. భారత్లో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చే ఏ ఉపఖండేతర జట్టుకైనా ఈ మాట వింటే కంగారు పుడుతుంది. ప్రపంచ క్రికెట్ను శాసించిన ఎన్నో జట్లు భారత గడ్డపై గింగిరాలు తిరిగే పిచ్లకు తలవంచి సిరీస్లు సమర్పించుకున్నవే. ఇప్పుడు కంగారూ జట్టును కూడా అదే భయం వెంటాడుతోంది. టీమ్ఇండియాతో నాలుగు టెస్టుల సిరీస్ ముంగిట ఆ జట్టు ప్రణాళికలన్నీ స్పిన్ చుట్టూనే తిరుగుతుండడం అందుకు నిదర్శనం.
ఈనాడు క్రీడావిభాగం
2001లో ఏం జరిగిందో గుర్తుందా? అంతకుముందు చాలా ఏళ్ల నుంచి ప్రపంచ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చి తొలి టెస్టును అలవోకగా గెలిచి మరో సిరీస్ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాతి రెండు టెస్టుల్లో అనూహ్య పరాజయాలు చవిచూసి సిరీస్ను చేజార్చుకుంది. ఆ సిరీస్లో వీవీఎస్ లక్ష్మణ్, ద్రవిడ్ల భారీ భాగస్వామ్యం కీలక మలుపే కానీ.. భారత్కు సిరీస్ విజయాన్నందించింది మాత్రం స్పిన్నే. ఆ తర్వాత భారత్లో అయిదుసార్లు పర్యటించిన కంగారూ జట్టు 2004లో మాత్రమే సిరీస్ను సాధించింది. మిగతా నాలుగు పర్యాయాలు ఓటమి తప్పలేదు. ప్రతిసారీ ఆ జట్టు బోల్తా కొట్టింది స్పిన్ను ఎదుర్కోలేకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి కూడా ఆ జట్టు భారత స్పిన్ దాడి గురించి తీవ్రంగానే ఆందోళన చెందుతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.
వార్మప్ వద్దట..
ఏ జట్టయినా విదేశీ పర్యటనకు వెళ్లినపుడు జట్టులోని ఆటగాళ్లు అక్కడి పరిస్థితులు, పిచ్లకు అలవాటు పడేందుకు వార్మప్ మ్యాచ్లు ఆడడం సహజం. కానీ ఈసారి భారత పర్యటనలో ఆస్ట్రేలియా మాత్రం ఈ పని చేయట్లేదు. ఆసీస్ కోరితే బీసీసీఐ ప్రాక్టీస్ మ్యాచ్లు ఏర్పాటు చేయకుండా ఉండదు. కానీ ఆ జట్టు వాటి పట్ల విముఖత ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇందుక్కారణం.. వార్మప్ మ్యాచ్లకు సిద్ధం చేసే పిచ్ల విషయంలో ఉన్న అసంతృప్తే వార్మప్ మ్యాచ్లకు పచ్చికతో కూడిన పిచ్ను ఇచ్చి, అసలు మ్యాచ్లో మాత్రం పచ్చిక పూర్తిగా తొలగించి స్పిన్కు అనుకూలంగా మారుస్తుండడంతో ప్రాక్టీస్ మ్యాచ్ల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందని ఆసీస్ భావిస్తోంది. దీని వల్ల సమయం వృథా, పైగా ఆటగాళ్లు తికమక పడుతున్నారని భావించి కంగారూ జట్టు ఈసారి వార్మప్ మ్యాచ్లు వద్దనేసింది. దాని బదులు నెట్ సెషన్లలో స్పిన్నర్లతో బంతులేయించుకుని ప్రాక్టీస్ సాగిస్తున్నారు ఆ జట్టు బ్యాటర్లు.
ఇద్దరు కాదు ముగ్గురు..?
గతంలో భారత పిచ్లు తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్కు అనుకూలించి.. మూడో రోజు నుంచి స్పిన్కు సహకారం అందించేవి. ఆట ముందుకు సాగేకొద్దీ పగుళ్లు వచ్చి బంతి మరింత తిరిగేది. కానీ కొన్నేళ్ల నుంచి తొలి రోజే బంతి గింగిరాలు తిరిగేలా పిచ్లు తయారు చేస్తున్నారని.. ఇలాంటి పిచ్లను తమ బ్యాటర్లు తట్టుకోవడం కష్టమే అని ఆస్ట్రేలియా జట్టు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిచ్ను బట్టి భారత్ ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించే సూచనలు కూడా కనిపిస్తుండడం కంగారూలను మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. గతంలో అశ్విన్, జడేజా స్పిన్ బాధ్యతలు పంచుకునేవారు. మధ్యలో గాయపడ్డ జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా నిలకడగా రాణించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు అశ్విన్తో పాటు జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ కూడా జట్టులో ఉన్నారు. పిచ్ స్పిన్ స్వర్గధామంలా ఉంటే వీరిలో ముగ్గురిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరి భారత స్పిన్ త్రయాన్ని కంగారూ బ్యాటర్లు ఎలా తట్టుకుంటారో చూడాలి.
ఆస్ట్రేలియా శిబిరంలో ‘అశ్విన్’
భారత్లో టెస్టు సిరీస్ అంటే అందరి చూపూ అశ్విన్ మీదే ఉంటుంది. కుంబ్లే-హర్భజన్ల శకం ముగిశాక.. ఆ లోటును కనిపించకుండా చేయడంలో ఈ తమిళనాడు స్పిన్నర్ది కీలక పాత్ర. పదేళ్లకు పైగా టెస్టుల్లో స్పిన్ భాగస్వామి మారుతున్నాడే తప్ప.. అశ్విన్ మాత్రం ప్రధాన స్పిన్నర్గా కొనసాగుతూనే ఉన్నాడు. ఆస్ట్రేలియాతో రాబోయే సిరీస్లోనూ అశ్విన్ నుంచి ముప్పు తప్పదని ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది. అందుకే అతణ్ని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అశ్విన్ తరహా శైలి కలిగి ఉన్న మహీష్ పితియా అనే 21 ఏళ్ల స్పిన్నర్ను ప్రాక్టీస్లో కంగారూ జట్టు ఉపయోగించుకుంటుండడం విశేషం. బరోడాకు చెందిన ఈ ఆఫ్స్పిన్నర్ బౌలింగ్ శైలి అశ్విన్కు దగ్గరగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో మహీష్ బౌలింగ్ వీడియోలు చూసిన ఆస్ట్రేలియా సహాయ సిబ్బంది.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముంగిట తన సేవలు ఉపయోగించుకోవాలనుకున్నారు. మహీష్ను సంప్రదించి అతణ్ని నెట్ సెషన్కు పిలిపించారు. కంగారూ ప్రధాన బ్యాటర్లంతా సుదీర్ఘ సమయం అతడి బంతులను ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?