సంక్షిప్త వార్తలు (6)
శాఫ్ అండర్-20 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత్కు అదిరే విజయం. గోల్స్ వర్షం కురిసిన మ్యాచ్లో భారత్ 12-0తో భూటాన్ను చిత్తుగా ఓడించింది.
భారత్ 12.. భూటాన్ 0
ఢాకా: శాఫ్ అండర్-20 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత్కు అదిరే విజయం. గోల్స్ వర్షం కురిసిన మ్యాచ్లో భారత్ 12-0తో భూటాన్ను చిత్తుగా ఓడించింది. నేహా (47, 55, 90 ని), అనిత కుమారి (50, 69, 78వ), లిండాకామ్ (61, 63, 75వ) హ్యాట్రిక్లతో మెరిశారు. అపర్ణ (29, 36వ) రెండు.. నీతు (43వ) ఓ గోల్ కొట్టారు. తొలి గోల్ చేయడానికి 29 నిమిషాలు తీసుకున్న భారత్.. ఆ తర్వాత ఆగలేదు. వరుస గోల్స్తో భూటాన్ను ఉక్కిరిబిక్కిరి చేసి విజయాన్ని అందుకుంది. ఆదివారం రెండో లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో మన జట్టు తలపడనుంది.
ఆ అథ్లెట్లను ఆడిస్తే 40 దేశాలు దూరం
దిల్లీ: రష్యా, బెలారస్ అథ్లెట్లను ఒలింపిక్స్లో ఆడేందుకు అనుమతిస్తే, ఈ మెగా క్రీడలను దాదాపు 40 దేశాలు బహిష్కరిస్తాయని పోలెండ్ క్రీడా మంత్రి కామిల్ బోట్నిజుక్ తెలిపాడు. ఈ దేశాలు క్రీడలకు దూరమై ఒలింపిక్స్ నిర్వహణను అర్థరహితంగా మారుస్తాయని అన్నాడు. బ్రిటన్, అమెరికా, కెనడా లాంటి దేశాలూ ఆ జాబితాలో ఉండే ఆస్కారముందన్నాడు. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాతో పాటు బెలారస్పైనా వివిధ ప్రపంచ క్రీడా సమాఖ్యలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొన్ని టోర్నీల్లో వీళ్లు తటస్థ అథ్లెట్లుగా ఆడుతున్నారు. పారిస్ ఒలింపిక్స్లోనూ ఈ రెండు దేశాల ప్లేయర్లను తటస్థ అథ్లెట్లుగా ఆడించే అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది. దీంతో ఐఓసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బాక్సింగ్ టాప్-3లో భారత్
దిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. 36,300 పాయింట్లతో బలమైన అమెరికా, క్యూబాలను వెనక్కి నెట్టి టాప్-3లో నిలిచింది. కజకిస్థాన్ (48,100), ఉజ్బెకిస్థాన్ (37,600) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు లాంటి మెగా ఈవెంట్లలో ఇటీవల కాలంలో భారత బాక్సర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో ర్యాంకింగ్ గణనీయంగా పెరిగింది. గత రెండు కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్లో 16 పతకాలు దక్కించుకున్న మన బాక్సర్లు.. 2008 నుంచి వివిధ అంతర్జాతీయ పోటీల్లో 140 మెడల్స్ కొల్లగొట్టారు.
అఫ్రిది కూతురితో షహీన్షా పెళ్లి!
కరాచి: పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్షా అఫ్రిది ఓ ఇంటివాడయ్యాడు. మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది కుమార్తె అన్షాను శుక్రవారం వివాహం చేసుకున్నాడు. కరాచిలో జరిగిన ఈ పెళ్లికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్, షాదాబ్ ఖాన్, నసీమ్షా తదితరులు హాజరయ్యారు. అన్షాతో షహీన్కు గతేడాది నిశ్చితార్థం అయింది.
మార్చి 18న ఐఎస్ఎల్ పైనల్
దిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్ మార్చి 18న జరగనుంది. తుది సమరానికి ఆతిథ్యమిచ్చే వేదిక ఇంకా ఖరారు కాలేదు. నాలుగు సెమీఫైనల్స్ మ్యాచ్లు (ఇంట, బయటా) మార్చి 7, 9, 12, 13న నిర్వహిస్తారు. కొత్త ఫార్మాట్ ప్రకారం లీగ్ మ్యాచ్లు పూర్తయ్యేసరికే టాప్-2 జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. 3-6 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సింగిల్ లెగ్ ప్లేఆఫ్ నిర్వహించి మరో రెండు సెమీస్ బెర్తులను తేలుస్తారు. 4-5, 3-6 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య నిర్వహించే ప్లేఆఫ్ మ్యాచ్లు మార్చి 3, 4 తేదీల్లో జరుగుతాయి. ముంబయి సిటీ, హైదరాబాద్ ఎఫ్సీ ఇప్పటికే తర్వాతి దశకు అర్హత పొందాయి. ప్లేఆఫ్స్ స్థానాల కోసం రేసు రసవత్తరంగా సాగుతోంది.
అసహనంగానే ఉంది కానీ..: బట్లర్
లండన్: ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడకుండా ఫ్రాంఛైజీ క్రికెట్ వైపు మొగ్గు చూపడం అసహనాన్ని కలిగిస్తోందని.. కానీ వారి పరిస్థితి అర్థం చేసుకోదగ్గదేనని ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. మార్చిలో బంగ్లాదేశ్ సిరీస్ నుంచి అలెక్స్ హేల్స్, సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లీ వైదొలిగిన నేపథ్యంలో బట్లర్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘ఏ సిరీస్కు వెళ్లినా అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును తీసుకెళ్లాలనే అనుకుంటాం. బంగ్లాదేశ్తో సిరీస్ నుంచి కొంతమంది కీలక ఆటగాళ్లు తప్పుకున్నారు. ఇది అసహనాన్ని కలిగిస్తోంది. కానీ ఇది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరి షెడ్యూల్ అలా ఉంది. వారి పరిస్థితి అర్థం చేసుకోదగ్గదే. ఒకరు అందుబాటులో లేరు అంటే వాళ్లు మరొకరికి అవకాశం కల్పిస్తున్నారని భావించాలి’’ అని బట్లర్ అన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ 1-2తో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.