భార్యపై దాడి.. కాంబ్లిపై కేసు

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. మద్యం మత్తులో భార్యపై దాడి చేసి గాయపరిచిన నేరారోపణపై కాంబ్లిపై ముంబయి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 06 Feb 2023 02:03 IST

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. మద్యం మత్తులో భార్యపై దాడి చేసి గాయపరిచిన నేరారోపణపై కాంబ్లిపై ముంబయి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాంద్రా శివారులోని కాంబ్లి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆదివారం పోలీసు అధికారి తెలిపాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అతడు చెప్పాడు. కాంబ్లి పెనం పిడిని తనపైకి విసరడంతో తలకు గాయమైనట్లు అతని భార్య ఆండ్రియా ఫిర్యాదులో పేర్కొంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని ఆ సమయంలో కాంబ్లి మద్యం మత్తులో ఉన్నాడని చెప్పింది. తమ 12 ఏళ్ల కుమారుడు గొడవను ఆపేందుకు ప్రయత్నించినా కాంబ్లి తనను గాయపరిచాడని ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని