ఆసీస్ను ఆపగలరా?
అది 2009.. మొట్టమొదటి మహిళల టీ20 ప్రపంచకప్.. టైటిల్ ఫేవరెట్గా కనిపించిన ఆ జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. ఓటమి భారంతో ఇంగ్లాండ్ నుంచి స్వదేశం బాట పట్టిన ఆ జట్టు.. కసితో రగిలింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 3 రోజుల్లో..
ఈనాడు క్రీడావిభాగం
అది 2009.. మొట్టమొదటి మహిళల టీ20 ప్రపంచకప్.. టైటిల్ ఫేవరెట్గా కనిపించిన ఆ జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. ఓటమి భారంతో ఇంగ్లాండ్ నుంచి స్వదేశం బాట పట్టిన ఆ జట్టు.. కసితో రగిలింది. ఆటను మెరుగుపర్చుకుని.. ప్రత్యర్థులకు అందని విధంగా ఎదిగింది. రెండో ప్రపంచకప్ మొదలు.. వరుసగా ఆరు ప్రపంచకప్ల్లోనూ ఫైనల్ చేరింది. అందులో అయిదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. అదే.. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు. ఇప్పుడు మరోసారి కప్పుపై కన్నేసిన ఈ కంగారూ జట్టుకు ఎదురుందా? ఆసీస్ అమ్మాయిలను ఆపి.. మరో జట్టు కప్పును ముద్దాడుతుందా? అన్నది చూడాలి.
వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. ఆస్ట్రేలియా బరిలో ఉంటే మిగతా జట్లు ఇక రెండో స్థానం కోసమే పోటీపడాలనేలా మహిళల టీ20 ప్రపంచకప్లో కంగారూ అమ్మాయిల ఆధిపత్యం కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ స్టార్ క్రికెటర్లతో, మైదానంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు కప్పు వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఏడు టీ20 ప్రపంచకప్లు జరిగితే అందులో అయిదు సార్లు ఆ జట్టే విజేత. ప్రతి టోర్నీలోనూ కనీసం సెమీస్ చేరింది. ఇప్పుడు శుక్రవారం దక్షిణాఫ్రికాలో ఆరంభమయ్యే పొట్టి కప్పులోనూ గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో ఉంది. నంబర్వన్ టీ20 జట్టుగా బరిలో దిగుతున్న ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. అయిదో టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న కెప్టెన్ మెగ్ లానింగ్ మరోసారి జట్టుకు కప్పు అందించాలని చూస్తోంది. 2020 ప్రపంచకప్ తర్వాత ఆ జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. కానీ ఇప్పుడు కూడా యువ, అనుభవజ్ఞులైన క్రికెటర్ల కూర్పుతో బలంగానే కనిపిస్తోంది. నిరుడు కామన్వెల్త్ క్రీడల ఛాంపియన్గా నిలిచింది. గత 17 టీ20 మ్యాచ్ల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఓడింది.
సవాలు విసిరేదెవరు?: మొత్తం 10 జట్లు పోటీపడనున్న ఈ ప్రపంచకప్లో ఆసీస్కు సవాలు విసిరే అవకాశాలున్న జట్లు అయిదున్నాయి. మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్తో పాటు రెండు సార్లు రన్నరప్ న్యూజిలాండ్, గత ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన భారత్, తొలిసారి ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా టైటిల్పై కన్నేశాయి. కానీ కప్పును చేరాలంటే ఆస్ట్రేలియా విఘ్నాన్ని దాటాల్సిందే. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్తో గ్రూప్-1లో ఉన్న ఆసీస్ అగ్రస్థానంతో సులువుగానే సెమీస్ చేరొచ్చు. గ్రూప్ దశలో ఆ జట్టుతో మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఎలాంటి ప్రదర్శన చేస్తాయన్నది ఆసక్తికరం. ఒకవేళ కంగారూ జట్టును కట్టడి చేయడంలో ఇవి విఫలమైతే.. అప్పుడు ఈ రెండు జట్లలో ఒకటి మాత్రమే సెమీస్లో అడుగుపెట్టే ఆస్కారముంది. ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్పై గెలిచిన సఫారీ జట్టు సొంతగడ్డపై ఈ ప్రపంచకప్లో సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు మూడు సార్లు రన్నరప్ కూడా అయిన ఇంగ్లాండ్.. రెండో కప్పు నిరీక్షణకు ముగింపు పలకాలనుకుంటోంది. గ్రూప్-2లో ఆ జట్టుతో పాటు భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్, భారత్ సెమీస్ చేరేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో సెమీస్లో లేదా ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఈ జట్లు తలపడే అవకాశముంది. కామన్వెల్త్ క్రీడల ఫైనల్లో ఆస్ట్రేలియాకు టీమ్ఇండియా గట్టిపోటీనిచ్చింది. అంతే కాకుండా కంగారూ గడ్డపై సూపర్ ఓవర్లో ఆ జట్టును ఓడించి, వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది భారతే. 2020 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన భారత్.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
5 ఆస్ట్రేలియా నెగ్గిన మహిళల టీ20 ప్రపంచకప్లు. 2010, 2012, 2014, 2018, 2020లో ఆ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. 2009లో ఇంగ్లాండ్, 2016లో వెస్టిండీస్ కప్పు గెలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...