మహా పోరు.. మజా ఫుల్లు
భారత గడ్డపై చేదు అనుభవాలను చెరిపివేస్తూ సిరీస్ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదల ఆస్ట్రేలియాది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ బెర్తు సాధించాలన్న పంతం భారత్ది.
భారత గడ్డపై చేదు అనుభవాలను చెరిపివేస్తూ సిరీస్ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదల ఆస్ట్రేలియాది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ బెర్తు సాధించాలన్న పంతం భారత్ది.
ఇరు జట్లూ మంచి ఫామ్లో ఉన్నాయి. రెండింటి బలాబలాలు సమం. ఇటూ అటూ స్టార్లకు కొదవ లేదు. గురువారం మొదలయ్యే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్ను చూసేందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
ఈనాడు క్రీడావిభాగం
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడూ తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్తో తలపడే యాషెస్నే అత్యుత్తమ సిరీస్గా పరిగణిస్తుంటారు. తమ వరకు దాన్నిమించి సిరీస్ లేదంటారు. ఆ విజయాన్ని గొప్పగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి స్వరం మారుతోంది. భారత్లో ఆడబోయే టెస్టు సిరీస్ను యాషెస్తో సమానం అని కొందరంటుంటే.. ఇందులో విజయం సాధిస్తే యాషెస్ను మించిన విజయం అవుతుందని కొందరంటున్నారు. ఈ సిరీస్ ప్రాధాన్యమేంటో చెప్పడానికి ఇంతకంటే రుజువు కావాలా? వరుసగా రెండు పర్యాయాలు తమ గడ్డపై టీమ్ఇండియా సిరీస్లు సాధించి చరిత్ర సృష్టించగా.. ఆసీస్ మాత్రం 2004 తర్వాత భారత్లో సిరీస్ విజయం దక్కని అసంతృప్తితో ఉంది. రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో నిలకడగా విజయాలు సాధిస్తూ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. భారత్లో సిరీస్ సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆస్ట్రేలియాకు దాని గడ్డపై పరాభవం మిగిల్చిన భారత్.. ఇప్పుడు సూపర్ ఫామ్తో తమ దేశానికి వచ్చిన ఆ జట్టును ఇక్కడా దెబ్బ కొట్టి ఆధిపత్యాన్ని చాటాలని భారత్ చూస్తోంది.
తేల్చేది వీళ్లే..
ఈ సిరీస్లో స్పిన్నర్లదే అత్యంత కీలక పాత్ర అని, సిరీస్ ఫలితాన్ని నిర్ణయించేది వాళ్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు జట్లలో నలుగురు చొప్పున స్పిన్నర్లు జట్టులో ఉండడం విశేషం. ఇరు జట్లూ తుది జట్లలో కనీసం ఇద్దరు స్పిన్నర్లను దించడం ఖాయం. భారత్ ముగ్గురిని ఆడించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ మేటి స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్న అశ్విన్.. ఆస్ట్రేలియా తరఫున నిలకడగా రాణిస్తున్న లైయన్ మధ్య పోరు ఆసక్తి రేకెత్తించేదే. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. భారత జట్టులో ఇంకా కుల్దీప్, జడేజా, అక్షర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లున్నారు. వీరికి భారత పిచ్లు కొట్టిన పిండే. వీరిలో ఎవరు తుది జట్టులో ఉన్నా పిచ్ కొంచెం సహకరిస్తే కంగారూలకు ఇబ్బంది కలిగించడం ఖాయం. ఆస్ట్రేలియా జట్టులో అగార్, స్వెప్సన్, మర్ఫీల రూపంలో మరో ముగ్గురు స్పిన్నర్లున్నారు. వీరు ప్రతిభావంతులే అయినా.. భారత పిచ్లపై ఆడిన అనుభవం లేదు. మరి వాళ్లు ఎంతమేర సత్తా చాటుతారో చూడాలి.
నువ్వానేనా?
భారత్-ఆస్ట్రేలియా సిరీస్ అమితాసక్తిని రేకెత్తిస్తుండడానికి ఇరు జట్ల బలాబలాలు సమానంగా కనిపిస్తూ, మ్యాచ్లు హోరాహోరీగా సాగేలా కనిపిస్తుండడం కూడా ఓ కారణమే. రెండు జట్లకూ అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వారు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కెప్టెన్ రోహిత్తో పాటు కోహ్లి, పుజారా, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు భారత జట్టులో ఉన్నారు. కోహ్లి ఒకప్పటి స్థాయి ఫామ్లో లేకపోయినా.. ఇటీవల అతడి ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. తనలోని మేటి బ్యాటర్ను అతను మళ్లీ ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో బయటికి తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. పుజారా కూడా ఈ సిరీస్లో ముఖ్య పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నారు. రోహిత్కు బ్యాటర్గానే కాక కెప్టెన్గా ఈ సిరీస్ కీలకం. రాహుల్ కూడా తన స్థాయిని, సత్తాను చాటాల్సి ఉంది. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అతి పెద్ద బలం. టాంపరింగ్ కుంభకోణం వల్ల మధ్యలో కెరీర్ కొంత దెబ్బ తిన్నా.. ఇటీవల తన పతాక స్థాయిని అందుకుని పాత స్మిత్ను గుర్తుకు తెస్తున్నాడతను. భారత్లో అతడికి గొప్ప రికార్డుంది. అనుభవజ్ఞుడు వార్నర్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. చరమాంకంలో ఉన్న అతను.. భారత్పై సత్తా చాటి కెరీర్కు ఘనమైన ముగింపునివ్వాలనుకుంటున్నాడు. భీకర ఫామ్లో ఉన్న ఖవాజా, మేటి బ్యాటర్గా ఎదుగుతున్న లబుషేన్ భారత పర్యటనలో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నారు. స్పిన్నర్లను ఆడడం కఠిన సవాలుగా మారబోయే ఈ సిరీస్లో ఇరు జట్లలోని స్టార్లలో ఎవరు మేటిగా నిలుస్తారన్నది ఆసక్తికరం.
వారికి చెలగాటం..
2021-23 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియాది తిరుగులేని ఆధిపత్యం. ఆ జట్టు 75.56 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 58.93 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్తో సిరీస్లో ఓడినా ఆ జట్టు ఫైనల్ బెర్తుకు వచ్చిన ముప్పేమీ లేనట్లే! కానీ భారత్ మాత్రం ఈ సిరీస్ గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. కాబట్టి ఈ సిరీస్ ఆసీస్కు చెలగాటం, భారత్కు ప్రాణ సంకటం అన్నట్లే. డబ్ల్యూటీసీ ఫైనల్ ముంగిట జరిగే చివరి సిరీస్ కావడంతో దీనిపై మిగతా జట్ల భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి క్రికెట్ ప్రపంచమంతా ఈ సిరీస్ను ప్రత్యేక ఆసక్తితో చూస్తుందనడంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?