కర్ణాటకను ఆదుకున్న మయాంక్
సౌరాష్ట్రతో రంజీ సెమీస్లో కర్ణాటకను కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (110 బ్యాటింగ్; 246 బంతుల్లో 11×4, 1×6) అజేయ శతకంతో ఆదుకున్నాడు.
సౌరాష్ట్రతో రంజీ సెమీస్
బెంగళూరు: సౌరాష్ట్రతో రంజీ సెమీస్లో కర్ణాటకను కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (110 బ్యాటింగ్; 246 బంతుల్లో 11×4, 1×6) అజేయ శతకంతో ఆదుకున్నాడు. బుధవారం ఆరంభమైన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తడబడిన కర్ణాటక మొదటి రోజును 229/5తో ముగించింది. 112కే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును శ్రీనివాస్ శరత్ (58 బ్యాటింగ్; 143 బంతుల్లో 4×4)తో కలిసి మయాంక్ రక్షించాడు. మరో వికెట్ పడకుండా ఈ జోడీ ఆచితూచి బ్యాటింగ్ కొనసాగించింది. ఈ జంట అబేధ్యమైన ఆరో వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్ (2/64) రాణించాడు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్తో మరో సెమీస్లో బెంగాల్కు అదిరే ఆరంభం లభించింది. ఇండోర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో సుదీప్ కుమార్ (112; 213 బంతుల్లో 12×4, 2×6), అనుత్సుప్ మజుందార్ (120; 206 బంతుల్లో 13×4, 1×6) శతకాలు బాదడంతో తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. వీళ్ల శతకాల సాయంతో తొలి రోజు ఆటను 307/4తో ముగించింది. సుదీప్, అనుత్సుప్ మూడో వికెట్కు 241 పరుగులు జోడించారు. ఆఖర్లో కొత్త బంతితో ఈ ఇద్దరినీ ఔట్ చేయడం మధ్యప్రదేశ్కు ఊరటనిచ్చే విషయం. కెప్టెన్ మనోజ్ తివారి (5 బ్యాటింగ్), షాబాజ్ అహ్మద్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం