IND vs AUS: ఆస్ట్రేలియాదే ఆరంభం
ఇటు ఆస్ట్రేలియాతో సిరీస్ సొంతం చేసుకునే దిశగా.. అటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే వైపుగా ఎంతో కీలకమైన నాలుగో టెస్టులో టీమ్ఇండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు.
ఖవాజా అజేయ శతకం
తొలి ఇన్నింగ్స్లో 255/4
శ్రమించిన భారత బౌలర్లు
అహ్మదాబాద్
ఎంత మార్పు! ఈ సారి బంతి గింగిరాలు తిరగలేదు.. అస్థిరమైన బౌన్స్ కనిపించలేదు.. అనూహ్యంగా తక్కువ ఎత్తులో దూసుకెళ్లలేదు. గత మూడు టెస్టులతో పోలిస్తే పూర్తి భిన్నంగా బ్యాటింగ్కు చక్కగా అనుకూలిస్తున్న పిచ్పై నాలుగో మ్యాచ్ తొలి రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. నెమ్మదిగా పరుగులు సాధించినా సిరీస్లో తొలిసారి కంగారూ బ్యాటర్లు సౌకర్యవంతంగా కనిపించారు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసినా.. ఖవాజా పట్టుదలగా క్రీజులో నిలబడి అజేయ శతకం సాధించాడు. వికెట్ల కోసం టీమ్ఇండియా బౌలర్లు చెమటోడ్చినా పెద్దగా ఫలితం దక్కలేదు.
ఇటు ఆస్ట్రేలియాతో సిరీస్ సొంతం చేసుకునే దిశగా.. అటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే వైపుగా ఎంతో కీలకమైన నాలుగో టెస్టులో టీమ్ఇండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. గురువారం బౌలర్లకు పెద్దగా సహకరించని పిచ్పై ఆరంభమైన మ్యాచ్లో తొలి రోజు ఆసీస్ పైచేయి సాధించింది. ఉస్మాన్ ఖవాజా (104 బ్యాటింగ్; 251 బంతుల్లో 15×4) అజేయ శతక సాయంతో ఆ జట్టు 90 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులతో మొదటి రోజు ఆట ముగించింది. అతనికి తోడుగా కామెరూన్ గ్రీన్ (49 బ్యాటింగ్; 64 బంతుల్లో 8×4) క్రీజులో ఉన్నాడు. బౌలింగ్కు అనుకూలించని పిచ్పై బ్యాటర్లను పెవిలియన్ చేర్చేందుకు టీమ్ఇండియా శ్రమించాల్సి వచ్చింది. రోజంతా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టింది. సిరాజ్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చిన షమి (2/65) ఆకట్టుకున్నాడు. అశ్విన్ (1/57), జడేజా (1/49) చెరో వికెట్ సాధించారు. రెండో రోజు ఆటలో ప్రత్యర్థిని ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారన్న దాని పైనే మ్యాచ్లో భారత గమనాన్ని నిర్ణయించనుంది.
నెమ్మదిగా మొదలై..: ఫ్లాట్ పిచ్పై టాస్ గెలవగానే మరో సందేహం లేకుండా ఆస్ట్రేలియా బ్యాటింగ్కు దిగింది. కొత్త బంతితో భారత్దే ఆధిపత్యం. నెమ్మదిగా స్పందిస్తున్న పిచ్పై కట్టుదిట్టంగా బంతులేసిన మన బౌలర్లు.. పరుగుల కోసం ప్రత్యర్థి బ్యాటర్లను కష్టపడేలా చేశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోనే భారత్కు వికెట్ దక్కేది. ఉమేశ్ బౌలింగ్లో హెడ్ (32) క్యాచ్ను వికెట్ కీపర్ భరత్ పట్టలేకపోయాడు. 12వ ఓవర్లో మరో అవకాశం లభించింది. గిల్ త్రో నేరుగా వికెట్లకు తాకితే ఖవాజా రనౌటయ్యేవాడు. కానీ అది భారత్కు కలిసిరాలేదు. ఉదయం గంటకు పైగా జట్టుకు వికెట్ లభించలేదు. క్రమంగా వేగం పెంచిన హెడ్ను ఔట్ చేసి అశ్విన్.. 61 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హెడ్.. మిడాన్లో జడేజా చేతికి చిక్కాడు. గత అయిదేళ్లలో భారత్లో టెస్టులో ఓ ప్రత్యర్థి జట్టు తొలి వికెట్కు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇది కేవలం నాలుగో సారి మాత్రమే. కాస్త రివర్స్ స్వింగ్ లభించడంతో లబుషేన్ (3)ను షమి కుదురుకోనివ్వలేదు. కానీ ఆ తర్వాత ఖవాజా, స్మిత్ (38) జాగ్రత్తగా ఆడడంతో 75/2తో ఆ జట్టు లంచ్కు వెళ్లింది.
ఆ ఇద్దరిదే..: రెండో సెషన్లో కంగారూ బ్యాటర్లు బౌలర్లను మరింత పరీక్షకు గురిచేశారు. స్పిన్ ఆడటంలో మంచి నైపుణ్యం కలిగిన ఖవాజా, స్మిత్ పట్టుదలగా క్రీజులో పాతుకుపోవడంతో ఈ సెషన్లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఖవాజా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని మరీ ముందుగానే అంచనా వేసి షాట్లు ఆడలేదు. ఆత్రుత ప్రదర్శించలేదు. తనకు వచ్చిన బంతిని జాగ్రత్తగా గమనిస్తూ, ఆచితూచి బ్యాటింగ్ కొనసాగించాడు. చెత్త బంతుల కోసం నిరీక్షించాడు. స్మిత్ కూడా క్రీజులో కుదురుకున్నాడు. పరుగులు వేగంగా రాకపోయినా వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంతో ఇద్దరూ బ్యాటింగ్ కొనసాగించారు. ఓవర్కు ఒకటి లేదా రెండు పరుగులు సాధిస్తూ.. అప్పుడప్పుడూ బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ నడిపించారు. ఫోర్తో 146 బంతుల్లో ఖవాజా అర్ధశతకం చేరుకున్నాడు. స్పిన్ త్రయం అశ్విన్, అక్షర్, జడేజా వికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. చివరకు శ్రేయస్ అయ్యర్తోనూ రోహిత్ ఓ ఓవర్ వేయించాడు. కానీ ఫలితం రాలేదు. దీంతో టీ విరామానికి ఆసీస్ 149/2తో నిలిచింది. ఈ సిరీస్లోనే ఒక్క వికెట్ కూడా పడని సెషన్ ఇదే. గత పదేళ్లలో భారత్లో ఓ టెస్టు సెషన్లో ప్రత్యర్థి బ్యాటర్లు ఇంతలా నియంత్రణ ప్రదర్శించడమూ ఇదే తొలిసారి.
రెండు పడ్డా..: విరామం తర్వాత స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టిన టీమ్ఇండియా తిరిగి పుంజుకునేలా కనిపించింది. మూడో సెషన్ రెండో ఓవర్లోనే స్మిత్ను జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో 79 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరో ఎండ్లో ఉమేశ్ బౌన్సర్లతో పరీక్షించాడు. రౌండ్ ద వికెట్ నుంచి మళ్లీ బౌలింగ్కు వచ్చిన షమి.. హ్యాండ్స్కాంబ్ (17) ఆఫ్స్టంప్ను ఎగరగొట్టాడు. దీంతో ఆ జట్టు 170/4తో నిలిచింది. కానీ ఆసీస్ను చుట్టేయాలనుకున్న భారత ప్రయత్నాలకు ఖవాజాతో కలిసి గ్రీన్ అడ్డుగా నిలిచాడు. ఓ ఎండ్లో ఫ్లిక్ షాట్లు, చూడముచ్చటైన డ్రైవ్లతో ఖవాజా జోరు కొనసాగించాడు. ఎలాంటి తడబాటు లేకుండా, బౌలర్లకు చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. అసలు సిసలైన టెస్టు బ్యాటింగ్ను కళ్లకు కట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడ్డ గ్రీన్.. కొత్త బంతి రాగానే గేరు మార్చాడు. మరో తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగా.. భారత్ కొత్త బంతి తీసుకుంది. ఆ తొమ్మిది ఓవర్లలో ఆసీస్ 54 పరుగులు సాధించింది. అప్పటికే ఎండలో రోజంతా ఆడి అలసిపోయిన బౌలర్లు, మరోవైపు ఫ్లాట్ పిచ్.. ఇంకేముంది గ్రీన్ ఎదురు దాడికి దిగాడు. బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్లో బౌండరీతో ఖవాజా శతకం (246 బంతుల్లో) అందుకున్నాడు. ఈ జోడీ అబేధ్యమైన అయిదో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. గత అయిదేళ్లలో భారత్లో టీమ్ఇండియాపై టెస్టు శతకం సాధించిన ఆరో బ్యాటర్ ఖవాజా. మరోవైపు అక్షర్ వికెట్ తీయలేకపోయినా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. 12 ఓవర్లు వేసిన అతను కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
‘‘సెంచరీ సాధించినప్పుడు ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను. ఇంతకుముందు రెండుసార్లు భారత్లో పర్యటించాను. అప్పుడు ఎనిమిది మ్యాచ్ల్లో ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడానికే ఉపయోగపడ్డాను. స్పిన్ ఆడలేవని నాపై ముద్ర వేశారు. ఇప్పుడు భారత్లో తొలిసారి శతకం అందుకున్నందుకు సంతోషంగా ఉంది’’
ఉస్మాన్ ఖవాజా, ఆస్ట్రేలియా ఓపెనర్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హెడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 32; ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్ 104; లబుషేన్ (బి) షమి 3; స్మిత్ (బి) జడేజా 38; హ్యాండ్స్కాంబ్ (బి) షమి 17; కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్ 49; ఎక్స్ట్రాలు 12; మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 255; వికెట్ల పతనం: 1-61, 2-72, 3-151, 4-170; బౌలింగ్: షమి 17-2-65-2; ఉమేశ్ 15-2-58-0; అశ్విన్ 25-8-57-1; జడేజా 20-2-49-1; అక్షర్ 12-4-14-0; శ్రేయస్ 1-0-2-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM