IND Vs AUS: కంగారూల్ని కొట్టి.. కంగారూలతో సై!
అనూహ్యమేమీ జరగలేదు. నాటకీయతా లేదు. భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు డ్రా. నాలుగో రోజు ఆట ఆఖరికి టీమ్ఇండియాకు చిన్న అవకాశమున్నట్లనిపించినా ఆఖరి రోజు ఆస్ట్రేలియా ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ అర్హత
ఆస్ట్రేలియాతో చివరి టెస్టు డ్రా
వరుసగా నాలుగో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సొంతం
అనూహ్యమేమీ జరగలేదు. నాటకీయతా లేదు. భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు డ్రా. నాలుగో రోజు ఆట ఆఖరికి టీమ్ఇండియాకు చిన్న అవకాశమున్నట్లనిపించినా ఆఖరి రోజు ఆస్ట్రేలియా ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఎలాంటి తడబాటుకు లేకుండా ప్రశాంతంగా మ్యాచ్ను డ్రాగా ముగించింది. పిచ్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఆతిథ్య జట్టు బౌలింగ్తో ప్రత్యర్థిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. మ్యాచ్ డ్రాగా ముగిసినా.. సిరీస్ను చేజిక్కించుకున్న భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. అక్కడ ప్రత్యర్థి కూడా ఆస్ట్రేలియానే.
అహ్మదాబాద్
ఊహించినట్లే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 3/0తో సోమవారం, అయిదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ప్రశాంతంగా ఆడుకుంది. ట్రావిస్ హెడ్ (90; 163 బంతుల్లో 10×4, 2×6), లబుషేన్ (63 నాటౌట్; 213 బంతుల్లో 7×4) రాణించడంతో టీ తర్వాత 175/2 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కొన్ని ఓవర్లు ఆడే అవకాశమున్నా భారత్ బరిలోకి దిగలేదు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నిర్ణీత సమయానికి ముందే రెండు జట్లు డ్రాకు అంగీకరించాయి. ఈ ఫలితంతో భారత్ 2-1తో సిరీస్ను చేజిక్కించుకుంది. వరుసగా నాలుగో సారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ నెగ్గగా.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అశ్విన్, జడేజాలకు సంయుక్తంగా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. భారత్ గత మూడు సిరీస్ల్లోనూ ఆస్ట్రేలియాను 2-1తో ఓడించడం విశేషం. 2017లో సొంతగడ్డపై నెగ్గిన టీమ్ఇండియా.. 2018-19, 2020-21లో ఆస్ట్రేలియాలో ఆడి పైచేయి సాధించింది.
అవకాశమివ్వని ఆసీస్: ఆఖరి రోజు ఆస్ట్రేలియా అలవోకగా, ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసింది. నిర్జీవ పిచ్పై ఆ జట్టు బ్యాటర్లకు భారత బౌలర్లు ఎలాంటి సమస్యలు సృష్టించలేకపోయారు. 88 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. రెండు సెషన్లకు పైగా ఆడి రెండే వికెట్లు కోల్పోయింది. నైట్వాచ్మన్ కునెమన్ (6)ను అశ్విన్ త్వరగానే వెనక్కి పంపినా.. హెడ్, లబుషేన్ చక్కగా బ్యాటింగ్ చేశారు. ఆసీస్ కీలక బ్యాటర్గా సిరీస్లో అడుగుపెట్టి తొలి మూడు మ్యాచ్ల్లో అర్ధశతకం సాధించలేకపోయిన లబుషేన్.. ఈసారి నిలబడ్డాడు. ఓపెనర్ హెడ్ కూడా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. టీకి కాసేపు ముందు అక్షర్ అతణ్ని బౌల్డ్ చేయడంతో 139 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. టీ సమయానికి ఆసీస్ స్కోరు 158/2. లబుషేన్ 56తో నిలిచాడు. మ్యాచ్ డ్రా అని చాలా ముందే అర్థమైన నేపథ్యంలో ఆఖరి సెషన్లో మిగిలి ఉన్న ఆసక్తి లబుషేన్ సెంచరీ చేస్తాడా లేదా అన్నదే. అయితే స్మిత్ (10 నాటౌట్; 59 బంతుల్లో 2×4)తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన అతడు.. బ్యాట్ ఝుళిపించలేదు. గంటకు పైగా ఆట మిగిలి ఉండగా రెండు జట్లు డ్రాకు అంగీకరించాయి. ఆసీస్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇలా..
ఓడినా, డ్రా చేసుకున్నా.. న్యూజిలాండ్తో రెండు టెస్టుల్లో శ్రీలంక గెలిస్తే భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరలేదు. బోర్డర్-గావస్కర్ సిరీస్లో ఆఖరి టెస్టుకు ముందు పరిస్థితిది. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి టెస్టులో మెరుగైన ఆటతో లంక డబ్ల్యూటీసీ ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది. టీమ్ఇండియాకు ఇబ్బందవుతుందేమో అనిపించింది. అయితే ఆఖరి రోజు (సోమవారం) ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో లంకను కివీస్ ఓడించడంతో భారత్కు మార్గం సుగమమైంది. అహ్మదాబాద్లో ఆఖరి రోజు రెండో సెషన్ ఆరంభంలోనే రోహిత్సేనకు ఈ శుభవార్త అందింది. భారత్, ఆసీస్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7న లండన్లో ఆరంభమవుతుంది. పట్టికలో అగ్రస్థానంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది. టీమ్ఇండియాకు ఇది వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్.
4
ఆస్ట్రేలియాపై భారత్కు ఇది వరుసగా నాలుగో సిరీస్. అన్నింటినీ 2-1తో గెలిచింది.
16
సొంతగడ్డపై భారత జట్టుకు ఇది వరుసగా 16వ టెస్టు సిరీస్ విజయం
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480
భారత్ తొలి ఇన్నింగ్స్: 571
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: కునెమన్ ఎల్బీ (బి) అశ్విన్ 6; ట్రావిస్ హెడ్ (బి) అక్షర్ 90; లబుషేన్ నాటౌట్ 63; స్టీవెన్ స్మిత్ నాటౌట్ 10; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (78.1 ఓవర్లలో) 175/2 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1-14, 2-153; బౌలింగ్: అశ్విన్ 24-9-58-1; జడేజా 20-7-34-0; షమి 8-1-19-0; అక్షర్ పటేల్ 19-8-36-1; ఉమేశ్ యాదవ్ 5-0-21-0; శుభ్మన్ గిల్ 1.1-0-1-0; పుజారా 1-0-1-0
కొందరు ఆటగాళ్లు ముందే ఇంగ్లాండ్కు
ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరని జట్లలో ఉండే టీమ్ఇండియా ఆటగాళ్లు కాస్త ముందుగానే ఇంగ్లాండ్ చేరుకుంటారని కెప్టెన్ రోహిత్శర్మ అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు లండన్లో రెండు వారాల శిక్షణ శిబిరంలో పాల్గొనే అవకాశముందని తెలిపాడు. జూన్ 7న ఓవల్ మైదానంలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభమవుతుంది. అంతకుముందు మే నెలాఖర్లో ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ప్రస్తుత టెస్టు జట్టులోని పుజారా మాత్రమే ఐపీఎల్లో ఆడట్లేదు. ‘‘ఇది క్లిష్టమైన పరిస్థితే. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడబోయే ఆటగాళ్లను నిరంతరం సంప్రదిస్తాం. వారి పనిభారాన్ని పర్యవేక్షిస్తాం. మే 21 వరకు ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి ఆరు జట్లు నిష్క్రమిస్తాయి. కాబట్టి అందుబాటులో ఉన్న ఆటగాళ్లను వీలైనంత త్వరగా ఇంగ్లాండ్కు పంపిస్తాం. సాధ్యమైనంత మేరకు అన్నీ పర్యవేక్షిస్తాం. ఫాస్ట్ బౌలర్లకు కొన్ని డ్యూక్ (ఎరుపు) బంతులు పంపిస్తున్నాం. ఐపీఎల్ మధ్యలో సమయం దొరికితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సన్నాహాలు కీలకమని నమ్ముతున్నా. తటస్థ వేదికపై ఫైనల్ ఆడుతుండటం ఇరుజట్లకు భిన్నమైన అనుభవమే అవుతుంది. రెండు జట్లు అక్కడ చాలా క్రికెట్ ఆడాయి. కొత్త పరిస్థితులేమీ కావు. అయితే భారత్లో టీమ్ఇండియా, కంగారు గడ్డపై ఆసీస్ ఆడటంతో పోల్చుకుంటే కాస్త భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అందుకు ఇరుజట్లు సిద్ధమవుతాయనే అనుకుంటున్నా’’ అని రోహిత్ తెలిపాడు. భారత్లో ఎస్జీ, ఆసీస్లో కూకబుర్రా బంతులతో టెస్టులు నిర్వహిస్తారు. ఇంగాండ్లో డ్యూక్ బంతుల్ని ఉపయోగిస్తారు.
శ్రేయస్.. ఎక్కువ రోజులే: వెన్ను గాయంతో బాధపడుతున్న భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో రావడానికి ఎక్కువ రోజులే పట్టొచ్చని రోహిత్ చెప్పాడు. ‘‘ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు నాలుగో రోజు తన వంతు కోసం శ్రేయస్ రోజంతా ఎదురుచూశాడు. కానీ అవకాశం వచ్చేసరికి వెన్ను గాయంతో ఆడలేకపోయాడు. వైద్యులు అతడికి స్కానింగ్ తీశారు. నివేదికల్లో ఏముందో తెలియదు. కానీ అతడి పరిస్థితి చూస్తే కొన్నాళ్లు మైదానంలో దిగకపోవచ్చని అర్థం అవుతుంది. శ్రేయస్ కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. త్వరగా కోలుకుని పునరాగమనం చేయాలని కోరుకుంటున్నా’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో మార్చి 17న ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్కు దూరమైన శ్రేయస్.. ఐపీఎల్లో ఆడడం కూడా అనుమానంగా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో 167 ఓవర్లు ఫీల్డింగ్ చేసిన తర్వాత శ్రేయస్కు వెన్ను నొప్పి మొదలైంది. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగలేదు. గతంలో వెన్ను గాయంతోనే జట్టుకు దూరమై ఇటీవలే అయ్యర్ పునరాగమనం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్