సంక్షిప్త వార్తలు (4)
భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్బరేలీలోని ఒక స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్’ పేరిట పిలవనున్నారు.
స్టేడియానికి రాణి రాంపాల్ పేరు
దిల్లీ: భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్బరేలీలోని ఒక స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్’ పేరిట పిలవనున్నారు. మంగళవారం రాణీనే ఈ స్టేడియాన్ని ప్రారంభించింది. హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమే. ‘‘ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటల్లేవ్. యువతరానికి ఇదో స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని రాణి ట్విటర్లో పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్లో చరిత్రాత్మక ప్రదర్శన తర్వాత గాయంతో చాలారోజులు భారత జట్టుకు దూరమైన ఈ మాజీ కెప్టెన్.. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనతో పునరాగమనం చేసింది.
క్లాసెన్ మెరుపు శతకం
విండీస్తో మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
పోచెఫ్స్ట్రూమ్: వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మంగళవారం మూడో వన్డేలో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (119 నాటౌట్; 61 బంతుల్లో 15×4, 5×6) సాధించడంతో 261 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 29.3 ఓవర్లలోనే ఛేదించింది. విండీస్ బౌలర్లలో అల్జారి జోసెఫ్ (3/50), అకీల్ హొసీన్ (2/49) సత్తా చాటారు. మొదట జాన్సన్ (2/46), ఫోర్టుయిన్ (2/46), కొయెట్జీ (2/53)ల ధాటికి విండీస్ 260 పరుగులకే ఆలౌటైంది. కింగ్ (72) టాప్స్కోరర్. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. రెండో మ్యాచ్లో విండీస్ నెగ్గింది.
వన్డే ప్రపంచకప్ వేదికగా హైదరాబాద్!
దిల్లీ: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా హైదరాబాద్ను ప్రాథమికంగా బీసీసీఐ ఎంపిక చేసినట్లు సమాచారం. తుది నిర్ణయం తర్వాత బీసీసీఐ ఆ వేదికలను ప్రకటిస్తుంది. అందులో హైదరాబాద్ ఉంటే తెలుగు రాష్ట్రాల అభిమానులకు పండగే. ఈ ప్రపంచకప్ తేదీలు, వేదికలపై బీసీసీఐ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీని ప్రారంభించి, నవంబర్ 19న ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది. 10 జట్లు పోటీపడే ఈ ప్రపంచకప్ వేదికలుగా కనీసం 12 మైదానాలను బీసీసీఐ ప్రాథమికంగా ఎంపిక చేసిందని సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ జరిగే ఆస్కారముంది. దీంతో పాటు బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువాహతి, హైదరాబాద్, కోల్కతా, లఖ్నవూ, ఇందౌర్, రాజ్కోట్, ముంబయి వేదికలుగా బీసీసీఐ తొలి జాబితా రూపొందించిందని తెలిసింది.
ప్రధాన డ్రాకు సిక్కిజోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి- రోహన్ కపూర్ జోడీ ప్రధాన డ్రాకు అర్హత సాధించింది. మంగళవారం క్వాలిఫయర్స్లో ఈ జంట 21-17, 15-21, 21-18 తేడాతో ఫ్రాంజిస్కా- ప్యాట్రిక్ (జర్మనీ)పై గెలిచింది. తొలి రౌండ్లో ఈ భారత ద్వయం.. హీ యాంగ్- వీ హాన్ (సింగపూర్)తో తలపడుతుంది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి- ఆరతి 21-15, 15-21, 21-18తో పాలా- లారెన్ (అమెరికా)పై నెగ్గి ముందంజ వేసింది. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్ కూడా ప్రధాన డ్రాలో చోటు దక్కించుకుంది. క్వాలిఫయర్స్లో ఆమె 21-17, 21-7తో లారెన్ (అమెరికా)పై గెలిచింది. తొలి రౌండ్లో కిమ్ గా (కొరియా)ను ఆమె ఢీ కొడుతుంది. ఆకర్షి కశ్యప్, కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్ కూడా అర్హత రౌండ్లో ఆడాల్సింది. కానీ ఇతర ప్లేయర్లు తప్పుకోవడంతో వీళ్లకు నేరుగా ప్రధాన డ్రా మ్యాచ్లు ఆడే అవకాశం దక్కింది. మరోవైపు సింగిల్స్లో ప్రియాన్షు, మీరబా మైస్నమ్, డబుల్స్లో అశ్విని పొన్నప్ప- సుమీత్ రెడ్డి, తనీష- అశ్విని పొన్నప్ప, సుమీత్- రోహన్ క్వాలిఫయర్స్లో ఓడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
ఐపీఎల్ 2024లో బెంగళూరు వరుస ఆరు ఓటముల తర్వాత రెండో విజయం సాధించింది. హైదరాబాద్ను 35 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడించింది. -
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా