దిల్లీదే కిరీటం
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి దశకు తెరపడింది. ముంబయి, దిల్లీ జట్లతో దోబూచులాడిన అగ్రస్థానం.. చివరికి దిల్లీనే వరించింది. లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో యూపీ వారియర్స్పై ఘనవిజయం సాధించిన క్యాపిటల్స్..
అగ్రస్థానంతో ఫైనల్లోకి ప్రవేశం
ముంబయి, యూపీ మధ్య ఎలిమినేటర్
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి దశకు తెరపడింది. ముంబయి, దిల్లీ జట్లతో దోబూచులాడిన అగ్రస్థానం.. చివరికి దిల్లీనే వరించింది. లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో యూపీ వారియర్స్పై ఘనవిజయం సాధించిన క్యాపిటల్స్.. అగ్రస్థానంతో నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి మ్యాచ్లో బెంగళూరును ఓడించి, దిల్లీతో సమానంగా ఆరు విజయాలు సాధించినప్పటికీ.. నెట్ రన్రేట్లో వెనుకబడటంతో ముంబయి రెండో స్థానానికి పరిమితం కాక తప్పలేదు. మూడో స్థానంలో నిలిచిన యూపీతో ఆ జట్టు శుక్రవారం ఎలిమినేటర్లో తలపడనుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది.
మహిళల ప్రిమియర్ లీగ్లో లీగ్ దశను దిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంతో ముగించింది. అలీస్ కాప్సీ ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టడంతో యూపీ వారియర్స్ను ఓడించి.. రన్రేట్లో ముంబయి (1.711)ని వెనక్కి నెట్టిన దిల్లీ (1.856) నంబర్వన్ జట్టుగా నిలిచింది. మంగళవారం దిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీపై నెగ్గింది. మొదట యూపీ 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. తాలియా మెక్గ్రాత్ (58 నాటౌట్; 32 బంతుల్లో 8×4, 2×6) టాప్ స్కోరర్. అలీసా హీలీ (36; 34 బంతుల్లో 4×4, 1×6) కూడా రాణించింది. అలీస్ కాప్సీ (3/26), రాధ (2/28) ప్రత్యర్థిని కట్టడి చేశారు. లక్ష్యాన్ని దిల్లీ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. మెగ్ లానింగ్ (39; 23 బంతుల్లో 5×4, 2×6)తో పాటు కాప్సీ (34; 31 బంతుల్లో 4×4, 1×6), మరిజేన్ కాప్ (34 నాటౌట్; 31 బంతుల్లో 4×4, 1×6) సత్తా చాటారు.
కాప్సీ, లానింగ్ మెరుపులు: రన్రేట్లో ముంబయిని దాటి అగ్రస్థానం సాధించాలంటే 19.4 లేదా అంతకంటే తక్కువ ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన దిల్లీ.. శుభారంభమే చేసింది. కెప్టెన్ లానింగ్, షెఫాలివర్మ (21) పోటీపడి ఆడడంతో స్కోరుబోర్డు మెరుపులా సాగింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు రాబట్టిన దిల్లీ.. పవర్ ప్లే ఆఖరికి 67/1తో దూసుకెళ్లింది. తర్వాత షెఫాలి వికెట్ కోల్పోయింది. షబ్నిమ్ ఇస్మాయిల్ ఒకే ఓవర్లో జెమీమా (3), లానింగ్ వికెట్లు తీసి దిల్లీని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. అయితే కాప్సీ దూకుడుగా ఆడడంతో క్యాపిటల్స్కు ఇబ్బంది లేకపోయింది. ఎకిల్స్టోన్ వేసిన తొమ్మిదో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన కాప్సీ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించి దిల్లీని లక్ష్యానికి చేరువ చేసింది. తర్వాత కాప్సీ ఔటైనా.. దూకుడుగా ఆడిన కాప్ దిల్లీని విజయతీరాలకు చేర్చింది. ఆ జట్టు మరో 13 బంతులు ఉండగానే నెగ్గింది.
మొదట అలీసా.. ఆపై తాలియా: అంతకుముందు యూపీ గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే తాలియా మెక్గ్రాత్, అలీసా హీలీలే కారణం. ఆరంభంలో అలీసా ఇన్నింగ్స్ను నిలబెడితే.. ధనాధన్ ఆటతో తాలియా మెరుపు ముగింపు ఇచ్చింది. 4 ఓవర్లకు 30/0తో యూపీ బాగానే ప్రారంభించినా.. ఆ తర్వాత తడబడింది. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల కష్టంగా వచ్చాయి. కానీ హీలీ అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝుళిపించి స్కోరింగ్ రేట్ మరీ పడిపోకుండా చూసింది. అయిదే రాధ బౌలింగ్లో హీలీ ఔట్ కావడంతో వారియర్స్కు దెబ్బ తగిలింది. స్కోరు మళ్లీ తగ్గింది. ఈ స్థితిలో అరుంధతి వేసిన 14వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్కు ఊపు తెచ్చిన తాలియా.. ఆ తర్వాతా జోరు కొనసాగించింది. సిక్స్లు, ఫోర్లతో స్కోరును పరుగులెత్తించింది. దీంతో 18 ఓవర్లకు 105/6తో ఉన్న యూపీ.. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు రాబట్టి సంతృప్తికరంగా ఇన్నింగ్ను ముగించింది.
యూపీ ఇన్నింగ్స్: అలీసా హీలీ (స్టంప్డ్) తానియా (బి) కాప్సీ 36; శ్వేత (సి) జొనాసెన్ (బి) రాధ 19; సిమ్రన్ (సి) జెమీమా (బి) రాధ 11; తాలియా నాటౌట్ 58; కిరణ్ (స్టంప్డ్) తానియా (బి) జొనాసెన్ 2; దీప్తి (స్టంప్డ్) తానియా (బి) కాప్సీ 3; ఎకిల్స్టోన్ (స్టంప్డ్) తానియా (బి) కాప్సీ 0; అంజలి నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 138; వికెట్ల పతనం: 1-30, 2-63, 3-71, 4-91, 5-104, 6-105; బౌలింగ్: మరిజేన్ కాప్ 4-0-24-0; శిఖా పాండే 2-0-16-0; జెస్ జొనాసెన్ 4-0-24-1; రాధ యాదవ్ 4-0-28-2; అరుంధతి 2-0-19-0; అలీస్ కాప్సీ 4-0-26-3
దిల్లీ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (సి) సిమ్రన్ (బి) షబ్నిమ్ 39; షెఫాలి (సి) ఎకిల్స్టోన్ (బి) యషశ్రీ 21; జెమీమా ఎల్బీ (బి) షబ్నిమ్ 3; కాప్ నాటౌట్ 34; అలీస్ కాప్సీ (స్టంప్డ్) హీలీ (బి) ఎకిల్స్టోన్ 34; జొనాసెన్ రనౌట్ 0; అరుంధతి నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 11 మొత్తం: (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 142; వికెట్ల పతనం: 1-56, 2-67, 3-70, 4-130, 5-136; బౌలింగ్: షబ్నిమ్ 3-0-29-2; యషశ్రీ 3-0-26-1; సోఫీ ఎకిల్స్టోన్ 4-0-25-1; అంజలి 2-0-15-0; దీప్తి 3.5-37-0; పార్శవి 2-0-9-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు