నిఖత్కు పతకం ఖాయం
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) అదరగొట్టింది. మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్స్లో సెమీఫైనల్ చేరడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది.
లవ్లీనా, స్వీటీ, నీతులకు కూడా..
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
మహిళల ప్రపంచ బాక్సింగ్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) అదరగొట్టింది. మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్స్లో సెమీఫైనల్ చేరడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. లవ్లీనా (75 కేజీలు) నీతు గాంగాస్ (48 కేజీలు), స్వీటీ బూర (81 కేజీలు) కూడా సెమీస్ చేరడంతో భారత్కు మొత్తం నాలుగు పతకాలు ఖరారయ్యాయి. టోర్నీ ఫేవరెట్ నిఖత్ బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 5-2తో థాయ్లాండ్కు చెందిన రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్స్ కాంస్య పతక విజేత చుతామత్ రక్సాత్ను ఓడించింది. జాగ్రత్తగా ఎటాకింగ్ చేసిన నిఖత్ తొలి రెండు రౌండ్లలో ప్రత్యర్థిపై పదునైన పంచ్లు విసిరింది. అయితే చివరి రౌండ్లో ఆమె జోరు కాస్త తగ్గింది. నిఖత్ సెమీస్లో కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్ వాలెన్సియాతో తలపడుతుంది. మరో క్వార్టర్స్లో లవ్లీనా 5-0తో రాడీ గ్రామేన్ (మొజాంబిక్)ను చిత్తు చేసింది. లవ్లీనా ఆద్యంతం ఆదిపత్యాన్ని ప్రదర్శించి మూడో ప్రపంచ ఛాంపియన్షిప్స్ పతకాన్ని ఖాయం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల పసిడి విజేత నీతు క్వార్టర్స్లో మడోక వాదా (జపాన్)ను చిత్తుచేసింది. దూకుడు మీదున్న 22 ఏళ్ల నీతు బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమె పంచ్లకు ప్రత్యర్థికి తట్టుకోలేకపోయింది. దీంతో రెండో రౌండ్లో బౌట్ను ఆపిన రిఫరీ నీతును విజేతగా ప్రకటించాడు. ఈ టోర్నీలో వరుసగా మూడో బౌట్లోనూ ఆమె ప్రత్యర్థిని నాకౌట్ చేయడం విశేషం. మరోవైపు తొలి బౌట్లో బై లభించిన స్వీటీ క్వార్టర్స్లో సత్తాచాటింది. 30 ఏళ్ల స్వీటీ 5-0తో విక్టోరియా కెబికావా (బెలారస్)పై అలవోకగా గెలిచింది. సమయానుకూలంగా, పరిస్థితులకు తగినట్లు దాడి చేయడంతో పాటు ఆమె రక్షణాత్మకంగానూ వ్యవహరించింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రెండో ప్రపంచ ఛాంపియన్షిప్స్ పతకాన్ని ఖాయం చేసుకుంది. స్వీటీ 2014లో రజతం నెగ్గింది. సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా (57 కేజీలు) క్వార్టర్స్లోనే నిష్క్రమించారు. సాక్షి 0-5తో యూ వూ (చైనా) చేతిలో, మనీషా 1-4తో అమీన జిదాని (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. జాస్మీన్ లంబోరియా (60కేజీ), నుపుర్ షెరాన్ (+81కేజీ) కూడా క్వార్టర్స్ దాటలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల