పసిడికి పంచ్ దూరంలో..
వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ ఛాంపియన్గా నిలిచేందుకు యువ సంచలనం నిఖత్ జరీన్ మరో బౌట్ దూరంలో ఉంది.
ఫైనల్లో నిఖత్ జరీన్
నీతు, లవ్లీనా, స్వీటీ కూడా
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్
వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ ఛాంపియన్గా నిలిచేందుకు యువ సంచలనం నిఖత్ జరీన్ మరో బౌట్ దూరంలో ఉంది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణానికి, ఆమెకు మధ్య మరో పోరు మాత్రమే మిగిలింది. ఫేవరెట్ అంచనాలను నిలబెట్టుకుంటూ.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయిస్తూ సాగుతున్న ఆమె ఫైనల్లోకి దూసుకెళ్లింది. లవ్లీనా, నీతు, స్వీటీ కూడా తుదిపోరుకు చేరారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో వరుసగా రెండో ఏడాదీ పసిడి ముద్దాడేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్ దూరంలో నిలిచింది. పోటీపడే బరువు విభాగం మారినా.. అదే దూకుడు కొనసాగిస్తున్న ఆమె 50 కేజీల విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం సెమీస్లో 26 ఏళ్ల నిఖత్ 5-0 తేడాతో కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్ వాలెన్సియాను చిత్తుచేసింది. క్వార్టర్స్లో రక్సాత్ నుంచి ప్రతిఘటన ఎదుర్కున్నా పోరాడి గెలిచిన నిఖత్.. వాలెన్సియాతో సమరంలో జూలు విదిల్చింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్షిప్స్లో రజతం గెలిచిన 34 ఏళ్ల వాలెన్సియా.. నిఖత్ ధాటికి నిలవలేకపోయింది. తొలి రౌండ్ మొదలయ్యిందో లేదో నిఖత్ చేతులు వేగాన్ని అందుకున్నాయి. ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకుని పంచ్లు కురిపించాయి. ఎడమ చేతిని చూపిస్తూ.. కుడి చేతి పంచ్లతో తెలంగాణ అమ్మాయి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. రింగ్లో చిరుతలా కదులుతూ రియో ఒలింపిక్స్ కాంస్య విజేత వాలెన్సియాను బోల్తా కొట్టిస్తూ పిడిగుద్దులతో సాగింది. విక్టోరియాకు నిఖత్ను ఆపడానికే సమయం సరిపోయింది. తొలి రౌండ్లో 4-1తో మన బాక్సర్దే ఆధిపత్యం. రెండో రౌండ్లో ఆమె మరింతగా చెలరేగింది. పదేపదే ప్రత్యర్థి పైకి దూసుకెళ్లింది. దాడిని ఉద్ధృతం చేసింది. కాళ్లను ఓ వైపు కదుపుతూ పంచ్లు మరోవైపు విసురుతూ ప్రత్యర్థిని తికమక పెట్టింది. ప్రత్యర్థికి దిమ్మతిరిగేలా హుక్, సైడ్ పంచ్లిచ్చింది. ముఖంపై నేరుగా ముష్ఠిఘాతాలు కురిపించింది. మూడో రౌండ్లోనూ ఆమెదే హవా. కిందకు వంగి ప్రత్యర్థి ముఖంపై పంచ్లు విసిరింది. చివరివరకూ అదే దూకుడు కొనసాగించింది. అయిదుగురు జడ్జీల నిఖత్కు అనుకూలంగా తీర్పిచ్చారు. ఫైనల్లో న్యూయెన్ (వియత్నాం)తో నిఖత్ తలపడుతుంది.
ఈ ముగ్గురూ అదుర్స్
ఈ ఛాంపియన్షిప్స్లో నీతు గాంగాస్ (48 కేజీ), లవ్లీనా (75 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) కూడా ఫైనల్స్లో అడుగుపెట్టారు. నిరుడు క్వార్టర్స్లో తనను ఓడించిన అలువా బల్కిబెకోవా (కజకిస్థాన్)పై నీతు ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్లో ఆమె 5-2తో గతేడాది రజత విజేత బల్కిబెకోవాను ఓడించింది. తొలి రౌండ్లో 2-3తో వెనకబడ్డప్పటికీ నీతు అద్భుతంగా పుంజుకుంది. తనను ప్రత్యర్థి తరచుగా నెడుతూ, కిందపడేసినా.. తిరిగి లేచిన ఆమె పంచ్లతో విరుచుకుపడింది. ఉత్కంఠగా సాగిన చివరి రౌండ్లోనూ నీతు అదే వేగాన్ని ప్రదర్శించింది. పోరు హోరాహోరీగా ముగియడంతో చివరికి సమీక్షలో నీతును విజేతగా ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్షిప్స్లో రెండు కాంస్యాలు నెగ్గిన లవ్లీనా.. తొలిసారి ఈ టోర్నీ తుదిపోరు చేరింది. సెమీస్లో ఆమె 4-1తో లి కియాన్ (చైనా)ను ఓడించింది. స్వీటీ 4-3తో ఎమ్మా గ్రీన్ట్రీ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచింది.
‘‘ఇది నా ఉత్తమ బౌట్. టెక్నిక్ పరంగా మెరుగ్గా ఉన్న బాక్సర్లను ఎదుర్కొన్నప్పుడు నేను అత్యుత్తమంగా ఆడతాననిపిస్తుంది. వాలెన్సియాతో గతంలోనూ తలపడ్డా. ఆమె అనుభవమున్న బాక్సర్. ఆమెతో పోరు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సాగింది’’
నిఖత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్