సంక్షిప్త సమాచారం (4)
‘ద హండ్రెడ్’ టీ20 టోర్నమెంట్లో భారత మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్.. ట్రెంట్ రాకెట్స్ జట్టు తరఫున బరిలో దిగనుంది.
ట్రెంట్ రాకెట్స్ తరఫున హర్మన్ప్రీత్
లండన్: ‘ద హండ్రెడ్’ టీ20 టోర్నమెంట్లో భారత మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్.. ట్రెంట్ రాకెట్స్ జట్టు తరఫున బరిలో దిగనుంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. సదరన్ బ్రేవ్కు ఆడనుంది. తాజాగా ప్రకటించిన డ్రాఫ్ట్లో పురుషులు, మహిళల్లో కలిపి 64 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. మహిళల డ్రాఫ్ట్ను నిర్వహించడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ స్టార్లు షహీన్షా అఫ్రిది, హారిస్ రవూఫ్లను వెల్స్ ఫైర్ జట్టు తీసుకోగా.. బాబర్ అజామ్పై ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. మాజీ వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్, న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ కూడా అమ్ముడుపోలేదు. ఆగస్టు 1న ‘ద హండ్రెడ్’ టోర్నీ ఆరంభం కాబోతోంది.
సలీమాకు ఏహెచ్ఎఫ్ అవార్డు
దిల్లీ: ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) 2022 ఉత్తమ వర్ధమాన మహిళా క్రీడాకారిణి అవార్డు భారత స్టార్ సలీమా టెట్ను వరించింది. కొరియాలో జరిగిన ఏహెచ్ఎఫ్ వార్షిక సమావేశంలో సలీమా ఈ పురస్కారాన్ని అందుకుంది. ‘‘మైదానంలో నా ప్రతిభను గుర్తించినందుకు ఆసియా హాకీ సమాఖ్యకు కృతజ్ఞతలు. మా జట్టు సభ్యుల సహకారం లేకుండా ఈ గుర్తింపు వచ్చేది కాదు’’ అని సలీమా చెప్పింది. 2016లో అరంగేట్రం చేసిన నాటి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న ఈ మిడ్ఫీల్డర్.. టోక్యో ఒలింపిక్స్లో భారత్ నాలుగో స్థానంలో నిలవడంలో ముఖ్య భూమిక పోషించింది. 2018లో యూత్ ఒలింపిక్స్లో రజతం గెలిచిన జట్టులోనూ ఆమె ఉంది. మరోవైపు హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి బోళానాథ్ సింగ్కు ‘వర్ధమాన స్పోర్ట్ లీడర్’ అవార్డు లభించింది.
ప్రపంచ ఛాంపియన్షిప్లో విషీ మాట
దిల్లీ: ఆటతో ప్రపంచ చెస్ను ఏలిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. రాబోయే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో మాటతోనూ అలరించబోతున్నాడు. ఈ టోర్నీలో అతడు వ్యాఖ్యాతగా కొత్త పాత్రలో కనిపించనున్నాడు. కజకిస్థాన్లోని ఆస్తానాలో వచ్చే నెల 7న ఆరంభమయ్యే ఈ ఈవెంట్లో ఎనిమిదిసార్లు యుఎస్ మహిళల ఛాంపియన్ ఇరినా క్రష్తో కలిసి విషీ.. తొలి నాలుగు గేమ్లకు వ్యాఖ్యానం అందిస్తాడు. డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) పోటీకి దూరం కావడంతో కాండిడేట్స్ చెస్ విజేత ఇయాన్ నిపొమ్నియాచి (రష్యా)తో రన్నరప్ డింగ్ లీరెన్ (చైనా) ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం తలపడనున్నాడు. చెస్లో 2013 తర్వాత కొత్త ప్రపంచ ఛాంపియన్ రాబోతున్నాడు. ఆనంద్ను ఓడించి మాగ్నస్ ఛాంపియన్షిప్ గెలిచాక మరెవరూ అతడిని ఓడించలేదు. ఆసక్తి లేకపోవడం వల్ల ప్రపంచ ఛాంపియన్షిప్ పోరుకు దూరమవుతున్నానని కార్ల్సన్ ఇదివరకే ప్రకటించాడు.
‘బీసీసీఐ ఎలాంటి ఆదేశాలివ్వలేదు’
దిల్లీ: టీమ్ఇండియా ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు నివేదిక పంపిందని, స్పష్టమైన ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని దిల్లీ క్యాపిటల్స్ సీఈవో ధీరజ్ మల్హోత్రా చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెటర్ల పని భారంపై బీసీసీఐ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ.. ‘‘లేదు. కాంట్రాక్ట్ ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ ఫ్రాంఛైజీలకు ఓ నివేదిక పంపింది. మా నుంచి వారు ఏమి కోరుకుంటున్నారన్నదానిపై అందులో ఎలాంటి సమాచారం లేదు’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..