మీ పంచ్బంగారంగానూ
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో భారత అమ్మాయిలు కీలక సమరానికి సిద్ధమయ్యారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో నిఖత్ జరీన్ (50 కేజీ), లవ్లీనా బోర్గోహెయిన్ (75 కేజీ), నీతు గాంగాస్ (48 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) ఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే.
నేడు నీతు, స్వీటీ ఫైనల్స్
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో భారత అమ్మాయిలు కీలక సమరానికి సిద్ధమయ్యారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో నిఖత్ జరీన్ (50 కేజీ), లవ్లీనా బోర్గోహెయిన్ (75 కేజీ), నీతు గాంగాస్ (48 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) ఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే. వీళ్లలో హరియాణా బాక్సర్లు నీతు, స్వీటీ శనివారం తమ తమ విభాగాల్లో టైటిల్ పోరులో తలపడనున్నారు. తొలిసారి పసిడి ముద్దాడాలనే లక్ష్యంతో సమరానికి సై అంటున్నారు. నిరుడు స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతు.. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో దూకుడు మీదుంది. వరుసగా మూడు బౌట్లలోనూ ప్రత్యర్థిని నాకౌట్ చేసి సెమీస్ చేరిన ఆమె.. ఆ పోరులో బలమైన బాక్సర్ బల్కిబెకోవా (కజకిస్థాన్)పై 5-2తో గెలిచింది. ఏడాది కాలంగా ఆటలో ఎంతో మెరుగైన నీతు.. ప్రత్యర్థిని బట్టి తన వ్యూహాలు మార్చుకుంటూ విజయాల వేటలో సాగుతోంది. ఆసియా ఛాంపియన్షిప్స్ కాంస్య విజేత లుత్సాయిఖాన్ (మంగోలియా)తో ఫైనల్లో నీతు తలపడుతుంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ యూత్ ఛాంపియన్గా నిలిచిన 22 ఏళ్ల నీతు.. ఇప్పుడు తొలిసారి సీనియర్ టైటిల్ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు 2014 ఫైనల్లో ఓడి రజతంతో సంతృప్తి చెందిన 30 ఏళ్ల స్వీటీ.. ఈ సారి పసిడిని వదలకూడదనే పట్టుదలతో ఉంది. సెమీస్లో ఎమ్మా (ఆస్ట్రేలియా) నుంచి కఠిన సవాలు ఎదుర్కొని 4-3తో గెలిచిన స్వీటీ ఫైనల్లో మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధమైంది. 2018 ప్రపంచ ఛాంపియన్, 2019 కాంస్య విజేత వాంగ్ లీనా (చైనా) రూపంలో ఫైనల్లో ఆమెకు సవాలు ఎదురు కానుంది. సాయంత్రం 6 గంటలకు ఫైనల్ మ్యాచ్లు ఆరంభమవుతాయి. ఆదివారం ఫైనల్స్లో న్యూయెన్ (వియత్నాం)తో నిఖత్, కైత్లిన్ పార్కర్ (ఆస్ట్రేలియా)తో లవ్లీనా పోటీపడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం