పంచ్ అదిరె..పసిడి చేరె
వేదిక దిల్లీలోని కె.డి. జాదవ్ ఇండోర్ హాల్.. సమయం సాయంత్రం. ప్రేక్షకులతో పాటు దేశంలోని బాక్సింగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన వేళ.. స్టేడియంలోని వెలుతురంతా తమపైనే ఉండగా..
స్వర్ణాలు నెగ్గిన నీతు, స్వీటీ
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్
వేదిక దిల్లీలోని కె.డి. జాదవ్ ఇండోర్ హాల్.. సమయం సాయంత్రం. ప్రేక్షకులతో పాటు దేశంలోని బాక్సింగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన వేళ.. స్టేడియంలోని వెలుతురంతా తమపైనే ఉండగా.. మొదట నీతు, ఆ తర్వాత స్వీటీ.. దేశం ఆశలు మోస్తూ రింగ్లో అడుగుపెట్టారు. సొంతగడ్డపై అంచనాలను అందుకుంటూ.. రింగ్లో ఆత్మవిశ్వాసంతో పోరాడారు. ప్రత్యర్థులపై తిరుగులేని పంచ్లు విసిరి.. తొలిసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. దేశానికి స్వర్ణాలు అందించారు. మొత్తం మీద భారత్ నుంచి విశ్వ విజేతగా నిలిచిన ఆరో బాక్సర్గా నీతు.. ఏడో బాక్సర్గా స్విటీ ఘనత సాధించారు.
దిల్లీ : భారత అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో నీతు గాంగాస్, స్వీటీ బూర పసిడి పతకాలు ముద్దాడారు. మొదట 48 కేజీల విభాగం ఫైనల్లో నీతు 5-0 తేడాతో లుత్సాయిఖాన్ (మంగోలియా)ను చిత్తుచేసింది. తుదిపోరులో ఆమె పంచ్లకు ప్రత్యర్థి నుంచి సమాధానమే లేకపోయింది. బౌట్ ఆరంభం నుంచి నీతుదే దూకుడు. తొలి పంచ్ ఆమెదే. మొదటి రౌండ్ను మెరుగ్గా ఆరంభించిన ఆమె.. ఏ దశలోనూ తడబడలేదు. కుడి చేయి చూపిస్తూ ఎడమ చేతి పంచ్లతో ప్రత్యర్థి పైకి దూసుకెళ్లింది. లుత్సాయిఖాన్ తన మీద పడుతున్నా.. కిందకు వంగి తప్పించుకోవాలని చూస్తున్నా.. నీతు వదల్లేదు. ఈ క్రమంలో కింద పడ్డా తిరిగి లేచిన నీతు.. పంచ్ల వర్షం కురిపించింది. ప్రత్యర్థి ముఖాన్ని లక్ష్యంగా చేసుకుని.. బలమైన పంచ్లు ఇచ్చింది. నీతు జోరు ముందు ప్రత్యర్థి పూర్తిగా తేలిపోయింది. ముఖాన్ని దాచుకుంటూ.. రక్షణాత్మకంగా వ్యవహరించింది. రెండో రౌండ్లో నీతు మరింతగా చెలరేగింది. రింగ్లో సివంగిలా కదులుతూ.. క్షణం కూడా వృథా చేయకుండా పంచ్ల వర్షం కురిపించింది. హుక్, అప్పరకట్ పంచ్లిచ్చింది. ఇక చివరి రౌండ్లో నీతు తెలివిగా ఆడింది. అనవసరమైన తప్పిదాలు చేయకుండా.. రింగ్లో తిరుగుతూ అవకాశం కోసం ఎదురు చూసింది. ఒక్కసారి అదను దొరగ్గానే వరుసగా పంచ్లు విసిరింది. దీంతో అయిదుగురు జడ్జీలు నీతూకే ఓటేశారు. మరోవైపు 81 కేజీల విభాగం టైటిల్ పోరులో స్వీటీ 4-3తో వాంగ్ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది. తనకంటే ఎత్తున్న ప్రత్యర్థిపై స్వీటీ ఆరంభంలో అనుకున్నట్లు పంచ్లు ఇవ్వలేకపోయింది. దీంతో వ్యూహం మార్చింది. అప్పర్కట్తో పంచ్లిచ్చింది. ప్రత్యర్థి వేగం ప్రదర్శించినా.. స్వీటీ దీటుగా నిలబడింది. తలను కిందకు వంచి.. వాంగ్ ముఖంపై పంచ్లు విసిరింది. తొలి రౌండ్లో స్వీటీనే ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్ మరింత హోరాహోరీగా సాగింది. వాంగ్ దూకుడుకు ఏ మాత్రం తగ్గకుండా స్వీటీ వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేసి రెండో రౌండ్లోనూ పైచేయి సాధించింది. చివరి మూడు నిమిషాల్లోనూ స్వీటీ ఏ మాత్రం తగ్గలేదు. కింద పడిపోతున్నా.. మళ్లీ పైకి లేచి ముష్ఠిఘాతాలు కురిపించింది. బాక్సర్లిద్దరూ పంచ్లతో విరుచుకుపడడంతో పోరు రసవత్తరంగా ముగిసింది. చివరకు బౌట్ సమీక్షలో స్వీటీనే విజేతగా నిలిచింది. ఆనందం పట్టలేకపోయిన ఆమె రింగ్లో త్రివర్ణ పతాకంతో పరుగులు పెట్టింది. స్వర్ణాలతో పాటు రూ.82 లక్షల చొప్పున ప్రైజ్మనీ నీతు, స్వీటీ సొంతమైంది.
నీతు, స్వీటీలకు ప్రధాని అభినందన: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో బంగారు పతకాలు సాధించిన నీతు గాంగాస్, స్వీటీ బూరలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘నీతు గాంగాస్కు అభినందనలు. ఆమె ఘనతతో దేశం సంబరపడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. స్వీటీ బూర ప్రదర్శన అసాధారణమని, ఆమె విజయం ఎంతోమంది వర్ధమాన అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తుందని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
12
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్చరిత్రలో భారత్ ఇప్పటివరకూ గెలిచిన స్వర్ణాలు. అందులో మేరీకోమ్ ఆరు (2002, 2005, 2006, 2008, 2010, 2018) సార్లు విజేతగా నిలిచింది. సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ (2006), నిఖత్ జరీన్ (2022) ఒక్కోసారి టైటిల్ దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే