సంక్షిప్త వార్తలు (6)
సింధు, శ్రీకాంత్, ప్రణయ్ లాంటి టాప్ షట్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగిన స్విస్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి అదరగొట్టారు.
సాత్విక్-చిరాగ్ అదుర్స్
బాసెల్: సింధు, శ్రీకాంత్, ప్రణయ్ లాంటి టాప్ షట్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగిన స్విస్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి అదరగొట్టారు. డబుల్స్ టైటిల్ నెగ్గి సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన తుది సమరంలో చైనా జంటను ఓడించి కెరీర్లో అయిదో టైటిల్ను ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ 21-19, 24-22తో రెన్ జియాంగ్-టాన్ కియాంగ్ (చైనా)ను ఓడించారు. స్విస్ ఓపెన్లో మన దేశానికి ఇది ఆరో టైటిల్. డబుల్స్లో ఇదే మొదటిది. ఇంతకుముందు సింగిల్స్లో సైనా నెహ్వాల్ (2011, 2012) రెండుసార్లు నెగ్గగా.. సింధు (2022), శ్రీకాంత్ (2015), ప్రణయ్ (2016) కూడా టైటిళ్లు గెలిచారు.
స్విస్ టైటిల్ కైవసం
సమ్రాకు కాంస్యం
భోపాల్: ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్/పిస్టల్ ప్రపంచకప్ 50 మీటర రైఫిల్ 3 పొజిషన్స్లో భారత వర్ధమాన షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్యం గెలుచుకుంది. ర్యాంకింగ్ రౌండ్లో ఆమె 403.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. జాంగ్ (414.7), అనేటా బ్రబకోవా (411.3) టైటిల్ రౌండ్కు అర్హత సాధించారు. స్వర్ణ పతక పోరులో జాంగ్ (చైనా) 16-8తో బ్రబకోవా (చెక్)పై గెలిచింది. భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, 5 కాంస్యాలతో పతకాల పట్టికలో చైనా (8 స్వర్ణాలు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
హంపి-హారిక గేమ్ డ్రా
దిల్లీ: మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో తొలి గేమ్ను హంపి, హారిక డ్రా చేసుకున్నారు. ఆదివారం ఆరంభమైన టోర్నీ తొలి రౌండ్లో హారికతో తలపడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్ను డ్రాగా ముగించింది. వైశాలి శుభారంభం చేసింది. ఎలిజిబెత్ (జర్మనీ)తో మ్యాచ్లో ఆమెకు విజయం దక్కింది.
భారత్కు క్లిష్టమైన డ్రా
సుదిర్మన్ కప్
దిల్లీ: సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. చైనాలోని సుజ్హోలో మే 14న ఆరంభమయ్యే ఈ టోర్నీలో గ్రూప్-సిలో బలమైన మలేసియా, చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా మాత్రమే మన జట్టుకు తేలికైన ప్రత్యర్థి. 2011, 2017 టోర్నీల్లో అత్యుత్తమంగా క్వార్టర్ఫైనల్ చేరిన భారత్.. గత రెండు కప్లలో ఆ దశకు కూడా వెళ్లలేకపోయింది. ఈ ఫిబ్రవరిలో ఆసియా మిక్స్డ్ టోర్నీలో కాంస్యం గెలవడం ద్వారా సుదిర్మన్ కప్కు అర్హత సాధించిన భారత్కు ఈసారి క్వార్టర్స్ చేరడం కూడా అంత సులభం కాదు. 16 జట్లు తలపడే ఈ టోర్నీలో 12సార్లు ఛాంపియన్ చైనా.. డెన్మార్క్, సింగపూర్, ఈజిప్ట్తో కలిసి గ్రూప్-ఎలో ఉండగా.. గ్రూప్-బిలో ఇండోనేషియా, థాయ్లాండ్, జర్మనీ, కెనడా.. గ్రూప్-డిలో 4సార్లు ఛాంపియన్ కొరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జపాన్ పోటీపడుతున్నాయి.
డాక్టర్ షూటర్.. సిప్త్ కౌర్ సమ్రాది
ప్రపంచకప్లో కాంస్యం గెలిచిన పంజాబ్ అమ్మాయి సిప్త్ కౌర్ సమ్రాది భిన్నమైన నేపథ్యం. వైద్య విద్య చదువుతూనే షూటింగ్లో కొనసాగుతోంది సిప్త్. గతేడాది జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ సమయంలో ఆమెకు ఎంబీబీఎస్లో సీటు వచ్చింది. దీంతో ఆ టోర్నీనే తనకు చివరిది అనుకుంది. ఆటను వదిలేద్దామని నిర్ణయించుకుంది. కానీ ఈ టోర్నీలో జాతీయ రికార్డుతో స్వర్ణం నెగ్గింది. ఈ టోర్నీ కన్నా ముందు ఆమె జూనియర్ ప్రపంచకప్లో అయిదు పతకాలు సాధించింది. దీంతో షూటింగ్కు దూరం కాలేదు. టోర్నీల్లో ఆడేందుకు వీలు కల్పించాలని.. ఎంబీబీఎస్ తొలి ఏడాది పరీక్షలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కళాశాలను కోరినా వాళ్లు అనుమతించలేదు. కానీ పట్టుదలగా అటు వైద్య విద్య.. ఇటు షూటింగ్ను కొనసాగిస్తున్న సిప్త్.. ప్రపంచకప్లో పతకంతో సత్తా చాటింది.
భారత్ ఖాతాలో రెండు కాంస్యాలు
దిల్లీ: ప్రపంచ యూత్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత్ రెండు కాంస్య పతకాలు నెగ్గింది. అల్బేనియాలోని డరెస్లో జరుగుతున్న టోర్నీలో తొలిరోజు జోత్స్న (40 కేజీ), ధనుష్ (49 కేజీ) కంచు సొంతం చేసుకున్నారు. మహిళల 40 కేజీల కేటగిరిలో స్నాచ్లో 53 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్లో 62 కేజీలు ఎత్తిన 14 ఏళ్ల జోత్స్న.. మొత్తం మీద 115 కేజీలతో మూడో స్థానంలో నిలిచింది. స్నాచ్లో రజతం గెలిచిన ఆమె క్లీన్ అండ్ జెర్క్లో ఆరో స్థానం మాత్రమే సాధించగలిగింది. పురుషుల 49 కేజీల విభాగంలో 200 కేజీలు (స్నాచ్ 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 112 కేజీలు) లిఫ్ట్ చేసిన ధనుష్ మూడో స్థానం సాధించాడు. స్నాచ్లో ధనుష్ రజతం సాధించాడు. కాంటినెంటల్, ప్రపంచ ఛాంపియన్షిప్లలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, టోటల్ లిఫ్ట్లలో విడివిడిగా కూడా పతకాలు ఇస్తారు. ఒలింపిక్స్లో మాత్రం మొత్తం బరువుకు మాత్రమే పతకం వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?