WPL 2023: ముంబయికే పట్టం
ముంబయి ఇండియన్స్ అదుర్స్. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఈ ఫ్రాంఛైజీ.. మొట్టమొదటి మహిళల ప్రిమియర్ లీగ్ ఛాంపియన్గా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్ప్రీత్ నేతృత్వంలోని ముంబయి.. రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. దిల్లీకి నిరాశ.
డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం
రాణించిన సీవర్, వాంగ్, హేలీ
ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ ఓటమి
ముంబయి
ముంబయి ఇండియన్స్ అదుర్స్. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఈ ఫ్రాంఛైజీ.. మొట్టమొదటి మహిళల ప్రిమియర్ లీగ్ ఛాంపియన్గా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్ప్రీత్ నేతృత్వంలోని ముంబయి.. రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. దిల్లీకి నిరాశ. పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. బంతితో వాంగ్, హేలీ, అమేలియా.. బ్యాటుతో నీట్ సీవర్ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.
ముంబయి ఇండియన్స్దే డబ్ల్యూపీఎల్ టైటిల్. నాట్ సీవర్ (60 నాటౌట్; 55 బంతుల్లో 7×4) రాణించడంతో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. ఇసీ వాంగ్ (3/42), హేలీ మాథ్యూస్ (3/5), అమేలియా కెర్ (2/18) విజృంభించడంతో మొదట దిల్లీ 9 వికెట్లకు 131 పరుగులే చేయగలిగింది. లానింగ్ (35; 29 బంతుల్లో 5×4) దిల్లీ టాప్ స్కోరర్. చాలా తక్కువ స్కోరుకే కుప్పకూలేలా కనిపించిన ఆ జట్టును చివరి వరుస బ్యాటర్లు శిఖా పాండే (27 నాటౌట్; 17 బంతుల్లో 3×4, 1×6), రాధా యాదవ్ (27 నాటౌట్; 12 బంతుల్లో 2×4, 2×6) ఆదుకున్నారు. సీవర్తో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (37; 39 బంతుల్లో 5×4), అమేలియా కెర్ (14 నాటౌట్; 8 బంతుల్లో 2×4) రాణించడంతో లక్ష్యాన్ని ముంబయి 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
నిలిచిన సీవర్: లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబయి ఛేదన కష్టంగానే సాగింది. 4 ఓవర్లలో 24 పరుగులకే ఓపెనర్లు హేలీ (13), యాస్తిక భాటియా (4)లను ముంబయి కోల్పోయింది. ఆ దశలో సీవర్, హర్మన్ప్రీత్ నిలిచారు. బ్యాటర్లు దాటిగా ఆడకపోవడంతో సాధించాల్సిన రన్రేట్ పెరుగుతూ పోయింది. 11 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 55 మాత్రమే. ఆ తర్వాత బ్యాటర్లు కాస్త వేగం పెంచినా 16 ఓవర్లలో 95/2తో నిలిచిన ముంబయికి.. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతిలో 8 వికెట్లున్నా ఛేదన కష్టంగానే అనిపించింది. అలాంటి స్థితిలో హర్మన్ ఔటైంది. కానీ దూకుడు పెంచిన సీవర్ అదే ఓవర్లో (17వ) రెండు ఫోర్లు కొట్టింది. 18వ ఓవర్లో శిఖా అయిదు పరుగులే ఇవ్వడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబయిపై ఒత్తిడీ పెరిగింది. కానీ సీవర్ ఓ ఫోర్, అమేలియా కెర్ రెండు ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్లో జొనాసెన్ 16 పరుగులు సమర్పించుకుంది. దీంతో దిల్లీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
దిల్లీకి కళ్లెం: వాంగ్, అమేలియా, హేలీ సూపర్ బౌలింగ్తో ముంబయి అంతకుముందు దిల్లీకి కళ్లెం వేసింది. నిజానికి దిల్లీ చేసిన 131 కూడా అస్సలు ఊహించని స్కోరే. ఎందుకంటే 79 పరుగులకే 9 వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఫైనల్లో చాలా ముందే చేతులెత్తేసినట్లనిపించింది. చివరి జంట.. టెయిలెండర్లు శిఖ పాండే, రాధా యాదవ్ల అద్భుత పోరాట పుణ్యమా అని ఆ జట్టు కాస్త పోరాడగలిగే స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ ఆరంభం పేలవం. వాంగ్.. రెండో ఓవర్లోనే షెఫాలి (11), క్యాప్సీ (0)ని ఔట్ చేసి ఆ జట్టుకు షాకిచ్చింది. అయిదో ఓవర్లో జెమీమా (9)ను కూడా వాంగ్ వెనక్కి పంపడంతో దిల్లీ 35/3తో చిక్కుల్లో పడింది. ఈ ముగ్గురూ ఫుల్టాస్లకే ఔట్ కావడం విశేషం. అయితే చక్కగా ఆడుతున్న లానింగ్కు కాప్ (18; 21 బంతుల్లో 2×4) తోడవడంతో దిల్లీ కోలుకుంది. 10.2 ఓవర్లలో 73/3తో నిలిచింది. కానీ అనూహ్యంగా గతి తప్పిన ఆ జట్టు 6 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లలో 79/9తో నిలిచిన దిల్లీ పని అయిపోనట్లేనని భావించారంతా. కానీ ఊహించని విధంగా చెలరేగిన శిఖా, రాధా యాదవ్ అభేద్యమైన ఆఖరి వికెట్కు కేవలం 24 బంతుల్లో 52 పరుగులు జోడించి దిల్లీని నిలబెట్టారు. మ్యాచ్ ఏకపక్షంగా కాకుండా చూశారు.
దిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ రనౌట్ 35; షెఫాలి వర్మ (సి) అమేలియా (బి) వాంగ్ 11; క్యాప్సీ (సి) అమన్జ్యోత్ (బి) వాంగ్ 0; జెమీమా (సి) హేలీ (బి) వాంగ్ 9; కాప్ (సి) యాస్తిక (బి) అమేలియా 18; జెస్ జొనాసెన్ (సి) అండ్ (బి) హేలీ 2; అరుంధతి రెడ్డి (సి) ఇషాక్ (బి) అమేలియా 0; శిఖా పాండే నాటౌట్ 27; మిన్ను మణి (స్టంప్డ్) యాస్తిక (బి) హేలీ 1; తానియా (బి) హేలీ 0; రాధా నాటౌట్ 27; ఎక్స్ట్రాలు 1 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-35, 4-73, 5-74, 6-75, 7-75, 8-79, 9-79; బౌలింగ్: నాట్ సీవర్ 4-0-37-0; ఇసి వాంగ్ 4-0-42-3; సైకా 4-0-28-0; అమేలియా 4-0-18-2; హేలీ మాథ్యూస్ 4-2-5-3
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) అరుంధతి (బి) జొనాసెన్ 13; యాస్తిక (సి) క్యాప్సీ (బి) రాధా 4; నాట్ సీవర్ నాటౌట్ 60; హర్మన్ప్రీత్ కౌర్ రనౌట్ 37; అమేలియా కెర్ నాటౌట్ 14; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 134; వికెట్ల పతనం: 1-13, 2-23, 3-95; బౌలింగ్: కాప్ 4-0-22-0; రాధా 4-0-24-1; జెస్ జొనాసెన్ 4-0-28-1; శిఖా పాండే 4-0-23-0; క్యాప్సీ 3.3-0-34-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు