wWBC: నిఖత్-లవ్లీ పంచ్
బలమైన పంచ్లతో చెలరేగి.. మెరుపు దాడులతో సత్తాచాటి.. రింగ్లో తన జోరుకు ఎదురు లేకుండా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొట్టింది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో అదరగొట్టిన జరీన్
వరుసగా రెండో ఏడాది తెలంగాణ బాక్సర్కు స్వర్ణం
75 కేజీల విభాగంలో సత్తాచాటిన బోర్గోహెయిన్
తొలిసారి పసిడి నెగ్గిన లవ్లీనా
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్
దిల్లీ
బలమైన పంచ్లతో చెలరేగి.. మెరుపు దాడులతో సత్తాచాటి.. రింగ్లో తన జోరుకు ఎదురు లేకుండా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఆదివారం 50 కేజీల విభాగంలో పసిడిని ముద్దాడి వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ టైటిల్ పట్టేసింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్ ఛాంపియన్గా నిలిచింది. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఆమె.. తొలిసారి ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సారి మొత్తం నాలుగు బంగారు పతకాలు భారత్ సొంతమయ్యాయి. 2006 తర్వాత ఓ ప్రపంచ ఛాంపియన్షిప్లో నాలుగు స్వర్ణాలు నెగ్గడం భారత్కు ఇదే తొలిసారి.
మాటల్లోనైనా.. చేతల్లోనైనా.. ఆమెకు తెలిసిందొక్కటే.. పంచ్!
ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు అని ప్రశ్నించారు?
ఎంపికపై గళమెత్తితే ఎందుకంత పొగరన్నారు?
అసలు ఎవరు నిఖత్ అంటూ ఎన్నో మాటలన్నారు!
అన్నింటికీ సమాధానంగా ఓ పంచ్ విసిరింది!
నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నిరుడు దేశానికి ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పసిడి అందించింది. పంచ్లతోనే సాగుతూ.. రింగ్లో సివంగిలా కదులుతూ.. మన నిఖత్ జరీన్ మరోసారి తాకత్ చూపించింది. వరుసగా రెండోసారి ప్రపంచ టైటిల్ పట్టేసింది. అసలు ఎవరు నిఖత్ అని ఎగతాళిగా మాట్లాడిన బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తర్వాత.. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత బాక్సర్గా రికార్డు సృష్టించింది. మరోవైపు లవ్లీనా కూడా ఈ సారి పతకం రంగు మార్చింది. గతంలో రెండుసార్లు కాంస్య పతకాలకు పరిమితమైన లవ్లీనా ఈసారి పసిడి పట్టేసింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం 50 కేజీల ఫైనల్లో ఆమె 5-0 తేడాతో థీ థామ్ న్యూయెన్ (వియత్నాం)ను చిత్తుచేసింది. 26 ఏళ్ల నిఖత్.. తుదిపోరులోనూ జోరు కొనసాగించి ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 28 ఏళ్ల న్యూయెన్ కూడా దీటుగా బదులివ్వడంతో ఈ బౌట్ హోరాహోరీగా సాగింది. ఒకరిని మరొకరు తోసేసుకోవడం, కింద పడిపోవడం, మెడను అణిచిపెట్టి పంచ్లు విసరడం.. ఇలా ఈ మ్యాచ్ ఓ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. బాక్సర్లిద్దరూ ఒక్కోసారి రిఫరీ నుంచి హెచ్చరిక (ఎల్లో కార్డు) కూడా అందుకున్నారు. తన ఎత్తును అనుకూలంగా మార్చుకుని న్యూయెన్ గట్టిపోటీనిచ్చింది. నిఖత్ను ఒకసారి తోసేసింది. పడి లేచిన నిఖత్ అప్పర్కట్, హుక్ పంచ్లతో చెలరేగింది. తన మెడను కిందకు వచ్చి.. న్యూయెన్ ఆధిపత్యం చలాయించాలని చూసినా నిఖత్ ఆగలేదు. ఎదురు దెబ్బలు తిన్నా.. తిరిగి లెక్క సరిచేసింది. తొలి రౌండ్లో నిఖత్దే పూర్తి ఆధిపత్యం. రెండో రౌండ్లో ఆమె మరింతగా చెలరేగింది. ముఖంపై ఎడమ చేతి పంచ్లతో రెచ్చిపోయింది. చివరి రౌండ్లో పోరు మరోస్థాయికి చేరింది. ఇద్దరు బాక్సర్లు ఒకరిపై మరొకరు పడిపోతూ.. పంచ్లు ఇచ్చుకున్నారు. నిఖత్ కుడిచేత్తో బలంగా ఓ పంచ్ ఇవ్వడంతో.. ప్రత్యర్థికి దిమ్మతిరిగింది. దీంతో రిఫరీ ఎనిమిది అంకెలు (8 కౌంట్) లెక్కపెట్టిన తర్వాత మళ్లీ బౌట్ కొనసాగించింది. ఈ సారి న్యూయెన్ బలంగా నిఖత్కు పంచ్ ఇవ్వడంతో రిఫరీ మళ్లీ 8 కౌంట్ చేసింది. అయిదుగురు జడ్జీలూ నిఖత్కే ఓటు వేయడంతో ఆమె సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకుంది.
75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5-2తో కైత్లిన్ పార్కర్ (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. రింగ్లో వేగంగా కదులుతూ.. అప్పర్కట్ పంచ్లతో లవ్లీనా దాడి కొనసాగించింది. పటిష్ఠమైన డిఫెన్స్తో పాటు దూకుడైన అటాకింగ్ నైపుణ్యాలు ప్రదర్శించింది. తొలి రౌండ్లో 3-2తో లవ్లీనాదే పైచేయి. రెండో రౌండ్లో కాస్త నెమ్మదించినట్లు కనిపించిన లవ్లీనా అవకాశం కోసం ఎదురు చూసింది. మరోవైపు కైత్లిన్ వేగం పెంచింది. లవ్లీనా ఎక్కువగా రక్షణాత్మకంగా వ్యవహరించింది. దీంతో కైత్లిన్ రెండో రౌండ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక మూడో రౌండ్లో లవ్లీనా ప్రాణం పెట్టి పోరాడింది. చివరకు బౌట్ సమీక్షలో లవ్లీనాకే జడ్జీలు జై కొట్టారు. తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ తదితరులు నిఖత్ పోరును ప్రత్యక్షంగా వీక్షించారు.
4
ఈ ఛాంపియన్షిప్స్లో భారత్ గెలిచిన బంగారు పతకాలు. స్వర్ణాల పరంగా 2006 ప్రపంచ ఛాంపియన్షిప్స్లో ఉత్తమ ప్రదర్శనను ఇప్పుడు సమం చేసింది.
2
ప్రపంచ బాక్సింగ్లో ఒకటి కంటే ఎక్కువ స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్ నిఖత్. ఆమె కంటే ముందు మేరీకోమ్ ఆరుసార్లు ఛాంపియన్గా నిలిచింది.
1
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో లవ్లీనాకు ఇదే తొలి స్వర్ణం. గతంలో ఆమె రెండు కాంస్యాలు (2018, 2019) గెలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ కంచు దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ