సంక్షిప్త వార్తలు (5)
అజర్బైజాన్లోని బాకులో మే 8న ఆరంభమయ్యే ప్రపంచకప్ షూటింగ్ స్టేజ్-5 ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ చోటు దక్కించుకుంది.
ప్రపంచకప్ షూటింగ్కు ఇషా
దిల్లీ: అజర్బైజాన్లోని బాకులో మే 8న ఆరంభమయ్యే ప్రపంచకప్ షూటింగ్ స్టేజ్-5 ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ చోటు దక్కించుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్పిస్టల్లో మను బాకర్ స్థానంలో ఇషా ఆడనుంది. 25 మీటర్ల పిస్టల్ కేటగిరిలో మను బరిలో దిగుతోంది. భోపాల్లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నీలో ఈ విభాగంలోనే మను కాంస్యం నెగ్గింది. ఇదే టోర్నీలో రాణించిన సాహు తుషార్ మానె (10 మీ ఎయిర్ రైఫిల్), శివ నర్వాల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్) కూడా ప్రపంచకప్ (స్టేజ్-5) బెర్తు దక్కించుకున్నారు.
వైశాలి గేమ్ డ్రా
దిల్లీ: మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో వైశాలికి వరుసగా రెండో డ్రా ఎదురైంది. శుక్రవారం ఆరో రౌండ్లో గొర్యాకీనా (రష్యా)తో 35 ఎత్తుల్లో ఆమె డ్రాగా ముగించింది. దీంతో వైశాలి (1 పాయింట్) పదో స్థానంలో కొనసాగుతోంది. కోనేరు హంపి (2.5) నాలుగు, ద్రోణవల్లి హారిక (1.5) ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయి. అసుబయెవా (కజకిస్థాన్, 4 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఇంకో 5 రౌండ్లు మిగిలున్నాయి.
దక్షిణాఫ్రికాదే రెండో వన్డే
బెనోని: నెదర్లాండ్స్తో మూడు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం రెండో వన్డేలో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట నెదర్లాండ్స్ 46.1 ఓవర్లలో 189కే ఆలౌటైంది. తేజ (48), విక్రమ్జీత్ సింగ్ (45) మాత్రమే రాణించారు. మగాల (3/37), షంసి (3/25), నోకియా (2/24) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో కెప్టెన్ బవుమా (90 నాటౌట్; 79 బంతుల్లో 8×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 30 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి అందుకుంది. బవుమాతో పాటు మార్క్రమ్ (51 నాటౌట్), వాండర్డసెన్ (31) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి వన్డే వర్షంతో రద్దయింది.
ఐర్లాండ్కు ఊరట విజయం
చట్గావ్: బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను ఇప్పటికే చేజార్చుకున్న ఐర్లాండ్కు ఊరట విజయం! ఆఖరిదైన మూడో మ్యాచ్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లా 19.2 ఓవర్లలో 124కే ఆలౌటైంది. షమీమ్ (51; 42 బంతుల్లో 5×4, 2×6) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అడైర్ (3/25), హంఫ్రీస్ (2/10) బంగ్లాను కట్టడి చేశారు. ఛేదనలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (77; 41 బంతుల్లో 10×4, 4×6) మెరుపులతో లక్ష్యాన్ని ఐర్లాండ్ 14 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. ఒక దశలో ఐర్లాండ్ 41/2తో నిలిచినా.. దూకుడుగా ఆడిన స్టిర్లింగ్ జట్టును విజయపథంలో నడిపించాడు. ఆఖర్లో అతడు వెనుదిరిగినా.. టెక్టార్ (14 నాటౌట్), కాంఫెర్ (16 నాటౌట్) ఐర్లాండ్ను విజయతీరాలకు చేర్చారు.
వింబుల్డన్లో రష్యా,బెలారస్ క్రీడాకారులు
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో రష్యా, బెలారస్ క్రీడాకారులు తటస్థ క్రీడాకారులుగా బరిలో దిగనున్నారు. గత ఏడాది ఆ దేశాలపై విధించిన నిషేధాన్ని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ శుక్రవారం వెనక్కి తీసుకుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మద్దతు తెలపకుండా ఉండటంతో పాటు పలు షరతులకు క్రీడాకారులు కట్టుబడి ఉండాలని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ పేర్కొంది. ‘‘వింబుల్డన్లో పాల్గొనేందుకు రష్యా, బెలారస్లకు చెందిన కంపెనీల స్పాన్సర్షిప్ల నుంచి నిధులు పొందకూడదు’’ అని క్లబ్ తెలిపింది. ఈ ఏడాది జులై 3న వింబుల్డన్ ప్రారంభమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్