ఆ స్పష్టత వచ్చాకే ఆటల్లోకి..
ఆటలను కెరీర్గా ఎంచుకుంటామనే కచ్చితమైన స్పష్టత వచ్చేంతవరకూ చదువుపై ధ్యాస పెట్టాలని భారత అగ్రశ్రేణి క్రికెటర్ విరాట్ కోహ్లి సూచించాడు.
బెంగళూరు: ఆటలను కెరీర్గా ఎంచుకుంటామనే కచ్చితమైన స్పష్టత వచ్చేంతవరకూ చదువుపై ధ్యాస పెట్టాలని భారత అగ్రశ్రేణి క్రికెటర్ విరాట్ కోహ్లి సూచించాడు. ‘‘గణితం మినహా పాఠశాలలో చదువులో నా ప్రదర్శన మెరుగ్గానే ఉండేది. కానీ పదో తరగతి తర్వాత భారత అండర్-19 జట్టుకు ఆడడం వల్ల ఎక్కువగా తరగతులకు వెళ్లలేకపోయా. అప్పుడు.. ‘పూర్తి సమయం క్రికెట్కే కేటాయిస్తావా? నీ శక్తినంతా ఆటకే ఖర్చు చేస్తావా’ అని నాన్న అడిగితే అవునని చెప్పా. ఆటలను కెరీర్గా ఎంచుకుంటామనే కచ్చితమైన స్పష్టత వచ్చేంతవరకూ చదువుపై ధ్యాస పెట్టాలి. క్రీడలకు పూర్తి సమయం కేటాయించేందుకు, దృష్టి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామా? అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అది విఫలమైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక గురించి ఆలోచించాలి’’ అని ఓ కార్యక్రమంలో కోహ్లి పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు