MI vs CSK: చెన్నై స్పిన్ విన్
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు వరుసగా రెండో సీజన్లోనూ తేలిపోతోంది. గత ఏడాది పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ పరాజయం చవిచూసింది.
రహానె విధ్వంసక ఇన్నింగ్స్
సీఎస్కేకు వరుసగా రెండో విజయం
ముంబయిని వణికించిన జడేజా, శాంట్నర్
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు వరుసగా రెండో సీజన్లోనూ తేలిపోతోంది. గత ఏడాది పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ పరాజయం చవిచూసింది. తొలి మ్యాచ్లో బెంగళూరు ఆ జట్టును చిత్తు చేస్తే.. రెండో మ్యాచ్లో చెన్నై మట్టి కరిపించింది. సొంతగడ్డపై మ్యాచ్ను ఘనంగానే ఆరంభించినా.. స్పిన్నర్లు జడేజా, శాంట్నర్ల ధాటికి విలవిలలాడిన ముంబయి 157/8కి పరిమితమైంది. నెమ్మదిగా ఆడతాడని పేరున్న అజింక్య రహానె విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి చెన్నైకి ఘనవిజయాన్నందించడం మ్యాచ్లో కొసమెరుపు.
ముంబయి : ఐపీఎల్-16ను ఓటమితో ఆరంభించినప్పటికీ.. తర్వాత పుంజుకున్న చెన్నై వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. మొదట ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జడేజా (3/20), శాంట్నర్ (2/28)ల ధాటికి ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. 32 పరుగులు చేసిన ఇషాన్ కిషనే ముంబయి జట్టులో టాప్స్కోరర్. అనంతరం అజింక్య రహానె (61; 27 బంతుల్లో 7×4, 3×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పిడుగులా పడ్డాడు: 158 పరుగుల లక్ష్యం అంటే జోరుమీదున్న చెన్నై ఓపెనర్లు రుతురాజ్, కాన్వే చెలరేగి ఆడి జట్టును గెలిపిస్తారనుకుంటే.. ఇద్దరూ తడబడ్డారు. కాన్వే (0) తొలి ఓవర్లోనే బెరెన్డార్ఫ్ (1/24) బంతిని వికెట్ల మీదికి ఆడుకుని వెనుదిరిగాడు. రుతురాజ్ (40 నాటౌట్; 36 బంతుల్లో 2×4, 1×6) పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రహానె.. ముంబయి జట్టు మీద పిడుగులా పడ్డాడు. తొలి రెండు మ్యాచ్ల్లో సబ్స్టిట్యూట్గా ఉన్న రహానెను ఈసారి తుది జట్టులోకి తీసుకోగా.. అతను మిగతా బ్యాటర్లు కష్టపడ్డ పిచ్ మీద విధ్వంసం సృష్టించాడు. మూడో ఓవర్లో బెరెన్డార్ఫ్ బంతిని పుల్ షాట్తో సిక్సర్గా మలచడంతో మొదలైంది రహానె జోరు. అర్షద్ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో అయితే అతను విశ్వరూపమే చూపించాడు. వరుసగా 6, 4, 4, 4, 4, బాదేశాడు. అవన్నీ చక్కటి క్రికెటింగ్ షాట్లే. అయిదో ఓవర్లోనే, కేవలం 19 బంతుల్లోనే రహానె అర్ధశతకం పూర్తయింది. పవర్ ప్లేలో చెన్నై స్కోరు 74/1. లక్ష్యంలో సగం కరిగిపోయాక చావ్లా వేసిన 8వ ఓవర్లో రహానె ఔటయ్యాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో చావ్లాకు తోడు ఇంపాక్ట్ ప్లేయర్గా కుమార్ కార్తికేయను దించాడు రోహిత్. వీరికి మరో స్పిన్నర్ షోకీన్ కూడా తోడవడంతో చెన్నై స్కోరు వేగం తగ్గింది. కానీ రుతురాజ్, దూబె అడపా దడపా షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించడం, లక్ష్యం పెద్దది కాకపోవడంతో చెన్నైకి ఇబ్బంది లేకపోయింది. 36 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో దూబె (28; 26 బంతుల్లో 2×4, 1×6) ఔటైనా.. రుతురాజ్తో కలిసి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రాయుడు (20 నాటౌట్; 16 బంతుల్లో 3×4) ధాటిగా ఆడి మిగతా పని పూర్తి చేశాడు.
దూకుడుగా మొదలుపెట్టి..: మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయికి దక్కిన ఆరంభానికి, ఆ జట్టు చివరికి చేసిన స్కోరుకు పొంతన లేదు. సొంతగడ్డపై అభిమానులు గొప్ప మద్దతునిస్తుండగా.. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (32; 21 బంతుల్లో 5×4), రోహిత్ శర్మ (21; 13 బంతుల్లో 3×4, 1×6) మెరుపు ఆరంభంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జోరుమీదున్న రోహిత్ను తుషార్ దేశ్పాండే బౌల్డ్ చేసి చెన్నైకి బ్రేక్ ఇచ్చినప్పటికీ 6 ఓవర్లకు 68/1తో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిశాక స్పిన్నర్ల రంగప్రవేశంతో కథ మారిపోయింది. జడేజా, శాంట్నర్ చెరో ఎండ్ నుంచి కట్టుదిట్టమైన బంతులతో ముంబయి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. గ్రీన్ను కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్తో జడేజా పెవిలియన్ చేర్చగా.. సూర్యకుమార్ను వికెట్ కీపర్ క్యాచ్తో శాంట్నర్ వెనక్కి పంపాడు. అంపైర్ సూర్యను నాటౌట్గా ప్రకటించినా.. సమీక్ష కోరిన ధోని సానుకూల ఫలితం రాబట్టాడు. నిలకడగా ఆడుతున్న ఇషాన్, తిలక్లను కూడా ఒకరి తర్వాత ఒకరిని జడేజా ఔట్ చేయడంతో ముంబయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 13 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 102/6. ఈ దశలో డేవిడ్ (31; 22 బంతుల్లో 1×4, 2×6).. చివర్లో షోకీన్ (18 నాటౌట్) కొన్ని షాట్లు ఆడటంతో ముంబయి కష్టం మీద 150 దాటింది. జడేజా, శాంట్నర్ కలిసి వేసిన 8 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ముంబయి 48 పరుగులే చేయగలిగింది.
ముంబయి: రోహిత్ (బి) తుషార్ 21; ఇషాన్ (సి) ప్రిటోరియస్ (బి) జడేజా 32; గ్రీన్ (సి) అండ్ (బి) జడేజా 12; సూర్యకుమార్ (సి) ధోని (బి) శాంట్నర్ 1; తిలక్ ఎల్బీ (బి) జడేజా 22; అర్షద్ ఎల్బీ (బి) శాంట్నర్ 2; డేవిడ్ (సి) రహానె (బి) తుషార్ 31; స్టబ్స్ (సి) రుతురాజ్ (బి) మగలా 5; షోకీన్ నాటౌట్ 18; చావ్లా నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157; వికెట్ల పతనం: 1-38, 2-64, 3-67, 4-73, 5-76, 6-102, 7-113, 8-131; బౌలింగ్: దీపక్ చాహర్ 1-0-10-0; తుషార్ దేశ్పాండే 3-0-31-2; మగలా 4-0-37-1; శాంట్నర్ 4-0-28-2; జడేజా 4-0-20-3; ప్రిటోరియస్ 4-0-28-0
చెన్నై: కాన్వే (బి) బెరెన్డార్ఫ్ 0; రుతురాజ్ నాటౌట్ 40; రహానె (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 61; దూబె (బి) కార్తికేయ 28; రాయుడు నాటౌట్ 20; ఎక్స్ట్రాలు 10 మొత్తం: (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-0, 2-82, 3-125; బౌలింగ్: బెరెన్డార్ఫ్ 3-0-24-1; అర్షద్ ఖాన్ 2.1-0-35-0; కామెరూన్ గ్రీన్ 3-0-20-0, పియూష్ చావ్లా 4-0-33-1; కుమార్ కార్తికేయ 4-0-24-1; హృతిక్ షోకీన్ 2-0-19-0
19
అర్ధశతకానికి రహానె ఆడిన బంతులు. ఈ సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైన 50.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు