MS Dhoni - CSK: ధోని ముగిస్తున్నాడా?
ఆదివారం చెపాక్లో కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్.. ఈ సీజన్లో సొంతగడ్డపై సీఎస్కేకు ఇదే చివరి లీగ్ పోరు.. మ్యాచ్ ముగిసింది.. సహచర ఆటగాళ్లతో కలిసి ధోని మైదానంలో తిరిగాడు.. రాకెట్ పట్టి టెన్నిస్ బంతులను ప్రేక్షకుల్లోకి కొట్టాడు.
వీడ్కోలుపై మళ్లీ చర్చ
చెన్నై: ఆదివారం చెపాక్లో కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్.. ఈ సీజన్లో సొంతగడ్డపై సీఎస్కేకు ఇదే చివరి లీగ్ పోరు.. మ్యాచ్ ముగిసింది.. సహచర ఆటగాళ్లతో కలిసి ధోని మైదానంలో తిరిగాడు.. రాకెట్ పట్టి టెన్నిస్ బంతులను ప్రేక్షకుల్లోకి కొట్టాడు. స్టాండ్స్లోకి సీఎస్కే జెర్సీలను విసిరాడు. అదే సమయంలో మైదానంలో వ్యాఖ్యానం చేస్తున్న దిగ్గజం సునీల్ గావస్కర్.. ధోని దగ్గరకు రాగానే పరుగెత్తుకు వెళ్లి తన చొక్కాపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. స్టాండ్స్లోని అభిమానులు కనపడేలా ధోని సెల్ఫీ తీసుకున్నాడు. అటు ప్రేక్షకులు.. ఇటు ధోని.. ఆ సమయంలో భావోద్వేగంతో కనిపించారు. దీంతో ఇదే ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అని, ఇక ఈ దిగ్గజం పూర్తిగా ఆటకు వీడ్కోలు పలుకుతాడనే చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. మ్యాచ్ తర్వాత పరిణామాలు చూస్తే ఇదే నిజమనే అభిప్రాయమూ కలుగుతోంది. చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడేశాననే సంకేతాలు ధోని ఇచ్చాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జులైలో 42వ పడిలోకి అడుగుపెట్టనున్న అతనికి వచ్చే సీజన్ ఆడడం కష్టమే కావొచ్చు. ప్రస్తుతం ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న అతను.. మ్యాచ్ తర్వాత మోకాలికి పట్టీతోనే కనిపించాడు. తన కెరీర్లో ఇది చివరి దశ అని కూడా మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఈ సీజన్లో సొంతగడ్డపైనే అని కాకుండా చెన్నై ఎక్కడ ఆడినా పసుపు రంగు జెర్సీలతో స్టేడియం నిండిపోతుండడంపై స్పందిస్తూ.. ‘‘నాకు వీడ్కోలు పలికేందుకు వస్తున్నారనుకుంటా’’ అని ఇప్పటికే అతను వ్యాఖ్యానించాడు. కానీ ధోని వచ్చే సీజన్ కూడా ఆడతాడనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్ కాబట్టి చెన్నై ఆటగాళ్లందరూ కలిసి అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా చేశారని కొందరు అంటున్నారు. అయితే ప్లేఆఫ్స్కు అడుగు దూరంలో ఉన్న చెన్నై.. మళ్లీ చెపాక్లో ఓ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. చెన్నైలో రెండు ప్లేఆఫ్స్ (తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్) మ్యాచ్లు జరగనున్నాయి. మరి ధోని ఈ సీజన్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
‘‘ఇదే తన చివరి ఐపీఎల్ సీజన్ అని ధోని సరిపడా సంకేతాలిచ్చాడనే అనుకుంటున్నా. అతను వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడడని నాకనిపిస్తోంది. సన్నీ సర్ ఇప్పటివరకూ ఎవరి దగ్గరా ఆటోగ్రాఫ్ తీసుకోవడం మేం చూడలేదు. అలాంటి దిగ్గజం తన చొక్కాపై ధోని ఆటోగ్రాఫ్ తీసుకోవడం మహి గొప్పతనానికి నిదర్శనం’’
టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్