Virat Kohli: నేను బౌలింగ్‌ చేసుంటేనా..కోహ్లీ సరదా వ్యాఖ్యలు

తాను బౌలింగ్‌ చేసి ఉంటే రాజస్థాన్‌ రాయల్స్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి సరదాగా అన్నాడు.

Updated : 16 May 2023 08:18 IST

బెంగళూరు: తాను బౌలింగ్‌ చేసి ఉంటే రాజస్థాన్‌ రాయల్స్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి సరదాగా అన్నాడు. 172 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ను కేవలం 59 పరుగులకే కుప్పకూల్చిన బెంగళూరు.. ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో సరదాగా గడిపింది. ఈ వీడియోను ఈ జట్టు ఫ్రాంఛైజీ ట్విటర్‌లో పంచుకుంది. ‘‘నేను బౌలింగ్‌ చేసి ఉంటే.. రాజస్థాన్‌ 40కే ఆలౌటయ్యేదేమో’’ అని విరాట్‌ ఈ సందర్భంగా అన్నాడు. ఐపీఎల్‌లో కోహ్లి మీడియం పేస్‌తో నాలుగు వికెట్లు తీశాడు. 2012లో జరిగిన ఓ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు అల్బీ మోర్కెల్‌.. కోహ్లి ఓవర్లో 28 పరుగులు బాదడంతో బెంగళూరు అనూహ్య ఓటమి చవిచూసింది. ఆ తర్వాత విరాట్‌ ఐపీఎల్‌లో ఎప్పుడూ బౌలింగ్‌ చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని