CSK vs GT: ఫైనల్ చేరేదెవరో?
మార్చి 31న గుజరాత్, చెన్నై మ్యాచ్తో ఐపీఎల్- 16 ఆరంభమైంది. ఇప్పుడు మే 23న అదే జట్ల మధ్య పోరుతో ప్లేఆఫ్స్కు తెరలేవనుంది.
నేడే తొలి క్వాలిఫయర్
గుజరాత్తో చెన్నై ఢీ
ఓడిన జట్టుకు మరో ఛాన్స్
రాత్రి 7.30 నుంచి వేదిక చెన్నై
రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్-16లో మరింత వినోదాన్ని అందించే ప్లేఆఫ్స్కు సమయం ఆసన్నమైంది. మంగళవారం తొలి క్వాలిఫయర్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ను నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోన్న టైటాన్స్ రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్లో చెన్నైపై ఆడిన అన్ని మ్యాచ్ల్లోను ఆ జట్టు నెగ్గడం విశేషం. మరోవైపు.. సొంతగడ్డపై ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అని భావిస్తుండడంతో భావోద్వేగ వాతావరణంలో చెన్నై బరిలోకి దిగుతోంది. అతని కోసం టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది సూపర్కింగ్స్. టైటాన్స్ లాగే చెన్నై కూడా బలంగానే ఉంది. మరి సమవుజ్జీల పోరులో గెలిచి ఫైనల్ చేరేదెవరో? ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశముంది.
చెన్నై
మార్చి 31న గుజరాత్, చెన్నై మ్యాచ్తో ఐపీఎల్- 16 ఆరంభమైంది. ఇప్పుడు మే 23న అదే జట్ల మధ్య పోరుతో ప్లేఆఫ్స్కు తెరలేవనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మంగళవారం తొలి క్వాలిఫయర్ పోరాటం హోరాహోరీగా సాగడం ఖాయమని భావిస్తున్నారు. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది కాబట్టి రెండు జట్లు గట్టిగా పోరాడతాయనడంలో సందేహం లేదు. ఫామ్, గణాంకాల పరంగా చూసుకుంటే చెన్నైపై గుజరాత్దే కాస్త పైచేయి. ఇప్పటివరకూ ఐపీఎల్లో చెన్నైతో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ టైటాన్స్ గెలిచింది. నిరుడు రెండు మ్యాచ్ల్లో నెగ్గిన ఆ జట్టు.. ఈ సారి లీగ్ మ్యాచ్లోనూ విజయం సాధించింది. అయితే సొంతగడ్డ చెపాక్లో ఆడుతున్న సీఎస్కేను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం.
ప్లేఆఫ్స్ చేరాయిలా..
అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన జట్టు గుజరాత్ టైటాన్స్. లీగ్ దశలో నిలకడ కొనసాగించి 14 మ్యాచ్ల్లో 10 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 14 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించగా.. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో ఆ జట్టు 17 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తన చివరి మ్యాచ్లో దిల్లీని ఓడించి చెన్నై ప్లేఆఫ్స్ చేరింది. లఖ్నవూ కూడా 17 పాయింట్లతోనే నిలిచినప్పటికీ మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా చెన్నై రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
పటిష్టంగా టైటాన్స్
నిరుడు ఐపీఎల్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఈసారీ అదే జోరు కొనసాగిస్తోంది. బలమైన జట్టుతో, తిరుగులేని ప్రదర్శనతో మైదానంలో టైటాన్స్ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారింది. బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకూ హిట్టింగ్ చేసే ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ ఆ జట్టుకు పెద్ద బలం. అతడు వరుసగా రెండు సెంచరీలు బాదేశాడు. 14 మ్యాచ్ల్లో 680 పరుగులు సాధించాడు. గిల్ క్రీజులో నిలబడితే బౌలర్లకు చుక్కలే. విజయ్ శంకర్ కూడా జోరుమీదున్నాడు. సాహా, హార్దిక్, మిల్లర్, తెవాతియా.. ఇలా అందరూ కీలక ఆటగాళ్లే. బౌలింగ్లోనూ ఆ జట్టుకు తిరుగులేదు. పేస్తో చెలరేగుతున్న షమి, స్పిన్తో చుట్టేస్తున్న రషీద్ ఖాన్.. చెరో 24 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ కూడా వైవిధ్యమైన బౌలింగ్తో చివరి ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా ఆకట్టుకుంటున్నాడు.
తిరుగులేని కింగ్స్
12వ సారి ప్లేఆఫ్స్కు చేరి పదో ఫైనల్పై గురిపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్, కాన్వే కీలకం. మంచి ఫామ్లో ఉన్న ఈ ఇద్దరూ మరోసారి శుభారంభాన్నివ్వాలని చెన్నై కోరుకుంటోంది. 14 మ్యాచ్ల్లో కాన్వే 585 పరుగులు చేయగా.. రుతురాజ్ 504 పరుగులు సాధించాడు. రహానె, శివమ్ దూబె ఆ జట్టు బ్యాటింగ్్ ఆర్డర్కు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. జడేజా ఆల్రౌండర్ పాత్రకు తగిన న్యాయం చేస్తూనే ఉన్నాడు. మరోవైపు ధోని అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. తుషార్ దేశ్పాండే, పతిరన లాంటి యువ పేసర్లతో సీఎస్కే బౌలింగ్లో ఉత్తమ ప్రదర్శన చేస్తోంది. తుషార్ 14 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశాడు. 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టిన పతిరన చివరి ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. దీపక్ చాహర్, మొయిన్ అలీ, తీక్షణ కూడా రాణిస్తున్నారు. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల మధ్య ధోనీని కనీసం మరో రెండు మ్యాచ్ల్లో చూసే అవకాశం అభిమానులకు దక్కింది.
చెపాక్ పిచ్
ఈ సీజన్లో చెపాక్ పిచ్పై చెన్నై ఓ స్పష్టమైన అంచనాకు రాలేకపోతోంది. కొన్ని మ్యాచ్ల్లో నెమ్మదిగా స్పందించిన పిచ్.. మరికొన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్కు అనుకూలించింది. ఈ సారి చెన్నైలో 4 మ్యాచ్లు గెలిచిన సీఎస్కే.. 3 మ్యాచ్లు ఓడింది. మరోవైపు చెపాక్లో గుజరాత్కు ఇదే తొలి మ్యాచ్. మందకొడిగా ఉండే అవకాశమున్న పిచ్ బ్యాటర్లకు సవాలు విసురుతుందని భావిస్తున్నారు. స్పిన్నర్లు సత్తాచాటే ఆస్కారముంది.
3
ఐపీఎల్లో ఇప్పటివరకు చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గుజరాత్ గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత