ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడు

టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పుడైనా.. ఇటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథిగా ధోని మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. తన భావోద్వేగాలను నియంత్రించుకుంటాడు.

Published : 24 May 2023 03:05 IST

దిల్లీ: టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పుడైనా.. ఇటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథిగా ధోని మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. తన భావోద్వేగాలను నియంత్రించుకుంటాడు. కానీ అలాంటి ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడంటా. ఈ విషయాన్ని సీఎస్కే మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ వెల్లడించాడు. ‘‘మీతో ఓ కథను పంచుకోవాలనుకుంటున్నా. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో తిరిగి ఐపీఎల్‌లో చెన్నై పునరాగమనం చేసింది. అప్పుడు ఓ సారి జట్టు విందు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి ధోని ఏడ్చాడు. భావోద్వేగానికి గురయ్యాడు. దీని గురించి ఎవరికీ తెలియదనుకుంటా’’ అని ఓ షో సందర్భంగా చెప్పిన హర్భజన్‌.. పక్కనే ఉన్న ఇమ్రాన్‌ తాహిర్‌ను కూడా ఆ సంఘటన గురించి అడిగాడు. ‘‘అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా. అది ధోనీకి ఎంతో ఉద్విగ్నమైన క్షణం. అప్పుడు ధోనీని చూస్తే సీఎస్కే అతని హృదయానికి ఎంత దగ్గరగా ఉందో అర్థమైంది. ఈ జట్టును అతను కుటుంబంలా చూస్తాడు. ఆ సందర్భంలో అందరం భావోద్వేగానికి గురయ్యాం’’ అని తాహిర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని