ఫైనల్లో డివైన్‌ మెరుపులు

హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్‌- 16కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనుంది.

Published : 27 May 2023 02:45 IST

ముంబయి: హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్‌- 16కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా తొలిసారి ఇన్నింగ్స్‌ విరామంలో ప్రముఖ ర్యాపర్‌ డివైన్‌తో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. డివైన్‌గా పేరుపొందిన వివియన్‌ ఫెర్నాండెజ్‌.. నేపథ్య గాయని జోనితా గాంధీ కలిసి తమ పాట ‘నయా షేర్‌’ను ప్రదర్శించనున్నారు. విరాట్‌ కోహ్లీతో కలిసి ఆర్సీబీ కోసం రూపొందించిన ఈ ‘నయా షేర్‌’ మ్యూజిక్‌ వీడియో యూట్యూబ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని