IPL Final - CSK vs GT: ఓ వరుణా.. రేపు రా!
ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఎన్నడూ చూడని చిత్రం! వర్షం వల్ల తొలిసారి ఐపీఎల్ ఫైనల్ వాయిదా పడింది. 16వ సీజన్ టైటిల్ కోసం చెన్నై సూపర్కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడాల్సి ఉండగా.. భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తడంతో ఫైనల్ను వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్ డే అయిన సోమవారం
వర్షం వల్ల ఐపీఎల్ ఫైనల్ నేటికి వాయిదా
ఈ రోజూ మ్యాచ్కు వాన ముప్పు
ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఎన్నడూ చూడని చిత్రం! వర్షం వల్ల తొలిసారి ఐపీఎల్ ఫైనల్ వాయిదా పడింది. 16వ సీజన్ టైటిల్ కోసం చెన్నై సూపర్కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడాల్సి ఉండగా.. భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తడంతో ఫైనల్ను వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ను నిర్వహించనున్నారు.
అహ్మదాబాద్
శుభ్మన్ ఇంకో సెంచరీ కొట్టేస్తాడా.. షమి, రషీద్, మోహిత్ త్రయం మరోసారి విజృంభిస్తుందా.. గుజరాత్ వరుసగా రెండో ఏడాదీ విజేతగా నిలుస్తుందా..? చెన్నై ఓపెనింగ్ జోడీ జోరు కొనసాగిస్తుందా.. ధోనీని ఆటగాడిగా మైదానంలో చూసే చివరి రోజు ఇదేనా.. చెన్నై అయిదో కప్పు అందుకుంటుందా..? ఇలా ఎన్నెన్నో ఆశలు, అంచనాలతో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు సిద్ధమైన అభిమానులకు తీవ్ర నిరాశ! వేసవిలోనూ భారీ వర్షం అహ్మదాబాద్ను ముంచెత్తడంతో తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా పడింది. మ్యాచ్కు వర్షం ముప్పేమీ లేదని ముందు రోజు వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చినప్పటికీ.. అనుకోని అతిథిలా వచ్చిన వరుణుడు నరేంద్ర మోదీ స్టేడియంలో నీటి మడుగులు పడేలా ప్రతాపం చూపాడు. ఎంతకీ వర్షం విడవకపోవడం, ఫైనల్కు రిజర్వ్ డే ఉండటంతో మ్యాచ్ను అంపైర్లు సోమవారానికి వాయిదా వేశారు. రాత్రి 7.30కి మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. అంతకు గంట ముందే జల్లులు మొదలయ్యాయి. తర్వాత అది జోరు వర్షంగా మారింది. రెండున్నర గంటల పాటు విరామం లేకుండా వర్షం పడటంతో ఆదివారం మ్యాచ్ జరగడం కష్టమే అని అర్థమైంది. 9 గంటల ప్రాంతంలో వర్షం ఆగడంతో స్టేడియంలో ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఆశలు రేకెత్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న సూపర్ సాపర్లు పని మొదలుపెట్టాయి. కానీ పది నిమిషాల విరామం తర్వాత వరుణుడు తిరిగొచ్చాడు. మళ్లీ జోరు వర్షం స్టేడియాన్ని ముంచెత్తింది. అర్ధరాత్రి 12.06కి మైదానం సిద్ధమైతే 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించే అవకాశముండగా.. స్టేడియంలో నీటి మడుగులు ఏర్పడటంతో గంట తర్వాత కూడా ఆట సాధ్యం కాదని తేలడంతో 11 గంటల ప్రాంతంలో మ్యాచ్ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
రద్దయితే గుజరాత్కే ట్రోఫీ: ఆదివారం వర్ష సూచన లేకపోయినా.. మొతెరాను వరుణుడు ముంచెత్తగా, మరుసటి రోజు వర్షం పడేందుకు ఆస్కారం ఉండటం ఆందోళన రేకెత్తించేదే. సోమవారం 5 ఓవర్ల మ్యాచ్కూ పరిస్థితులు సహకరించకుంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అదీ సాధ్యపడక మ్యాచ్ రద్దయితే మాత్రం గుజరాత్ టైటాన్స్నే ఐపీఎల్-16 ట్రోఫీ వరిస్తుంది. ఐపీఎల్ నియమావళి ప్రకారం ఫైనల్ వర్షం వల్ల రద్దయితే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. లీగ్ దశలో 20 పాయింట్లతో గుజరాత్ అగ్రస్థానంలో నిలవగా.. చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానం సాధించింది. గత ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సీఎస్కే 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్ సాధించింది. ఆ జట్టు మరో ట్రోఫీ సాధిస్తే.. అత్యధికసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ను సమం చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ముంగిట లఖ్నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు గుడ్న్యూస్. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. -
IPL 2024: నా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడడు: హార్దిక్ పాండ్య
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి ఐపీఎల్లో ముంబయి జట్టుతో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 17వ సీజన్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. -
Ashwin: స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: అశ్విన్
టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. మొత్తం 26 వికెట్లు తీసి టాపర్గా నిలిచాడు. -
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్పై సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. -
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
-
Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?
-
Nalgonda: ఎన్నికల కోడ్.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
-
BJP: జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్లోకి వెళ్లారు?: రఘునందన్రావు