MS Dhoni: మహి మార్కు.. వారిని ఆడించి.. చెన్నైని ఛాంపియన్గా నిలిపి..
2018 ఐపీఎల్లో ఎక్కువగా వయసు మళ్లిన ఆటగాళ్లతో నిండిన చెన్నై జట్టును చూసి ‘డాడీస్ ఆర్మీ’ అంటూ ఎద్దేవా చేశారు జనాలు. చివరికి చూస్తే విజేత ఆ జట్టే.
2018 ఐపీఎల్లో ఎక్కువగా వయసు మళ్లిన ఆటగాళ్లతో నిండిన చెన్నై జట్టును చూసి ‘డాడీస్ ఆర్మీ’ అంటూ ఎద్దేవా చేశారు జనాలు. చివరికి చూస్తే విజేత ఆ జట్టే. 2020లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్లో చెన్నై పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశను కింది నుంచి రెండో స్థానంతో ముగించింది. తర్వాతి ఏడాది ఆ జట్టుపై ఏమాత్రం అంచనాల్లేవు. చివరికి చూస్తే ఛాంపియన్ చెన్నై. ఇదంతా ధోని నాయకత్వ మహిమ అనడంలో సందేహం లేదు. ఈసారి కాగితం మీద చూస్తే సీఎస్కే జట్టు అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. అయినా ఫైనల్ వరకు వచ్చిందన్నా అందులో ధోని పాత్ర కీలకం. ఇక మళ్లీ ఐపీఎల్లో కనిపించడనుకున్న రహానెని ధోని చెన్నై జట్టులోకి తీసుకుని స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పిస్తే.. అతను కొన్ని మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాలందించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపని శివమ్ దూబె సైతం ఈసారి తనదైన ముద్ర వేశాడంటే అందులో ధోని పాత్ర కీలకం. మలింగను పోలిన బౌలింగ్ శైలిని కలిగిన పతిరనను సైతం మహి భలేగా ఉపయోగించుకున్నాడు. ప్రధాన బౌలింగ్ అస్త్రంగా మార్చాడు.
వేరే జట్లలో పెద్దగా ప్రభావం చూపని ఆటగాళ్లను ఇలా ప్రమాదకర ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం ధోనీకే చెల్లు. చెన్నై జట్టంటేనే సమష్టితత్వానికి పెట్టింది పేరు. ఆటగాళ్లు స్వేచ్ఛగా, సహజ శైలిలో చెలరేగడానికి అవకాశం ఉంటుంది. ఆ జట్టులో అలాంటి వాతావరణం నెలకొనేలా చేయడంలో మహి పాత్ర కీలకం. నిజానికి ఫైనల్ మ్యాచ్లో ఒక దశ వరకు ధోనీకి ఏదీ కలిసి రాలేదు. ఐపీఎల్ తుది సమరాల్లో ఎక్కువగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచినప్పటికీ.. వర్షం ముప్పును దృష్టిలో ఉంచుకుని ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ గుజరాత్ పరిస్థితులను ఉపయోగించుకుని భారీ స్కోరు కొట్టింది. ఫైనల్లో 215 పరుగుల ఛేదన అంటే ఇక చెన్నై ఆశలు వదులుకోవాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ధోని ఊహించిందే నిజమైంది. వర్షం కారణంగా రెండున్నర గంటలకుపైగా మ్యాచ్ ఆగిపోవడంతో చెన్నై ముందు 171 పరుగుల లక్ష్యం (15 ఓవర్లలో) నిలిచింది. విరామ సమయంలో పక్కా ప్రణాళికతో సిద్ధమైంది సీఎస్కే. ఓపెనర్లు బరిలోకి దిగగానే టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో చెన్నై లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అద్భుత విజయంతో అయిదో ట్రోఫీని ఒడిసిపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.