WTC Final - IPL: ఐపీఎల్లో ఆ బంతులతోనే ప్రాక్టీస్ చేశాం
ఐపీఎల్లో రెండు నెలల పాటు తెల్ల బంతులతో ఆడి ఇప్పుడు ఆస్ట్రేలియాతో జూన్ 7న ఓవల్లో ఆరంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఎర్ర బంతులతో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్.
పోర్ట్స్మౌత్: ఐపీఎల్లో రెండు నెలల పాటు తెల్ల బంతులతో ఆడి ఇప్పుడు ఆస్ట్రేలియాతో జూన్ 7న ఓవల్లో ఆరంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఎర్ర బంతులతో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఐపీఎల్ సమయంలో డ్యూక్స్ బంతులు (ఎరుపు రంగు) ఉపయోగించి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు అతడు వెల్లడించాడు. ‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి ఐపీఎల్ ఆరంభానికి ముందే తెలుసు. ఎంత సమయం ఉందో అవగాహన ఉంది. అందుకే డ్యూక్స్ బంతులతోనే సాధన చేశాం. ఇప్పుడు తెల్ల బంతి నుంచి ఎరుపు బంతికి మారడం పెద్ద కష్టమేమీ కాదు’’ అని అన్నాడు.
ఐర్లాండ్ 172 ఆలౌట్
లార్డ్స్: ఐర్లాండ్తో ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిరోజే పట్టు బిగించింది. స్టువర్ట్ బ్రాడ్ (5/51) విజృంభించడంతో గురువారం మొదటి ఇన్నింగ్స్లో ఐర్లాండ్ను 172కే ఆలౌట్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో ఆట చివరికి 152/1తో నిలిచింది. డకెట్ (60), పోప్ (29) క్రీజులో ఉన్నారు. క్రాలీ (56) ఔటయ్యాడు. క్రాలీ-డకెట్ జోడీ తొలి వికెట్కు 109 పరుగులు జత చేసి శుభారంభం ఇచ్చింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్.. బ్రాడ్ ధాటికి నిలువలేకపోయింది. అతడితో పాటు లీచ్ (3/35), పాట్స్ (2/36) రాణించడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఐర్లాండ్.. తక్కువ స్కోరుకే ఆలౌటైంది. మెక్కలమ్ (36), కాంఫర్ (33), స్టిర్లింగ్ (30) పోరాడకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే