రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్ల ప్రాక్టీస్
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు టీమ్ఇండియా అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది.
పోర్ట్స్మత్ (ఇంగ్లాండ్): ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు టీమ్ఇండియా అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. ఓవల్లో బుధవారం ఆరంభమయ్యే ఈ పోరు కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ చేరిన భారత్.. అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఫీల్డింగ్పైన దృష్టి పెట్టిన రోహిత్ సేన.. రంగు రంగుల రబ్బరు బంతులతో క్యాచ్ ప్రాక్టీస్ చేస్తోంది. మ్యాచ్లో చివరి నిమిషాల్లో బంతి గమనంలో మార్పునకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవడం కోసం టీమ్ఇండియా ఈ కసరత్తులు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ ఆకుపచ్చ బంతితో క్యాచ్ ప్రాక్టీస్ చేశాడు. అలాగే పసుపు పచ్చ బంతులూ ఉన్నాయి. ‘‘ఫీల్డింగ్ కసరత్తుల కోసమే ఈ రంగు రంగుల రబ్బరు బంతులను ప్రత్యేకంగా తయారు చేశారు. ఇవి గల్లీ క్రికెట్లో కనిపించే బంతులు కావు. వీటిని ‘రియాక్షన్ బాల్స్’ అంటారు. ఎక్కువ గాలి, చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్లో వీటిని ఎక్కువగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్లిప్ ఫీల్డర్లు, వికెట్ కీపర్ల క్యాచ్ ప్రాక్టీస్కు వాడతారు. తేమ, మైదానంలో వలయం బయట ఎక్కువ పచ్చిక ఉండడంతో ఇంగ్లాండ్లో బంతికి అస్థిర చలనం అధికంగా ఉంటుంది. బ్యాటర్లకు ఔట్సైడ్ ఎడ్జ్ అయ్యే బంతులు ఎక్కువగా కదులుతూ ఉంటాయి. ఈ రబ్బరు బంతులు తేలిగ్గా ఉండడంతో అస్థిర చలనంతో పాటు స్వింగ్ కూడా లభిస్తుంది. వీటి ద్వారా క్యాచ్ అందుకునే చివరి నిమిషంలో గమనం మారే బంతిని పట్టుకునేందుకు ప్రాక్టీస్ దొరుకుతుంది’’ అని జాతీయ క్రికెట్ అకాడమీలో పని చేసిన ఓ ప్రముఖ ఫీల్డింగ్ కోచ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు