డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హేజిల్‌వుడ్‌ దూరం

భారత్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ముంగిట ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ. పక్కటెముకల గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ జట్టు సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ హేజిల్‌వుడ్‌.. ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Published : 05 Jun 2023 02:41 IST

లండన్‌: భారత్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ముంగిట ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ. పక్కటెముకల గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ జట్టు సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ హేజిల్‌వుడ్‌.. ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆసీస్‌.. మైకేల్‌ నీసర్‌ను జట్టులోకి తీసుకుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో హేజిల్‌వుడ్‌ గాయపడ్డాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున మూడు మ్యాచ్‌లే ఆడిన అతడు.. ఆ తర్వాత గాయంతో స్వదేశం వెళ్లిపోయాడు. హేజిల్‌వుడ్‌ గైర్హాజరీలో.. స్కాట్‌ బోలాండ్‌ అతడి స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది. కమిన్స్‌, స్టార్క్‌తో కలిసి అతడు పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని