మలేసియాపై భారత్ గెలుపు
మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు కొనసాగుతోంది. సోమవారం పూల్-ఎ పోరులో భారత్ 2-1తో మలేసియాపై విజయం సాధించింది. ఆట ప్రారంభమైన ఆరో నిమిషంలోనే డయాన్ నజెరి గోల్ చేసి మలేసియా ఖాతా తెరిచింది.
మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ
కకమిగార (జపాన్): మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు కొనసాగుతోంది. సోమవారం పూల్-ఎ పోరులో భారత్ 2-1తో మలేసియాపై విజయం సాధించింది. ఆట ప్రారంభమైన ఆరో నిమిషంలోనే డయాన్ నజెరి గోల్ చేసి మలేసియా ఖాతా తెరిచింది. అయితే పదో నిమిషంలో భారత క్రీడాకారిణి ముంతాజ్ ఖాన్ గోల్ సాధించి స్కోరును సమం చేసింది. 26వ నిమిషంలో దీపిక గోల్తో భారత్ 2-1తో ఆధిక్యం సంపాదించింది. వరుసగా రెండో విజయంతో భారత్.. పూల్-ఎలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో భారత్ 22-0తో ఉజ్బెకిస్తాన్పై ఘన విజయం అందుకుంది. మంగళవారం కొరియాతో భారత్ తలపడుతుంది.
హారిక పరాజయం
సెయింట్ లూయిస్: కెయిన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో తొలి రౌండ్లో గెలిచిన భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికకు రెండో రౌండ్లో చుక్కెదురైంది. అలెగ్జాండర్ కొస్తెనిక్ (స్విట్జర్లాండ్) చేతిలో ఈ తెలుగమ్మాయి పరాజయం చవిచూసింది. మరోవైపు తొలి రౌండ్లో ఓడిన కోనేరు హంపి.. రెండో రౌండ్లో ఇరినా క్రస్ (అమెరికా)తో డ్రా చేసుకుంది. ప్రస్తుతం హారిక (1 పాయింట్) అయిదు, హంపి (0.5) ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
స్పెషల్ ఒలింపిక్స్కు 255 మంది
దిల్లీ: స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ క్రీడలకు భారత్ నుంచి 255 మంది బృందం వెళ్లనుంది. ఈనెల 17 నుంచి 25 వరకు జర్మనీలోని బెర్లిన్లో జరుగనున్న ఈ పోటీల్లో 16 క్రీడాంశాల్లో 198 మంది భారత క్రీడాకారులు, వారి సహాయకులు బరిలో దిగుతారు. 57 మంది కోచ్లు భారత బృందంలో ఉన్నారు. మానసిక వికలాంగులకు నిర్వహించే ఈ మెగా టోర్నీలో 190 దేశాల నుంచి 26 క్రీడాంశాల్లో 7000 మంది క్రీడాకారులు, వారి సహాయకులు పాల్గొంటున్నారు.
వయసు మోసాల అడ్డుకట్టకు బాయ్ పథకం
ముంబయి: వయో సంబంధిత మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కొత్త పథకాన్ని ప్రారంభించింది. పుట్టిన రోజు తేదీలో తప్పులు.. వయసు వ్యత్యాసాల్ని సరిదిద్దుకోవడం కోసం స్వచ్ఛంద వయసు దిద్దుబాటు పథకం (వీఏఆర్ఎస్) మొదలుపెట్టింది. బాయ్ గుర్తింపు కార్డులున్న క్రీడాకారులు 20 రోజుల్లోపు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. నిర్దేశిత గడువు తర్వాత దోషులుగా తేలిన వాళ్లపై నిషేధంతో సహా కఠినమైన చర్యలు ఉంటాయని బాయ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు