WTC Final: ఆ ఇద్దరు ఎవరు?
భారత్కు తుది జట్టు ఎంపిక కొంచెం తలనొప్పిగానే మారింది. రెండు స్థానాల కోసం నలుగురు పోటీలో ఉన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎస్ భరత్ వైపే మొగ్గు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్ అవకాశాలను కొట్టి పారేయలేం! వికెట్ కీపింగ్ నైపుణ్యంలో భరత్ది పైచేయి కాగా.. బ్యాటింగ్లో ఇషాన్కు ఎక్కువ మార్కులు పడతాయి.
భారత్కు తుది జట్టు ఎంపిక కొంచెం తలనొప్పిగానే మారింది. రెండు స్థానాల కోసం నలుగురు పోటీలో ఉన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎస్ భరత్ వైపే మొగ్గు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్ అవకాశాలను కొట్టి పారేయలేం! వికెట్ కీపింగ్ నైపుణ్యంలో భరత్ది పైచేయి కాగా.. బ్యాటింగ్లో ఇషాన్కు ఎక్కువ మార్కులు పడతాయి. స్వింగ్ పరిస్థితుల్లో అనుభవం లేని ఇషాన్ బ్యాటింగ్లో రాణిస్తాడన్న ఆశలు తక్కువే కాబట్టి భరత్కే తుది జట్టులో చోటు దక్కొచ్చని అంచనా. ఇక ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగాలా.. లేక ఒక స్పిన్నర్ను తగ్గించుకుని నాలుగో పేసర్ను ఎంచుకోవాలా అనే విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో నాలుగో పేసర్ను ఆడించడమే మేలు. కానీ ఓవల్ పిచ్ స్పిన్నర్లకూ కూడా సహకరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో జడేజాకు తోడుగా అశ్విన్ను ఆడించే అవకాశాన్ని పరిశీలిస్తోంది టీమ్ఇండియా. లేదంటే షమి, సిరాజ్, ఉమేశ్లకు తోడుగా శార్దూల్ను దించొచ్చు.
పిచ్.. స్పిన్నర్లకూ!
ఇంగ్లాండ్లో టెస్టు మ్యాచ్ అంటే ప్రధానంగా పేసర్లదే ఆధిపత్యం. కానీ ఆ దేశంలో స్పిన్కు ఎక్కువ సహకారం అందించే మైదానాల్లో ఓవల్ ఒకటి. ఇక్కడ జరిగిన చివరి 10 టెస్టుల్లో పేసర్లతో పోలిస్తే స్పిన్నర్ల సగటే మెరుగ్గా ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ స్పిన్కు సహకారం ఉంటుంది. అయితే ఆధిపత్యం పేసర్లదే కావచ్చని తెలుస్తోంది. పిచ్పై మంచి బౌన్స్ ఉన్నట్లు క్యురేటర్ తెలిపాడు. ఉదయం పేసర్లను ఎదుర్కోవడం కష్టమే. ఆ సవాలును కాచుకుంటే.. తర్వాత పరుగులు చేయొచ్చు. మబ్బులు పట్టిన సమయంలో బ్యాటింగ్ మరింత కష్టంగా మారొచ్చు.
రోహిత్కు చిన్న గాయం
ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్శర్మ వేలి గాయం టీమ్ఇండియాను కాస్త కంగారు పెట్టింది. మంగళవారం సహచరులు అశ్విన్, ఉమేశ్, భరత్లతో కలిసి రోహిత్ ఐచ్ఛిక సాధనలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఓ బంతి అతడి ఎడమ చేతి బొటన వేలికి తాకడంతో ఇబ్బంది పడ్డాడు. గాయం ప్రమాదకరమేమీ కాదని.. మ్యాచ్కు రోహిత్ అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.
వర్షం ముప్పుంది..
ఇంగ్లాండ్లో ఏడాది పొడవునా వరుణుడు పలకరిస్తూనే ఉంటాడు. గత పర్యాయం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కూ వర్షం బెడద తప్పలేదు. ఆ మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్లింది. ఇప్పుడు కూడా డబ్ల్యూటీసీ తుది పోరుకు వరుణుడు అడ్డుపడే సూచనలున్నాయి. కాకపోతే తొలి మూడు రోజుల్లో ఆటకు వర్షం ముప్పు ఉండదని అంచనా. చివరి రెండు రోజుల్లో మాత్రం వాతావరణం మబ్బులు పట్టి ఉంటుంది. వర్షం కూడా పడొచ్చు. అయిదు రోజుల ఆటలో చెప్పుకోదగ్గ స్థాయికి ఆటకు నష్టం వాటిల్లి, మ్యాచ్లో ఫలితం తేలకపోతే రిజర్వ్ డేని ఉపయోగించుకుంటారు. ఆ రోజూ ఫలితం రాకపోతే రెండు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న