సెమీస్లో జకోవిచ్
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నిలిచే దిశగా మరో అడుగు ముందుకేశాడు.
సబలెంక, ముచోవా కూడా
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నిలిచే దిశగా మరో అడుగు ముందుకేశాడు.
కచనోవ్ను మట్టికరిపిస్తూ అతను ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్లో సబలెంక, ముచోవా తుది నాలుగులో చోటు సంపాదించారు.
టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో అతడు 4-6, 7-6 (7-0), 6-2, 6-4తో 11వ సీడ్ కచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 23వ గ్రాండ్స్లామ్ టైటిల్పై కన్నేసిన జకోవిచ్ అనూహ్యంగా తొలి సెట్ను కోల్పోయాడు. ఈ టోర్నీలో అతడు సెట్ను చేజార్చుకోవడం ఇదే మొదటిసారి. కానీ మూడో సీడ్ జకోవిచ్ ఆ తర్వాత బలంగా పుంజుకున్నాడు. రెండో సెట్ హోరాహోరీగా సాగింది. ఆటగాళ్లిద్దరూ సర్వీసులు నిలబెట్టుకుంటూ సాగడంతో సెట్ టైబ్రేక్కు దారితీసింది. అక్కడ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ సెట్ను చేజిక్కించుకున్న జకో.. అదే జోరు కొనసాగిస్తూ మూడో సెట్ను అలవోకగా చేజిక్కించుకున్నాడు. నాలుగో సెట్లోనూ అదరగొట్టాడు. మూడో గేమ్లోనే బ్రేక్ సాధించి విజయం దిశగా సాగాడు. కానీ కీలకమైన ఎనిమిదో గేమ్లో బ్రేక్ సాధించి, స్కోరును 4-4తో సమం చేయడం ద్వారా మ్యాచ్ను కచనోవ్ ఆసక్తికరంగా మార్చాడు. కానీ తర్వాతి గేమ్లోనే బ్రేక్ సాధించిన జకోవిచ్.. ఆ వెంటనే సర్వీసును నిలబెట్టుకుని సెట్ను, మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్లో 11 ఏస్లు సంధించిన జకోవిచ్.. 57 విన్నర్లు కొట్టాడు. నాలుగు బ్రేక్లు సాధించాడు. అతడు ప్రస్తుతం 22 గ్రాండ్స్లామ్ టైటిళ్లతో నాదల్తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ నంబర్వన్ అల్కరాస్ (స్పెయిన్), అయిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) మధ్య క్వార్టర్స్ విజేతతో జకోవిచ్ సెమీఫైనల్లో తలపడతాడు.
సబలెంక ముందుకు: మహిళల సింగిల్స్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్), అన్సీడెడ్ ముచోవా (చెక్) సెమీఫైనల్కు దూసుకెళ్లారు. క్వార్టర్ఫైనల్లో సబలెంక 6-4, 6-4తో స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 30 విన్నర్లు కొట్టిన సబలెంక.. 9 బ్రేక్ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. రొలాండ్ గారోస్లో సెమీస్ చేరడం సబలెంకకు ఇదే తొలిసారి. ఫైనల్లో చోటు కోసం ఆమె ముచోవాతో తలపడుతుంది. క్వార్టర్ఫైనల్లో ముచోవా 7-5, 6-2తో మాజీ రన్నరప్ పవ్లిచెంకోవాను ఓడించింది. ముచోవాకు కూడా ఇక్కడ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. మ్యాచ్లో ముచోవా 21 విన్నర్లు కొట్టింది. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. 29 అనవసర తప్పిదాలు, 5 డబుల్ ఫాల్ట్లతో పవ్లించెంకోవా మూల్యం చెల్లించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..