సింధు నిష్క్రమణ.. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ సూపర్‌ 750 టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.

Published : 07 Jun 2023 03:23 IST

సింగపూర్‌: భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ సూపర్‌ 750 టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరో స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌ చేరాడు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 21-18, 19-21, 17-21తో ప్రపంచ నంబర్‌వన్‌ అకానె యమగూచి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది. సైనా నెహ్వాల్‌ 13-21, 15-21తో రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో శ్రీకాంత్‌ 21-15, 21-19తో కాంటాఫాన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించగా.. ప్రణయ్‌ 15-21, 19-21తో నరవొక చేతిలో, లక్ష్యసేన్‌ 21-18, 17-21, 13-21తో చౌ తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రియాంషు రజావత్‌ 21-12, 21-15తో సునెయామా (జపాన్‌)పై నెగ్గి ముందంజ వేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని