WTC Final: ఓవల్లో అద్భుతం జరగాలి
263 ఓవల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఇది! ఎప్పుడో 1902లో ఇంగ్లాండ్ నెలకొల్పిందీ రికార్డు. 121 ఏళ్లుగా అది చెక్కు చెదరలేదంటే అక్కడ ఛేదన ఎంత కష్టమో అర్థమవుతోంది! మరి ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏకంగా 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కంగారూ జట్టు.
ఆశతో ఆఖరి రోజుకు భారత్
444 పరుగుల ఛేదనలో 164/3
పోరాడుతున్న కోహ్లి, రహానె
ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్
263 ఓవల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఇది! ఎప్పుడో 1902లో ఇంగ్లాండ్ నెలకొల్పిందీ రికార్డు. 121 ఏళ్లుగా అది చెక్కు చెదరలేదంటే అక్కడ ఛేదన ఎంత కష్టమో అర్థమవుతోంది! మరి ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏకంగా 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కంగారూ జట్టు. పదునైన పేస్ అస్త్రాలతో పాటు నాణ్యమైన స్పిన్నరూ ఆ జట్టుకు ఉన్నాడు. పైగా తొలి ఇన్నింగ్స్లో తడబడ్డ టీమ్ఇండియా.. కొండంత ఛేదనలో త్వరత్వరగా మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇలా రోహిత్ బృందానికి ప్రతికూలతలెన్నో! .. అయినా డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరం. కోహ్లి, రహానెల పోరాటంతో ఆఖరి రోజు పోరాటానికి సిద్ధమైంది మన జట్టు. లక్ష్యం ఇప్పటికీ కష్టమే! చేతిలో ఏడు వికెట్లున్న భారత్ నెగ్గాలంటే ఆదివారం 280 పరుగులు చేయాలి. కానీ కోహ్లి సాధికారికంగా ఆడుతున్న తీరు, గాయం బాధపెడుతున్నా రహానె నిలబడ్డ తీరు సగటు అభిమానిని ఆశతో అయిదో రోజుకు తీసుకెళ్తున్నాయి. మరి టీమ్ ఇండియా అద్భుతం చేస్తుందా?
లండన్:
పరిస్థితులు ఇప్పటికీ ప్రతికూలంగానే ఉన్నా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్సేన ఇంకా ఆశలు వదులుకోలేదు. ఆస్ట్రేలియానే ఫేవరెట్గా కనిపిస్తున్నా.. కోహ్లి (44 బ్యాటింగ్; 60 బంతుల్లో 7×4), రహానె (20 బ్యాటింగ్; 59 బంతుల్లో 3×4)ల పోరాటంతో భారత్ ఓ చిన్న ఆశతో ఆఖరి రోజు ఆటకు సిద్ధమైంది. 444 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యంతో నాలుగో రోజు, శనివారం బరిలోకి దిగిన టీమ్ఇండియా.. ఆట ఆఖరుకు 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అంతకుముందు కేరీ (66 నాటౌట్; 105 బంతుల్లో 8×4) రాణించడంతో ఆస్ట్రేలియా 270/8 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆఖరి రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. కోహ్లి, రహానె ఎంత సేపు నిలబడతారన్నది భారత్కు కీలకం.
వాళ్లిద్దరు పోరాడుతున్నారు: కొండంత లక్ష్యం. మ్యాచ్లో చాలా ఆటే మిగిలి ఉంది. రక్షణాత్మక ఆటతో డ్రా చేసుకోవడం కష్టమైన విషయమే. ఈ నేపథ్యంలో ఫలితం కోసం ప్రయత్నించాలంటే భారత్కు ఓ బలమైన ఆరంభం అవసరం. కానీ అది దక్కలేదు. నిజానికి ఓపెనర్లు రోహిత్ శర్మ (43; 60 బంతుల్లో 7×4, 1×6) గిల్ (18; 19 బంతుల్లో 2×4) ధీమాగానే ఇన్నింగ్స్ను మొదలెట్టారు. ఆసీస్ పేసర్లు కమిన్స్, బోలాండ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా సమర్థంగానే ఎదుర్కొన్నారు. క్రీజులో సౌకర్యంగా కనిపించారు. కమిన్స్ బౌలింగ్లో పుల్ షాట్తో బౌండరీ సాధించిన రోహిత్.. అతడి తర్వాతి ఓవర్లోనే మిడాన్లో ఫోర్ కొట్టాడు. స్టార్క్ బౌలింగ్లో ఫైన్ లెగ్లో సిక్స్తో అభిమానులను అలరించాడు. కానీ టీకి ముందు చివరి ఓవర్లో భారత్కు బోలాండ్ షాకిచ్చాడు. కాస్త ఎక్స్ట్రా బౌన్సయిన బంతిని ఆడబోయిన గిల్.. గల్లీలో గ్రీన్ డైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్కు నిష్క్రమించాడు. రోహిత్ శర్మ చక్కని బ్యాటింగ్ను కొనసాగించడం, పుజారా (27) కూడా దూకుడు ప్రదర్శించడంతో టీ తర్వాత భారత్ ఓ దశలో 92/1తో సాఫీగా సాగింది. కానీ వరుస ఓవర్లలో రోహిత్ను లైయన్, పుజారాను కమిన్స్ ఔట్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ ఇక తలవంచినట్లేనా అన్న అనుమానాలు కలిగాయి. కానీ కోహ్లి, రహానె.. ఆశలు కోల్పోనివ్వలేదు. దాదాపు 20 ఓవర్లు పోరాడిన ఈ జంట కంగారూలు మరీ సంబరపడకుండా చూశారు. ఆఖరి రోజును ఆసక్తికరంగా మార్చేశారు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన కోహ్లి చక్కని షాట్లతో అలరిస్తూ వేగంగానే పరుగులు రాబట్టాడు. ఆసీస్ పేస్ను సమర్థంగా ఎదుర్కొంటూ చూడముచ్చటైన ఫ్లిక్లు, డ్రైవ్లతో అలరించాడు. ఇక వేలికి గాయమైనా రహానె ఆడిన తీరు ఆకట్టుకుంది. అతడు కూడా ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. రహానె-కోహ్లి జంట అభేద్యమైన నాలుగో వికెట్కు 71 పరుగులు జోడించింది.
కేరీ మళ్లీ..: 296. మూడో రోజు ఆట ఆఖరుకు కంగారూల ఆధిక్యమిది. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసినా, ఆసీస్ను రెండో ఇన్నింగ్స్లో (మూడో రోజు చివరికి) 123/4కే పరిమితం చేసినా వెనుకంజలోనే టీమ్ఇండియా. ఓటమి ముప్పు స్పష్టం. ఆస్ట్రేలియాదే స్పష్టమైన ఆధిపత్యం. అయినా కాస్త ఆశావహ దృక్పథంతోనే నాలుగో రోజు ఆటను మొదలెట్టింది రోహిత్సేన. ప్రత్యర్థిని రెండొందలకు కాస్త అటు ఇటుగా ఆలౌట్ చేసి ఉంటే చాలా సంతృప్తి చెందేదే. కానీ అలా జరగలేదు. కోరుకున్నట్లుగా కంగారూలను భారత్ కట్టడి చేయలేకపోయింది. ఆసీస్ ఓవర్నైట్ స్కోరుకు కేవలం ఒక్క పరుగు చేరగానే లబుషేన్ను, కాసేపటికి గ్రీన్ (25)ను ఔట్ చేసి ఆశలు రేపినా.. కేరీకి కళ్లెం వేయడంలో విఫలం కావడంతో కొండంత లక్ష్యం టీమ్ఇండియా ముందు నిలిచింది. స్టార్క్ (41; 57 బంతుల్లో 7×4)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించిన కేరీ.. భారత్ను దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్లో విలువైన పరుగులు చేసిన అతడు.. మరోసారి కీలక ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా తిరుగులేని స్థితిలో నిలవడానికి కారణమయ్యాడు. కేరీ నిలవకపోయుంటే ఆ జట్టు ఇన్నింగ్స్లో భారత్ కనీసం 50-60 పరుగులైనా తగ్గించగలిగేది. సవాలు విసురుతున్న పిచ్పై ఎంతో సంయమనాన్ని ప్రదర్శించిన కేరీ.. జడేజాను సమర్థంగా ఎదుర్కొన్నాడు. గ్రీన్తో ఆరో వికెట్కు 43 పరుగులు జోడించిన కేరీ.. ఆ తర్వాత స్టార్క్తో ఏడో వికెట్కు 93 (120 బంతుల్లో) పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మూడో రోజు భారత బౌలర్ల శ్రమకు తగిన ఫలితం దక్కకుండా చేశాడు. టీమ్ఇండియాకు చిన్న అవకాశమైనా లేదని భావించాక ఆసీస్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
జడేజా రికార్డు
రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. బిషన్ సింగ్ బేడీని అధిగమించి అత్యంత విజయవంతమైన భారత ఎడమచేతి వాటం స్పిన్నర్గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజు ఆటలో స్మిత్, ట్రావిస్ హెడ్లను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. జడేజా తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ సహా ఈ మ్యాచ్లో మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 268 వికెట్లు ఉన్నాయి. బేడీ 67 టెస్టుల్లో 266 వికెట్లు చేజిక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖవాజా (సి) భరత్ (బి) ఉమేశ్ 13; వార్నర్ (సి) భరత్ (బి) సిరాజ్ 1; లబుషేన్ (సి) పుజారా (బి) ఉమేశ్ 41; స్మిత్ (సి) శార్దూల్ (బి) జడేజా 34; హెడ్ (సి) అండ్ (బి) జడేజా 18; గ్రీన్ (బి) జడేజా 25; అలెక్స్ కేరీ నాటౌట్ 66; స్టార్క్ (సి) కోహ్లి (బి) షమి 41; కమిన్స్ (సి) అక్షర్ (బి) షమి 5; ఎక్స్ట్రాలు 26 మొత్తం: (84.3 ఓవర్లలో) 270/8 డిక్లేర్డ్; వికెట్ల పతనం: 1-2, 2-24, 3-86, 4-111, 5-124, 6-167, 7-260, 8-270; బౌలింగ్: షమి 16.3-6-39-2; సిరాజ్ 20-2-80-1; శార్దూల్ 8-1-21-0; ఉమేశ్ యాదవ్ 17-1-54-2; జడేజా 23-4-58-3
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీ (బి) లైయన్ 43; గిల్ (సి) గ్రీన్ (బి) బోలాండ్ 18; పుజారా (సి) కేరీ (బి) కమిన్స్ 27; కోహ్లి బ్యాటింగ్ 44; రహానె బ్యాటింగ్ 20; ఎక్స్ట్రాలు 12; మొత్తం: (40 ఓవర్లలో 3 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-41, 2-92, 3-93; బౌలింగ్: కమిన్స్ 9-0-42-1; బోలాండ్ 11-1-38-1; స్టార్క్ 7-0-45-0; గ్రీన్ 2-0-6-0; లైయన్ 11-1-32-1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్