Cricket World Cup: ముస్తాబవుతోన్న ఉప్పల్ స్టేడియం
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముస్తాబవుతోంది.
క్రికెట్ ప్రపంచకప్ మరో 13 రోజుల్లో
ఈనాడు, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ స్టేడియంలో రెండు వార్మప్, మూడు అసలైన మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) స్టేడియంలో పైకప్పు, కొత్త కుర్చీలు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దక్షిణం వైపు గతంలో భారీ వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో ఇప్పుడు కొత్తదాన్ని బిగించారు. తూర్పు దిశగా పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త ఎల్ఈడీ ఫ్లడ్లైట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 29న ఉప్పల్లో జరగాల్సిన న్యూజిలాండ్, పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించే సూచనలు కనిపించడం లేదు. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకల నేపథ్యలో ఈ మ్యాచ్కు భద్రత కల్పించడం సాధ్యం కాదని హెచ్సీఏకు రాచకొండ పోలీసులు సమాచారమిచ్చారు. ‘‘39 వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ వరకు 10 నుంచి 12 వేల వరకు కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తాం. ఈ టోర్నీ తర్వాత మొత్తం మార్చేస్తాం. దక్షిణం వైపు పైకప్పు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తూర్పు వైపు పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పశ్చిమ వైపు పైకప్పు ఇప్పుడు పెట్టలేకపోతున్నాం. ప్రపంచకప్ పూర్తయ్యాక దీన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మొదటి వార్మప్ మ్యాచ్కు భద్రత గురించి ఇంకా చర్చ జరుగుతోంది. బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని హెచ్సీఏ సీఈవో సునీల్ పేర్కొన్నారు.
కప్పు సందడి: ప్రపంచకప్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో గురువారం ట్రోఫీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీకి సహాయకుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్కు ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. డ్రైనేజీ వ్యవస్థనూ మెరుగుపరిచాం. అలాగే జట్లకు జింఖానా మైదానంలోనూ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 29న జరిగే వార్మప్ మ్యాచ్కు భద్రత గురించి పోలీసులతో బీసీసీఐ బృందం చర్చిస్తోంది’’ అని చెప్పారు. ఉప్పల్లో పాక్- కివీస్ (ఈ నెల 29), ఆస్ట్రేలియా- పాక్ (అక్టోబర్ 3) వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. ప్రధాన మ్యాచ్లు నెదర్లాండ్స్- పాక్ (అక్టోబర్ 6), నెదర్లాండ్స్- న్యూజిలాండ్ (అక్టోబర్ 9), పాక్- శ్రీలంక (అక్టోబర్ 10) మధ్య నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్
భారత జట్టులో (Team India) ఓపెనర్లకు కొదవేం లేదు. అయితే, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరం. టీ20 వరల్డ్కప్లో రోహిత్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. దీంతో అతడికి జోడీగా ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఇద్దరికి దక్షిణాఫ్రికాతో సిరీస్ అత్యంత కీలకం కానుంది. -
Lionel Messi: టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా మెస్సీ
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టైమ్ పత్రిక అతడిని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్గా ప్రకటించింది. -
Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్
వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2024) భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ నాయకత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెప్టెన్సీని ధోనీతో పోలుస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
T20 WC 2024: టీ20 ప్రపంచకప్లో రోహితే సారథి!
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. -
INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్
భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. -
Pro Kabaddi League: విజృంభించిన సోను
రైడర్ సోను జగ్లాన్ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. -
junior hockey wc: అర్జీత్ హ్యాట్రిక్
జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు అదిరే ఆరంభం. అర్జీత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో మంగళవారం పూల్-సి మ్యాచ్లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. -
భారత్కు మూడు స్వర్ణాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాయల్, నిషా, ఆకాన్ష పసిడి పతకాలతో మెరిశారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్ (తజికిస్థాన్)ను చిత్తుగా చేయగా..70 కేజీల తుదిపోరులో ఆకాన్ష అంతే తేడాతో తైమజోవా (రష్యా)ను ఓడించింది. -
Sourav Ganguly: కోహ్లీని నేను తప్పించలేదు
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమణ
విజయ్ హజారె ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ నుంచి హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమించాయి. పేలవ ప్రదర్శనతో గ్రూపు దశను దాటలేకపోయాయి. ఏడు మ్యాచ్ల్లో నాల్గింట్లో గెలిచి.. మూడింట్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో గ్రూపు-బి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. -
Sports News: ఆ ఒక్క అథ్లెట్ డోపీనే
ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్ మీట్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు. -
IPL 2024 mini auction: ‘ఆ ఇద్దరి కోసం ముంబయి ఇండియన్స్ పోటీ పడుతోంది’
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్ కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: పాక్లో ఆగని ఉగ్రవాదుల హత్యలు.. హఫీజ్ సయీద్ అనుచరుడి కాల్చివేత
-
Israel: లెబనాన్కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం..!
-
Rahul Gandhi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్
-
OnePlus 12: స్నాప్డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్తో వన్ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?