IND vs AUS: రెట్టించిన ఉత్సాహంతో..
ఉత్సాహం ఉరకలేస్తుంటే, తొలి రెండు వన్డేల్లో విజయం విశ్వాసాన్ని పెంచుతుంటే.. ఆఖరి సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. క్లీన్స్వీప్ ఊరిస్తుండగా, ప్రపంచకప్ సన్నాహాలకు అదిరే ముగింపు ఇవ్వాలనుకుంటున్న ఆతిథ్య జట్టు..
ఆస్ట్రేలియాతో మూడో వన్డే నేడు * క్లీన్స్వీప్పై కన్నేసిన భారత్ * మధ్యాహ్నం 1.30 నుంచి
ఉత్సాహం ఉరకలేస్తుంటే, తొలి రెండు వన్డేల్లో విజయం విశ్వాసాన్ని పెంచుతుంటే.. ఆఖరి సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. క్లీన్స్వీప్ ఊరిస్తుండగా, ప్రపంచకప్ సన్నాహాలకు అదిరే ముగింపు ఇవ్వాలనుకుంటున్న ఆతిథ్య జట్టు.. మూడో వన్డేలో బుధవారం ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. మరి రోహిత్సేన మరోసారి అభిమానులను మురిపిస్తుందా! 3-0తో సిరీస్ను ముగిస్తుందా?
రాజ్కోట్: క్లీన్స్వీప్పై కన్నేసిన టీమ్ఇండియా బుధవారం జరిగే చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. వన్డేల్లో ఎప్పుడూ కంగారులను వైట్వాష్ చేయని భారత్.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్తో తిరిగి జట్టులోకి రానున్నాడు.
అందుబాటులో 13 మందే: తొలి రెండు వన్డేల్లో ఆడని రోహిత్, కోహ్లి, కుల్దీప్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతారు. అయితే జట్టును వైరల్ జ్వరం పీడిస్తోంది. వివిధ కారణాల వల్ల మూడో వన్డేకు భారత్కు కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే సెలక్షన్కు అందుబాటులో ఉన్నారు. సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్కు విశ్రాంతినివ్వగా.. పేసర్లు షమి, శార్దూల్, సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని హార్దిక్ పాండ్య ఇంటికి వెళ్లిపోయారు. ‘‘జ్వరం కారణంగా చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి వెళ్లిపోయారు. కొందరికి విశ్రాంతినిచ్చాం. ప్రస్తుతం మాకు 13 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు’’ అని కెప్టెన్ రోహిత్ చెప్పాడు.
కొంతమంది ఆటగాళ్లు లేకపోయినా రోహిత్, కోహ్లి రాకతో టీమ్ఇండియా బలంగానే ఉందనడంలో సందేహం లేదు. కుల్దీప్ రాకతో స్పిన్ విభాగం కూడా బలపడనుంది. తొలి రెండు వన్డేల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్.. ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్తో పాటు కూర్పుపై ప్రశ్నలకు జవాబులు దొరికిన నేపథ్యంలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా శ్రేయస్, సూర్య జోరందుకోవడం జట్టుకు సంతోషాన్నిస్తోంది. మూడో వన్డేలో రోహిత్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. షమి, ప్రసిద్ధ్ కృష్ణల స్థానాల్లో బుమ్రా, సిరాజ్ జట్టులోకి వస్తారు. మ్యాచ్లో టీమ్ఇండియాను నిలువరించడం కంగారూలకు సవాలే. రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bumrah: బుమ్రా ముంబయి ఇండియన్స్ను వీడతాడా? సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన స్టార్ పేసర్
ముంబయి ఇండియన్స్ను ఆ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇన్స్టాగ్రామ్లో అన్ ఫాలో చేశాడు. దీంతో అతడు ముంబయి జట్టుని వీడతాడని ప్రచారం జరుగుతోంది. -
Australia: మిగిలిన టీ20లకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు..!
టీమ్ ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్కు ఆసీస్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. అరడజను మంది ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు. -
Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
Cameron Green IPL: బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్ మీద కాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన గ్రీన్పై ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా? -
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
ప్రపంచకప్ ఫైనల్ (ODI Worldcup 2023 Final)లో కోహ్లీ (Virat Kohli) వికెట్ తీయడం తనకు అద్భుతమైన క్షణమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (Pat Cummins) అన్నాడు. తన చివరి క్షణాల్లోనూ ఆ వికెట్టే గుర్తొస్తుందన్నాడు. -
Australia: ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
ప్రపంచకప్లో తొలుత ఎదురైన ఓటముల నుంచి ఎలా బయటపడ్డామనే రహస్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ బయటపెట్టాడు. కేవలం ఒక్క మీటింగ్ జట్టు ఆటతీరును మార్చేసిందన్నాడు. -
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో భారత జట్టు గట్టి పోటీదారుగా బరిలో దిగుతుందని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమ్ఇండియా కేంద్రంగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు. -
India vs Australia: సిరీస్పై భారత్ కన్ను
ప్రపంచకప్ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడుతూ తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన టీమ్ఇండియా.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలన్నదే లక్ష్యం. -
Hardik Pandya: వారసుడు ఇతనేనా?
అతడి కోసం గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ఆల్రౌండర్ను వదులుకుంది. అతడి కోసం రూ.15 కోట్లు చెల్లించింది. -
గుజరాత్ కెప్టెన్గా శుభ్మన్
గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమితుడయ్యాడు. ఈ టీమ్ఇండియా యువ సంచలనం వచ్చే ఏడాది ఐపీఎల్లో టైటాన్స్ను నడిపించనున్నాడు. -
రోహిత్ రాయుడు సెంచరీ వృథా
విజయ్ హజారె ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ నిలువరించింది. -
బంగ్లా - కివీస్ తొలి టెస్టు నేటి నుంచే
సొంతగడ్డపై న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో తలపడేందుకు బంగ్లాదేశ్ సై అంటోంది. మంగళవారం నుంచే తొలి టెస్టు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023- 2025 చక్రంలో ఈ రెండు జట్లకిదే తొలి మ్యాచ్. -
ముంబయితో ఎన్నో జ్ఞాపకాలు
ముంబయి ఇండియన్స్ జట్టుతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, తిరిగి జట్టుతో చేరడం బాగుందని హార్దిక్ తెలిపాడు. 2015లో ముంబయితోనే ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన అతను.. -
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ (Hasan Ali) తన మనసులోని మాటను బయటపెట్టాడు.


తాజా వార్తలు (Latest News)
-
Israel-Hamas: ‘హమాస్ వలలో పడొద్దు..తుపాకీ గురిపెట్టి నవ్విస్తున్నారు: ఇజ్రాయెల్ సైన్యం
-
Stalin: ₹400 కోట్లతో ఫుట్వేర్ పార్కు.. 20వేల మందికి ఉద్యోగాలు: సీఎం స్టాలిన్
-
WFI: డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం
-
Bombay HC: సోషల్ మీడియా సమాచారంతో ‘పిల్’.. తప్పుపట్టిన బాంబే హైకోర్టు!
-
Adani stocks: అదానీ స్టాక్స్లో భారీ ర్యాలీ.. రూ.1లక్ష కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
-
Bumrah: బుమ్రా ముంబయి ఇండియన్స్ను వీడతాడా? సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన స్టార్ పేసర్