ఆ ఆరుగురికి కార్లు అందజేత
ఆస్ట్రేలియాపై సత్తా చాటి భారత్ టెస్టు సిరీస్ నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆరుగురు యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, నటరాజన్,
దిల్లీ: ఆస్ట్రేలియాపై సత్తా చాటి భారత్ టెస్టు సిరీస్ నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆరుగురు యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైని.. మహీంద్రా థార్ ఎస్యూవీ కార్లు అందుకున్నారు. కంగారూలపై చారిత్రాత్మక ప్రదర్శన అనంతరం ఈ సిరీస్లో అదరగొట్టిన ఈ ఆరుగురు కుర్రాళ్లకు కార్లు ఇస్తున్నట్లు గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆయన సొంత ఖర్చుతో కార్లు అందజేశారు. మహీంద్ర కారు అందుకున్నట్లు చెబుతూ యువ పేసర్లు నటరాజన్, శార్దూల్ ఠాకూర్ ట్విటర్లో ఫొటోలు పోస్టు చేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్లో తొలి టెస్టు ఓడినా.. తర్వాత టెస్టును గెలిచిన భారత్.. గొప్ప పోరాటంతో మూడో టెస్టును డ్రా చేసుకుంది. చివరిదైన నాలుగో టెస్టులో అద్భుత విజయంతో సిరీస్ను నిలబెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ