ఐపీఎల్ నుంచి వైదొలగిన అంపైర్ మేనన్
ఐపీఎల్ బయో బబుల్ నుంచి నిష్క్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మ్యాచ్ రిఫరీ మను నయ్యర్, టాప్ అంపైర్ నితిన్ మేనన్ ఐపీఎల్ నుంచి వైదొలగారు. తల్లి మరణంతో నయ్యర్ బబుల్
దిల్లీ: ఐపీఎల్ బయో బబుల్ నుంచి నిష్క్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మ్యాచ్ రిఫరీ మను నయ్యర్, టాప్ అంపైర్ నితిన్ మేనన్ ఐపీఎల్ నుంచి వైదొలగారు. తల్లి మరణంతో నయ్యర్ బబుల్ నుంచి వెళ్లిపోయాడు. అతడు చివరగా మంగళవారం దిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్లో విధులు నిర్వర్తించాడు. ఆయన తల్లి నిద్రలోనే కన్నుమూసినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఇక నితిన్ మేనన్ తన భార్య, తల్లికి కొవిడ్-19 పాజిటివ్ రావడంతో బయో బబుల్ వీడినట్లు తెలుస్తోంది. మరో అంపైర్ రీఫిల్ (ఆస్ట్రేలియా) ఐపీఎల్ను వీడాలనుకున్నా ఆస్ట్రేలియా ప్రయాణ ఆంక్షల కారణంగా వెళ్లలేకపోయాడు. రీఫిల్ తన పరిస్థితి గురించి మాట్లాడుతూ.. ‘‘దోహాకు వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్దామనుకున్నా. ఇప్పుడు ఆ అవకాశం లేదు. టికెట్ రద్దు చేసుకున్నా. ఇంకో 10 నిమిషాల్లో బబుల్ను వీడతాననగా ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం లేదని తెలిసింది. అదృష్టం’’ అని రీఫిల్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల