బయో బుడగ సురక్షితం: జంపా
ఐపీఎల్లో ఏర్పాటు చేసిన బయో బుడగ సురక్షితమేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) తెలిపాడు. ఐపీఎల్ను చివరి దశ వరకు చూస్తామని
మెల్బోర్న్: ఐపీఎల్లో ఏర్పాటు చేసిన బయో బుడగ సురక్షితమేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) తెలిపాడు. ఐపీఎల్ను చివరి దశ వరకు చూస్తామని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ నుంచి వైదొలిగిన జంపా, కేన్ రిచర్డ్సన్ (బెంగళూరు) గురువారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. అంతకుముందు తామున్న బుడగ సురక్షితమేమీ కాదని.. గత ఏడాది మాదిరే ఈసారి కూడా ఐపీఎల్ను యూఏఈలో నిర్వహిస్తే బాగుంటుందన్న జంపా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాడు. ‘‘నేను, కేన్ క్షేమంగా.. సురక్షితంగా మెల్బోర్న్కు చేరుకున్నాం. ఐపీఎల్ బయో బబుల్ గురించి నా వ్యాఖ్యలకు.. వైరస్ ఏ దశలోనూ బుడగలోకి ప్రవేశిస్తుందన్న భావనతో సంబంధం లేదు. మేం సురక్షితంగా ఉండటానికి బీసీసీఐ, బెంగళూరు చాలా జాగ్రత్తలు తీసుకున్నాయి. గొప్ప వ్యక్తుల చేతుల్లో ఐపీఎల్ అత్యంత సురక్షితంగా ఉందని నమ్ముతున్నా. లీగ్ను ఫైనల్ మ్యాచ్ వరకు తప్పకుండా చూస్తాం’’ అని జంపా ఒక ప్రకటనలో తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్