వాళ్లతో పాటే మేమూ వెళ్లొచ్చు: మ్యాక్స్వెల్
ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ క్రికెటర్లతో పాటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ...
అహ్మదాబాద్: ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ క్రికెటర్లతో పాటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో బ్రిటన్కు వెళ్లొచ్చని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వ్యాఖ్యానించాడు. ‘‘స్వదేశం వెళ్లడానికి మార్గం కనుక్కోవాలి. బీసీసీఐ, ఇరు దేశాల ప్రభుత్వాలు పరిష్కారం కనుగొనచ్చు. కొంత సమయం ఎదురుచూడాల్సి వచ్చినా ఫర్వాలేదు. ఏదో ఒక దశలో ఇంటికి వెళ్లడానికి మార్గం దొరుకుతుంది. ఇంగ్లాండ్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా, న్యూజిలాండ్లు తలపడనున్నాయి. నాతో పాటు మిగతా ఆసీస్ ఆటగాళ్లు టీమ్ఇండియా, కివీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లతో ప్రత్యేక విమానంలో బ్రిటన్కు వెళ్లొచ్చు. అక్కడ్నుంచి స్వదేశం చేరుకోవచ్చు’’ అని మ్యాక్స్వెల్ తెలిపాడు. మ్యాక్స్వెల్ ఆలోచన పరిశీలించదగినదే అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘‘ఇంగ్లాండ్కు వెళ్లి.. అక్కడ్నుంచి ఆస్ట్రేలియాకు పయనమవడం ఆలోచించదగిన ప్రత్యామ్నాయం. బోర్డు ముందు చాలా ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీపడకుండా అత్యుత్తమమైన సురక్షిత మార్గాన్ని బీసీసీఐ ఎంపిక చేస్తుంది’’ అని ధుమాల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్