కివీస్‌దే మూడో టీ20

బంగ్లాదేశ్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు చేజార్చుకున్న న్యూజిలాండ్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది.

Updated : 06 Sep 2021 13:27 IST

ఢాకా: బంగ్లాదేశ్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు చేజార్చుకున్న న్యూజిలాండ్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 52 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. మొదట న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 128/5 స్కోరు చేసింది. నికోల్స్‌ (36 నాటౌట్‌), బ్లండెల్‌ (30 నాటౌట్‌) రాణించారు. అజాజ్‌ పటేల్‌ (4/16), కోల్‌ మెకంజీ (3/15) దెబ్బకు బంగ్లా 19.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. రహీమ్‌ (20 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని