సూపర్-12కు చేరువలో స్కాట్లాండ్
టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్లో తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్కు షాకిచ్చిన స్కాట్లాండ్.. రెండో మ్యాచ్లోనూ నిలకడను కొనసాగించింది. మంగళవారం ఆ జట్టు గ్రూప్-బిలో పపువా న్యూ గినియాను 17 పరుగుల తేడాతో ఓడించి సూపర్-12 అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
పపువా న్యూ గినియాపైనా విజయం
అల్ అమెరాట్: టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్లో తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్కు షాకిచ్చిన స్కాట్లాండ్.. రెండో మ్యాచ్లోనూ నిలకడను కొనసాగించింది. మంగళవారం ఆ జట్టు గ్రూప్-బిలో పపువా న్యూ గినియాను 17 పరుగుల తేడాతో ఓడించి సూపర్-12 అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. రిచీ బెరింగ్టన్ (70; 49 బంతుల్లో 6×4, 3×6), మాథ్యూ క్రాస్ (45; 36 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. 26 పరుగులకే 2 వికెట్లు పడ్డ స్థితిలో బెరింగ్టన్, క్రాస్ మూడో వికెట్కు 92 పరుగులు చేసి జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. అయితే చివరి ఓవర్లలో స్కాట్లాండ్.. మోరియా (4/31), సోపర్ (3/24)ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసింది. అనంతరం డేవీ (4/18) విజృంభించడంతో పపువా న్యూ గినియా బ్యాట్స్మెన్ నిలవలేకపోయారు. ఒక దశలో 67 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. అయితే వనువా (47), బవు (24), డొరిగా (18) పోరాడటంతో పపువా న్యూ గినియా గౌరవప్రదంగా ఓడింది. గ్రూప్లో తమ చివరి మ్యాచ్లో స్కాట్లాండ్.. ఒమన్ను ఢీకొంటుంది.
టీ20 ప్రపంచకప్లో ఈనాడు
నెదర్లాండ్స్ × నమీబియా మ।। 3.30 నుంచి
శ్రీలంక × ఐర్లాండ్ రాత్రి 7.30 నుంచి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్