Lionel Messi:మెస్సికి కరోనా
దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సి కరోనా పాజిటివ్గా తేలాడు. పారిస్ సెయింట్- జర్మెయిన్ (పీఎస్జీ) జట్టులో మెస్సి సహా నలుగురు ఆటగాళ్లకు పాజిటివ్ వచ్చినట్లు పీఎస్జీ ప్రకటించింది.
పారిస్: దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సి కరోనా పాజిటివ్గా తేలాడు. పారిస్ సెయింట్- జర్మెయిన్ (పీఎస్జీ) జట్టులో మెస్సి సహా నలుగురు ఆటగాళ్లకు పాజిటివ్ వచ్చినట్లు పీఎస్జీ ప్రకటించింది. సోమవారం రాత్రి ఫ్రెంచ్ కప్ మ్యాచ్కు ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెస్సి, జువాన్ బెర్నాట్, సెర్గీ రైకో, నేథన్ బితుమజాలాతో పాటు సహాయక సిబ్బందిలో ఒకరు పాజిటివ్గా తేలారు. ప్రసుతం వీరంతా ఐసోలేషన్లో ఉన్నారు.
మెక్గ్రాత్కు అప్పుడే..: ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్కు కరోనా పాజిటివ్ వచ్చింది. సిడ్నీలో డిసెంబరు 16న మొదలైన గులాబీ టెస్టుకు ముందే మెక్గ్రాత్ పాజిటివ్గా తేలాడు. యాషెస్ సిరీస్లో నాలుగో టెస్టును రొమ్ము క్యాన్సర్తో మరణించిన మెక్గ్రాత్ భార్య జేన్ స్మారకంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 5న ప్రారంభం కానున్న సిడ్నీ టెస్టులో మూడో రోజును ‘జేన్ మెక్గ్రాత్ డే’గా పిలుస్తారు. ఆ రోజు జరిగే కార్యక్రమానికి మెక్గ్రాత్ హాజరవుతాడా? అన్నది అనుమానమే. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు బ్యాగీ పింక్ టోపీల ప్రదాన కార్యక్రమంలో మెక్గ్రాత్ వర్చువల్గా పాల్గొననున్నాడు. ఇప్పటికే ఆసీస్ 3-0తో యాషెస్ సిరీస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ కోచ్కు పాజిటివ్: యాషెస్ సిరీస్లో ఘోరంగా విఫలమవుతున్న ఇంగ్లాండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ చీఫ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ కరోనా పాజిటివ్గా తేలాడు. కుటుంబంతో కలిసి క్వారంటైన్లో ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించగా సిల్వర్వుడ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో బుధవారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు సిల్వర్వుడ్ అందుబాటులో ఉండట్లేదు. ఈనెల 8 వరకు అతను ఐసోలేషన్లో ఉండనున్నాడు. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నందున సహాయక కోచ్ ఆడమ్ హోలియాక్ నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని ఈసీబీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో సహాయక కోచ్ గ్రాహమ్ థోర్ప్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన శిక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు నెట్ బౌలర్ పాజిటివ్గా తేలడంతో సిడ్నీలో ఆదివారం జరగాల్సిన ఇంగ్లాండ్ ప్రాక్టీస్ సెషన్ రద్దయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్